అందుకే నాపై కక్షగట్టారు.. సెబాస్టియన్

 

ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ను పరోక్షంగా విమర్శించారు. కావాలనే ఓటుకు నోటు కేసులో సాక్షి ఛానల్ తనపై బురద చల్లే ప్రయత్న చేస్తుందని.. బైబిల్‌ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయరాదని ఒకసారి ఏబీఎన్‌ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పానని.. అందుకే నాపై కక్షగట్టి ఇలా కథనాలు రాస్తున్నారని అన్నారు. ఏదో వాయిస్ ను డబ్బింగ్‌ చేసి దానిని రికార్డ్ చేసి నా వాయిస్ అని చెప్పి టెలికాస్ట్‌ చేస్తోందని ఆయన విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని దెబ్బగొట్టలేరని.. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని సెబాస్టియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Teluguone gnews banner