హైదరాబాద్ లో జోరందుకున్న విభజన రాజకీయాలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపించడంతో హైదరాబాద్ లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. అనంతరం లేక్ వ్యూ గెస్టు హౌస్లో పలువురు నేతలను కలిశారు. ఆ తర్వాత కిరణ్తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆరు గంటల తర్వాత పిసిసి కార్యవర్గంతో భేటీ అవుతారు.
అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిశారు.
విభజనపై అధిష్టానంకు సహకరించాలని సీఎ౦ కిరణ్ ను అడగగా... ససేమీరా అన్నారట. సమైక్యంపై తమ నిర్ణయంలో మార్పు ఉండదని, మీరే పునరాలోచించుకోవాలని కిరణ్ చెప్పగా.. డిగ్గీ కూడా ఈ సమయంలో టిపై వెనక్కి వెళ్లలేమని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారట.