ntr baadshah

ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా..జగన్ పొలిటికల్ బాద్‌షా ఫ్లెక్సీలు

        విశాఖజిల్లాలో బాద్‌షా చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలు వివాదాన్ని రేపుతున్నాయి. కిన్నెర థియేటర్ దగ్గర జగన్, జూ.ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ పొలిటికల్ బాద్‌షా...ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా  అంటూ ఫ్లెక్సీలపై రాతలు రాశారు. అయితే ఈ రాతలు రాజకీయాలకు అతీతం అని పెట్టడం విశేషం. కాగా ఈ ఫ్లెక్సీలపై బాలకృష్ణ, జూ.ఎన్టీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. థియేటర్‌పై దాడిచేస్తామనే హెచ్చరికలతో ఫ్లెక్సీలను తొలగించారు.   మరోవైపు కృష్ణా జిల్లాలో గుడివాడలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసి ఫ్లెక్సీల్లో టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ఫోటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. మరో రెండు ఫ్లెక్సీల్లోనూ ఫోటోను కత్తిరించడంతో రావి అభిమానులు ఆందోళనకు దిగారు.

chandrababu padayatra

ఎన్నాళ్లని జెండాలు మోస్తారు

        మీరంతా కష్టాల్లో ఉన్నారు.. అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారు.. ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటాం.. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం..'' అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, టీడీపీ గెలుపు ఒక చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలో రావచ్చు. ఆరు నెలల్లోనైనా రావచ్చు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడం తప్పనిసరని చంద్రబాబు పేర్కొన్నారు.

ntr baadshah

ఎన్టీఆర్ బాద్‌షా ఫ్లెక్సీలలో జగన్

        వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ను ఇప్పట్లో వదిలేలా కనపడడం లేదు. మొన్న జూనియర్ ఎన్టీఆర్, నిన్న సీనియర్ ఎన్టీఆర్ ను జగన్ పార్టీ ఫ్లెక్సీల లో వాడేసుకుంది. అయితే ఓ వర్గం ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఆ పార్టీ ఈ ఎత్తుగడలను వేస్తుందని భావిస్తున్నారు. తాజాగా 'బాద్ షా' సినిమా విడుదల నేపధ్యంలో ఏర్పాటైన ఫ్లెక్సీల లో జగన్ ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. చీరాల మోహన్ థియేటర్ వద్ద అభిమానులు జగన్ తో ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ముందు జాగ్రత్తగా థియేటర్ యాజమాన్యం వాటిని తొలగించింది. తిరువూరు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొడాలి నాని, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనలతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు.

No power tariff hike up to 200 units

కిరణ్ తగ్గింపులు ... తృప్తి చెందని విపక్షాలు

  గత కొద్దిరోజులుగా విపక్షాలు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు, నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే. స్వపక్షంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై గురువారం మంత్రులు, విద్యుత్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, ఆనం రాంనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారథి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గృహ వినియోగదారులకు కొత్తగా పెరిగిన కరెంటు ఛార్జీల భారంలో 830 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని, నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు వాడుకునే వారికి పాత ఛార్జీలనే కొనసాగిస్తామని, 201 యూనిట్ల నుంచి ఆపైన వాడుకునే వారికి మొదటి యూనిట్ నుండి కొత్తగా పెరిగిన ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులు రెండు కోట్లు ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1.86 కోట్ల ప్రజలకు కరెంటు ఛార్జీల పెంపు నుంచి ఉపశమనం పొందుతారని అన్నారు. విపక్షాలు మాత్రం సిఎం నిర్ణయంతో సంతృప్తికరంగా లేరు. ఈనెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్త బంద్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

TDP Spokesmen Revanth Reddy Fires On YSRCP

దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ ఫోటోలు పెట్టుకోండి ... రేవంత్ రెడ్డి

  టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారంవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ... జగన్, వైఎస్సార్ ఫోటోలు  పెట్టుకుంటే ప్రజలకు దొంగలు, దోపిడీదారులు గుర్తుకు వస్తారని భయపడి వైఎస్సార్సీపీ ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకునే కొత్త బిచ్చగాళ్ళు, పగటి వేషగాళ్ళ పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని, ఎన్టీఆర్ నిజాయితీ పరుడని, నిజాయితీకి మారుపేరని అన్నారు. ఆయన ఫోటోను వైఎస్సార్సీపీ పార్టీ ఫ్లెక్సీలపై పెట్టుకుని మలినపరుస్తున్నారని, ఎన్టీఆర్ ఎప్పుడూ వైఎస్సార్ తో రాజీ పడలేదని, జగన్, వైఎస్సార్ ఫోటోలు పట్టుకుని ఓట్లు సంపాదించే రోజులు పోయాయని ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ వంటివారి ఫోటోలు పెట్టుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి వైఎస్సార్సీపీ వారికి సలహా ఇస్తున్నారు.

Chandra Babu Naidu Vastunna Meekosam Padayatra

అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలి ... చంద్రబాబు

  ప్రధాన ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్నారు. బాబు పాదయాత్ర గురువారం పిఠాపురం, ప్రత్తిపాడు నియోకవర్గాలలో సాగింది. పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని, అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలని, తొమ్మిదేళ్ళుగా కార్యకర్తలు పార్టీ జెండాలు మోస్తూనే వున్నారని, ఇంకా ఎన్నాళ్ళు జెండాలు మోస్తూ ఉంటారని, మనలో ఉన్న పట్టుదలకు కసి తోడవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

renuka chowdary congress

రేణుకా చౌదరి ఇంటి పై కోడిగుడ్లు

        తెలంగాణ ఆత్మహత్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ఇంటిని గురువారం తెలంగాణవాదులు ముట్టడించారు. రేణుక చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున రేణుకా చౌదరి ఇంటిముందు ధర్నాకు దిగారు. పలువురు ఆమె ఇంటి పైకి కోడి గుడ్లు విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రేణుక దిగి వచ్చే వరకు తాము తమ ఆందోళనను విరమించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుందని భావించిన పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

 Rahul speech impressive

పేదలకు సమాజంలో గుర్తింపు లేదు: రాహుల్

        ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ భారత్‌లో ఉన్నన్ని సహజవనరులు ఎక్కడా లేవన్నారు. అలాగే దేశంలో మేధావులకు, నిపుణులకు ఏమాత్రం కొదువ లేదన్నారు. కొన్నేళ్లుగా భారత్ పారిశ్రామికరంగంలో దూసుకుపోతోందన్నారు. దేశ అభివృద్ధికి రోడ్లు, రవాణా, విద్యుత్ చాలాకీలకం అన్నారు. పేద ప్రజలకు సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.   గత ఐదేళ్లలో భారత కార్పోరేట్ రంగం కష్టపడి పనిచేసిందని రాహుల్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కార్పోరేట్ రంగం సహకారం అవసరమని, మౌలిక సదుపాయాలు వృద్ధి చేయకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు అవసరమని, ప్రపంచ స్థాయి విద్య మన పిల్లలకు అందించాలని రాహుల్ వెల్లడించారు. యుపిఏ పాలనలో దేశం చాలా అభివృద్ధి చెందిందని రాహుల్ చెప్పారు.

anil ambhani

అంబానీలను కలిపిన నయనతార పెళ్ళి

  ఒకరిపై మరొకరికి సరయిన రిలయన్స్ లేకపోవడంతో ఐదేళ్ల క్రితం విడిపోయిన ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలను నయనతార కలిపింది. అదికాకుండా ఇటీవలే ఆమె పెళ్లి కూడా చేసేసుకోంది. అంభానీసోదరులు ఆమె పెళ్లికి రావడమే కాకుండా వారిరువురూ 1,200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం కూడా అక్కడే చేసుకొన్నారు.   నయనతార పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పెళ్ళికి అంభానీలు రావడం ఏమిటి? అంభానీలను నయనతార కలపడమేమిటి? అన్నదమ్ముల సవాల్ అంటూ విడిపోయిన అంభానీ సోదరులు మళ్ళీ కలిసి 1,200 కోట్ల బిజినెస్ ఏమిటి? అంతా గందరగోళంగా ఉందా? అయితే ఈ కధ పూర్తిగా వినవలసిందే మరి. ఫ్లాష్ బ్యాకులో ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలు గొడవలు పడివిడిపోవడం మనం ఇదివరకే చూసేసాము గనుక ఇప్పుడు ఆ స్టోరీ వద్దు. నేరుగా ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే కధ మొదలుపెట్టుకొందాము.   ఇక, గ్రీకువీరుడుతో రోమాన్స్ చేస్తున్న మన నయనతార ఇంకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ, అంభానీలకి కూడా నయనతార అనే ఒక మేనకోడలు ఉంది. ప్రస్తుతం జరిగింది ఆమె పెళ్ళే. ముకేష్ అంభానీ ముచ్చటపడి ముంబైలో కట్టించుకొన్న తన 27 అంతస్తుల అంటిలా కుటీరంలో ఆమె పెళ్ళికి తన సోదరుడు అనిల్ అంభానీని కూడా ఆహ్వానించారు.   ఆ సందర్భంగా కలిసిన అంభానీ సోదరులు నయనతార పెళ్లి మాట ఎలా ఉన్నా, 1200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం చేసుకొని యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ముకేష్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగించుకునేందుకు ఒప్పందం కుదిరింది.   త్వరలోనే దేశంలో 4జి సర్వీసులను ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న ముకేష్ అంభానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ కంపెనీ దానికి అవసరమయిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పెద్దగా పెట్టుబడి అక్కరలేకుండానే (కేవలం 1200 కోట్లతోనే) తనపని పూర్తిచేసుకొనే అవకాశం ఈ ఒప్పందంవలన ఏర్పడగా, భారీ పెట్టుబడి పెట్టి దేశ వ్యాప్తంగా ఆప్టికల్ కేబిల్స్ వేసినప్పటికీ దానినుండి ఆశించిన ఫలితం రాకపోవడంతో నష్టాలు చవిచూస్తున్న అనిల్ అంబానీ కంపెనీ ఆర్‌కామ్‌ కు ఈ ఒప్పందం వలన ఒకేసారి ఊహించని బిజినెస్ దొరికింది. తద్వారా అన్నదమ్ములిద్దరి కంపెనీలు లాభాపడటమే కాకుండా, డబ్బు మొత్తం వారి కుటుంబంలోనే చేతులు మారుతుంది.   ఈ అన్నదమ్ముల అనుబంధం మరింత బలపడితే మున్ముందు ఇద్దరూ చేతులు కలిపి ఒకరికొకరు చేయూతనందించుకొంటూ తమకి చెందిన కంపెనీలలో నష్టాల్లో ఉన్న కొన్నిటిని మళ్ళీ చక్కబెట్టుకోవచ్చును. ఇదివరకే అనిల్‌ అంభానీకు చెందిన మ్యూచ్‌ఫండ్ సంస్థలలో ముకేష్ కంపెనీలు దాదాపు 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.   ఇప్పుడు వారిరువురి మద్య ఏర్పడిన సహృద్భావా వాతావరణంతో వారిరువురు కలిసి మరిన్నివ్యాపార ఒప్పందాలు చేసుకొన్నా ఆశ్చర్యం లేదు. ఇది వారికే కాక వారి సంస్థలలో షేర్ల రూపంలో పెట్టుబడిన మదుపరులకు లాభాలను ఆర్జించి పెట్టే అవకాశం కూడా ఉంది. ఏమయినప్పటికీ ఈ అన్నదమ్ముల అనుబంధం ఎంత దృడంగా ఉంటే అంత అందరికీ లాభాలు పండుతాయి.

talasani srinivas yadav tdp

తలసానికి టీఆర్ఎస్ ప్రతి సవాల్

        దమ్ముంటే కేసీఆర్ సికింద్రాబాద్ లో పోటీ చేసి గెలవాలని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విసిరిన సవాల్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మండిపడుతున్నారు. కేసీఆర్ ను సికింద్రాబాద్ నుండి పోటీచేయాలని సవాల్ విసురుతున్న శ్రీనివాస్ యాదవ్ చేతనయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిద్దిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఒప్పించాలని కొప్పుల ఈశ్వర్ ప్రతి సవాల్ విసిరారు. ''2004లో మా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో దారుణంగా ఓడిపోయావు'' అలాంటి నీవు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ చేయడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్ స్థాయికి నీవు సరిపోవు. కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని ఆయన అన్నారు.

Sr NTR backs YSR Congress

సీనియర్ ఎన్టీఆర్ ను వదలని జగన్ పార్టీ

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్, దివంగత ఎన్టీఆర్ ను తమ పార్టీ కోసం తెగవాడేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీ పెట్టడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఆ తరువాత దానిని తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెట్టి షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేశారు.   జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టి నాలుగురోజులు గడవక ముందే సీనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సామాన్యులకు పనికివచ్చిన పథకాలు రెండే రెండు అవి ఒకటి ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలోబియ్యం, రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అని ప్రకటించుకున్నారు. అసలు ఈ పార్టీకి, ఎన్టీఆర్ వున్న లింకేంటో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. 

sachin tendulkar

నేను దేవుడ్ని కాను: సచిన్ టెండుల్కర్

  క్రికెట్ అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “నా అభిమానులు భావిస్తున్నట్లు నేనేమి క్రికెట్ దేవుడ్ని కాను. నేను కూడా ఒక సామాన్య మానవుడినే. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తప్పులు చేయదు కానీ, నేను మాత్రం చాలా తప్పులే చేశాను. అందరూ నేను100వ సెంచరీ పూర్తి చేసినందుకు అభినందిస్తుంటే నేను మాత్రం 100వ సెంచరీ చేయడానికి నాకెందుకు ఇంత ఆలస్యంగా జరిగింది అంటూ ఆ దేవుడ్ని ప్రశ్నిస్తున్నాను. నా అభిమానులకు నేను ఆరాద్యుడిని కావచ్చునేమో కానీ, నాకు మాత్రం వివిన్ రిచర్డ్స్ మరియు సునీల్ గవాస్కర్ లే ఆరాద్యులు. నా ఆటకు స్పూర్తి నిచ్చిన వారు వారిరువురే.” అని తెలిపారు.   ఆయన వరుస వైఫల్యాలను చూసి అనేక మంది గత కొంత కాలంగా క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని ఒత్తిళ్ళు చేయడంతో అయిష్టంగానే అంతర్జాతీయ వన్ డే మ్యాచుల నుండి తప్పుకొన్న సచిన్ టెండుల్కర్, టెస్ట్ మ్యచ్చులో కూడా అంతగా రాణించక పోవడంతో ఆయనకు వ్యతిరేఖంగా ఇంకా నిరసనలు వెలువడుతూనే ఉన్నాయి. బహుశః అనుడుకు జవాబుగా ఆయన ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చును.   ఆయన క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఆయనకీ ఎవరూ చెప్పనవసరం లేదని, ఆ విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసునని, అందువల్ల ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వలనేది ఇష్టమని రాజీవ్ శుక్లా అన్నారు.

 NTR Srinu Vytla

'బాద్ షా' తిరుమలలో శ్రీను వైట్ల పూజ

        'బాద్ షా' చిత్రం ఘనవిజయం సాధించాలని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ప్రార్ధనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకు వెళ్లి దర్శకుడు శ్రీను వైట్ల శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని, తన వెంట తీసుకువచ్చిన 'బాద్‌షా' రీల్‌ బాక్స్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అలాగే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.

నేడు తేలనున్న విద్యుత్ ఛార్జీల పెంపు భవితవ్యం

  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ విద్యుత్ సర్ ఛార్చిల వసూలు విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి నేడు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు, విద్యుత్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఛార్జీల పంపుదాలను సమీక్షిస్తామని, గత ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచిన తరువాత స్వల్పంగా తగ్గించారు. 150 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు కొంతమేర ఛార్జీలు తగ్గించాలని మంత్రులు కోరుతున్నారు. ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోలేకపోతే రేపు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.

కాపులకు చంద్రబాబు నాయుడు వరాల జల్లు

  తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలు సాగిస్తున్న టి.డి.పి. అధిపతి చంద్రబాబు నాయుడు కాపులపై వరాల జల్లు కురిపించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన వివిధ సభల్లో మాట్లాడుతూ ... అగ్రవర్ణాల్లో కాపుల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి ఏటా వెయ్యి కోట్లు రూపాయలు ఐదుసంవత్సరాలపాటు ఐదు కోట్లు వెచ్చిస్తామని, టిడిపి అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ అంశంపైనా సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని, బిసి రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకోసం ప్రత్యేక రిజర్వేషన్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని, ముందునుంచీ కాపులు తమ పార్టీకి మద్ధతుగా ఉన్నారని, చిరంజీవిని నమ్మి కొంతకాలం దూరం కావడం వల్లే గతఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని, వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాపులకు వాగ్దానం చేశారు.

నటి జయప్రద రాజమండ్రీ టికెట్ రాజకీయాలు

  ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నుండి లోక్ సభకు ఎన్నికయిన జయప్రద అక్కడ ములాయం సింగ్, మాయవతిల సహచర్యంలో పార్టీలు, రాజకీయాలు, సిద్ధాంతాల గురించి బాగానే ఒంట పట్టించుకోన్నట్లే కనిపిస్తున్నారు. ఆమె రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటి నుండి ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు ఏవి ఫలించకపోవడం వలన ఇంకా గోడ మీదనే కూర్చొని చూస్తున్నారు.   కొన్ని రోజులు కాంగ్రెస్ అధినేత్రితో తనకున్న పరిచయాల గురించి, మరి కొన్ని రోజులు తెదేపాతో తనకున్న పాత అనుబంధం గురించి, మరి కొన్ని రోజులు వైకాపాకు పేటెంట్ చేసుకొన్న ‘విశ్వసనీయత’ గురించి, స్వర్గీయ వైయస్సార్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి మాట్లాడుతూ అన్ని పార్టీలకి గాలాలు వేసి చూసారు. ఆమె తనకి అన్ని పార్టీల నుండి ఆహ్వానాలు అందాయని కానీ తానే ఇంకా ఏపార్టీలో చేరాలో నిర్ణయించు కాలేదని, ఈ నెలాఖరులోగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.   ఆమె ఇంతవరకు పార్టీని నిర్ణయించుకోకపోయినా తానూ పోటీ చేయబోయే నియోజక వర్గాన్ని మాత్రం తనకు తానే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా పార్టీలను వేట్టుకొనే పనిలో ఉన్నారు. అందువల్ల ఆమెకు రాజమండ్రీ .నుండి పోటీ చేసేందుకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోనే చేరాలనుకొంటున్నారు గనుక అప్పుడు ఆ పార్టీ సిద్దాంతాలు నచ్చినట్లు మనకి చెప్పబోతున్నారు. అంటే టికెట్ కోసమే సిద్ధాంతాలు తప్ప, పార్టీలో చేరడానికి అవేవి అడ్డుకావని ఆమె ముందే తన ‘ప్రజాసేవ లక్షణాలను’ చాటుకొన్నారు.   రాష్ట్రంలో అన్ని పార్టీలకు గాలం వేసి దేనిలో అవకాశం వస్తే అందులో చేరేందుకు సిద్దపడిన ఆమె, రేపు ఏదో ఒక పార్టీలో చేరిన తరువాత మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించడం కూడా త్వరలోనే మనం చూడబోతున్నాము. చాలా ఏళ్ల తరువాత రాష్ట్రానికి వచ్చిన ఆమె కేవలం టికెట్టే ప్రాతిపాదికన రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం చూస్తే ఆమె రాష్ట్ర రాజకీయాలలో ఏమి ఆశించి అడుగుపెడుతున్నారో అర్ధం అవుతుంది.   ఆమె తన రాంపూర్ నియోజక వర్గం ప్రజల బాగోగులు గాలికొదిలేసి ఇక్కడ తన రాజకీయ జీవితం చక్కబెట్టుకొంటున్న విధంగానే, రేపు ఏ పార్టీ నుండి రాజమండ్రీ పోటీ చేసి ఎన్నికయినా అక్కడి ప్రజలకూ ఆమె మొహం చాటేయాకమానరు. రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టక మునుపే, తనకు ‘రాజమండ్రీ టికెట్ యావ’ తప్ప ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, పార్టీల పట్ల ఒక నిశ్చిత అభిప్రాయం గానీ ఏమీ లేవని ఆమె తన మాటల ద్వారా స్పష్టంగానే చెపుతున్నారు.   ఒకవేళ ఆమెకు తెలుగుదేశం పార్టీ కనుక రాజమండ్రీ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే, అప్పుడు ఆమె దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చెడ్డవయిపోతాయన్నమాట. అప్పుడు ఆమె జగన్ మోహన్ రెడ్డిని అవినీతి పరుడని విమర్శించవచ్చును, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పార్టీ అని విమర్శించావచ్చును. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీలో మురళీ మోహన్ రాజమండ్రీ నుండి పోటీ చేయడం దాదాపు ఖాయం కనుక ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆమెకు మిగిలింది.   తాజా సమాచారం ప్రకారం ఆమె ఆ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆమె దృష్టిలో మంచివాడు అవుతారు గనుక రేపు ప్రజలకి కూడా ఆమె అదే చెప్పి నమ్మమని కోరుతారు. అదే సమయంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలలో లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు ఆమె మొదలుపెట్టవచ్చును. ఈ విధంగా ఒక సిద్దాంతం, తనకంటూ ఒక అభిప్రాయం లేని జయప్రద రాజమండ్రీ టిక్కేటే లక్ష్యంగా తన రాజకీయ జీవితం మొదలు పెట్టబోతున్నారు.   ఇటువంటి రాజకీయ లక్షణాలు కేవలం ఆమెకు ఒక్కరికే ఉన్నాయని కాదు గానీ, చాలా ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న ఆమె కనీసం కొన్ని విలువలు కలిగి ఉండి హుందాతనం ప్రదర్శించి ఉంటే ఈవిధమయిన విమర్శలకు తావు ఉండేది కాదు.   ఇక ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి, ఇటీవలే ఆ పార్టీలో చేరిన శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చాలా కలవార పడుతున్నారు. తన కుమారుడికి రాజమండ్రి లోకసభ టిక్కెట్ ఇచ్చే షరతు మీద ౩౦ ఏళ్లుగా నమ్ముకొన్న తెలుగు దేశం పార్టీని వదిలిపెట్టి కొద్ది వారల క్రితమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఇప్పుడు డిల్లీ నుండి అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రద జగన్ మోహన్ రెడ్డిని రాజమండ్రీ టికెట్టు తనకు ఇచ్చేలా ఒప్పించుకొని పార్టీలో చేరినట్లయితే తన పని రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని ఆయన కలవర పడుతున్నారు. అందువల్ల అన్ని పార్టీలలో రాజమండ్రి అభ్యర్ధులకు ఆమె పిలవని పేరంటంగా కనబడటంలో ఆశ్చర్యం లేదు.

చట్టం వచ్చినా ఆగని లైంగిక వేధింపు, దాడులు

  మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అత్యాచార నితోధక బిల్లుకు ఆమోదముద్ర పొందిన రాత్రే నాగపూర్ లో ఒక ప్రేమ్నోన్మాది స్థానిక కళాశాలలో పనిచేస్తున్న యోగేశ్వర్ డాఖేరే ముమార్తే ఆశ్వినిని గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న జమొద్దీన్ ఖాన్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.  ఈ విషయం తెలుసుకున్న యోగేశ్వర్ జమొద్దీన్ ఖాన్ ను పిలిచి మందలించాడు. దీంతో పగను పెంచుకున్న జమొద్దీన్ ఖాన్ మంగళవారం రాత్రి యోగేశ్వర్ ఇంట్లోకి ప్రవేశించి అతని తలను నాటుతుపాకీతో కాల్చి, యోగేశ్వర్ భార్యను కత్తితో గాయపరిచాడు. అనంతరం అశ్విని వెంటపడి ఆమెను బలవంతంగా మేడపైకి తీసుకువెళ్ళి అక్కడినుండి తోసేయడానికి ప్రయత్నించాడు. అశ్విని ప్రతిఘటించడంతో అది సాధ్యం కాలేదు. అశ్విని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జమొద్దీన్ ఖాన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరొక ఘటనలో ఉత్తరప్రదేశ్ లోని షమ్మీ జిల్లాలో నలుగురు అక్కాచెల్లెళ్ళు కమర్ జహాన్. ఆయేషా, ఇషా, సనమ్ లపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వారిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వీరు నలుగురూ ఉపాధ్యాయినులుగా పనిచేస్తున్నారు. వెంటనే వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరగడం నిజంగా యావత్ భారతజాతి  సిగ్గుపడాల్సిన విషయం.