భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్షా
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, వైద్య అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.