స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తనముందు వున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయనను ఏపీ ఎన్జీఓలు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగుల పోరాటం అద్వితీయమని కొనియాడారు. సమైక్య ఉద్యమ ఘనత ఎన్జీవోలదే అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, అమెరికాలో ఆఫీస్ ఆఫీస్ తిరిగి కంపెనీలు తీసుకువచ్చానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చుదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.