ఏదో మతలబు ఉంది.. ఉత్తమ్

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై విమర్శలు గుప్పించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన మంత్రి హరీష్ రావు, సీఎం కెసిఆర్‌లకే అవగాహన లేదని, ప్రాజెక్టు రూపకల్పననే మార్చడం వెనుక ఏదో మతలబు ఉందని అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరంకు ప్రాజెక్టు మార్చడం సరికాదన్నారు.

Teluguone gnews banner