పప్పులో కాలేసిన జగన్ భార్య... జగన్ అనుకొని..!

  పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని చూస్తే ఎవరిలా అనిపిస్తుంది... జాగ్రత్తగా చూడండి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫొటోలా అనిపించడం లేదు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది వైఎస్ జగన్ కాదు. పాపం జగన్ భార్య కూడా అలానే అనుకొని ఈ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరువాత పప్పులో కాలేసినట్టు తెలిసింది. ఆమె పొరపడిందో లేక... భార‌తి పేరుతో ట్విట్ట‌ర్ నిర్వ‌హిస్తున్న వారి పొర‌పాటో, తెలియదు కానీ పాపం అడ్డంగా బుక్కయ్యారు. అసలు ఆ ఫొటో ఏంటీ...? ఆ స్టోరీ ఏంటీ...? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.     YSBharathiReddy ఐడీతో ఓ ఫొటోని పోస్టే చేశారు. అందులో ప‌చ్చ‌ని పొలాల‌లో జ‌గ‌న్ నీళ్లు తాగుతున్న ఫోటో పెట్టి This picture speaks more than anything..అనే హ్యాష్ ట్యాగ్‌ కూడా పెట్టారు. తీరా చూస్తే అది జగన్ ఫొటో కాదని తేలిపోయింది. అది నంద్యాల సాక్షి టీవీ కంట్రిబ్యూట‌ర్ ప్ర‌దీప్ సాల్మ‌న్‌రాజ్ ఫొటో అంట. అతన్ని జగన్ అనుకొని భ్రమపడి ఫొటోను పోస్ట్ చేశారట. ఇదిలా ఉంటే.. ఇక తన ఫొటో ను జగన్ ఫొటో అనుకొని పెట్టిన సాల్మన్ రాజ్ అయితే త‌న్ను అంద‌రూ జ‌గ‌న్ అనుకోవ‌డం జీవితంలో మ‌రిచిపోలేని అనుభూతి అంటూ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఫొటో పెట్టి జగన్ ను ఏదో ఆకాశానికి ఎత్తేద్దామనుకున్న జగన్ అండ్ బ్యాచ్ కు గట్టి షాక్ తిగిలినంత పనైంది. అంతేకాదు కొంత మంది అయితే జోకులు కూడా పేల్చుకుంటున్నారు..? జగన్ పాదయాత్రకు సరైన స్పందన రావడంలేదని..  ఆ టెన్షన్ లోనే.. త‌న భ‌ర్త‌ను కూడా పోల్చుకోలేని స్థితికి భారతి చేరింద‌ని అంటున్నారు.   మరోవైపు.. ఓ రకంగా ఈ ఫొటో పెట్టి మంచి పని చేశారు అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే.. ఫోటో చుట్టూ ఉన్న ప‌చ్చ‌ని పంట పొలాలు, బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు.. క‌రువుసీమ రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చిన టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌కు ప‌చ్చ‌ని సంకేతంగా నిలుస్తోందని చెప్పుకుంటున్నారు. దీంతో జగన్ పాద‌యాత్ర చాలా నీరసంగా జరుగుతుంది... మళ్లీ ఈ ఫొటో పెట్టి మూలిగే న‌క్క‌ మీద తాటికాయ పడ్డట్టు చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి జగన్ కు మాత్రం ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరానట్టే ఉంది.

దేవుడా.. జగన్ కు ఇంత అవమానమా..?

  పాపం జగన్ పరిస్థితి ఏలా ఉందంటే.. కామెడీగా సెటైర్లు వేసుకోవడానికి అన్నట్టు తయారైంది. ఇప్పటికే పాదయాత్ర అంటూ.. శుక్రవారం కోర్టు కు అంటూ తిరుగుతున్న జగన్ పై నెటిజన్లు కామెడీ చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. సోషల్ మీడియా సాక్షిగా జగన్ ను ఆడేసుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేసుకోవాలి.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండని బతిమాలుకున్నా కోర్టు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితిలోనూ కోర్టుకు రావాల్సిందే అని మొట్టికాయలు వేసింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు నిన్న శుక్రవారం కావడంతో జగన్ కోర్టుకు వెళ్లాడు. ఇంకేముంది ఇప్పుడు జగన్ ను ఆడేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణే. అదేంటీ అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్.   అసలు సంగతేంటంటే.. నిన్న అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే నిన్ననే.. పవన్ కళ్యాణ్ కు లండన్ లో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకుగాను ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే.. నిన్న చంద్రబాబు బిల్ గెట్స్ తో కలిశారు. ఆయనతో కలిసి ఒక వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ముగ్గురు ఫొటోలు కలిపి ఓ ఫొటో తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది... ఇప్పుడు ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి జగన్ మాత్రం నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటో ఏంటో మీరు కూడా చూడండి...  

జనసేన సర్వే గ్రాఫ్ లో ఇంత తేడానా..!

  సాధారణంగా ఎన్నికల్లప్పుడు పార్టీలు సర్వేలు జరపడం కామన్ థింగే. కానీ ఇటీవల ఎప్పుడు పడితే సర్వేలు చేయడం.. ఒక్క ఎన్నికలప్పుడే కాదు.. అసలు ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది.. పార్టీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి కూడా సర్వేలు చేస్తున్నారు. అయితే అలా జరిపిన సర్వేలో టీడీపీ, వైసీపీ పార్టీల సంగతేమో కానీ జనసేన పార్టీకి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటని అనుకుంటున్నారా..?   జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇప్పటినుండే కసరత్తులు మొదలు పెట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఏ పార్టీ ప‌రిస్థితి ఏంటిఅని..  ప్ర‌జ‌లు ఏ లీడ‌ర్‌కి మ‌ద్ద‌తిస్తున్నారు…? ఏ పార్టీకి ఎన్నిక‌ల‌లో ఓట్ల శాతం ద‌క్కనుంది..? అనే అంశాల‌ని జిల్లాల వారీగా చిన్మ‌యి క్రొవ్విడి అనే ప్ర‌ముఖ సెఫాల‌జిస్ట్ స‌ర్వేలు నిర్వ‌హించింద‌ట‌. అయితే ఈ సర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే... ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..  టీడీపీకి 42-43 శాతం ఓట్ బ్యాంక్ వ‌స్తుంద‌ట‌. ఇక‌, వైఎస్సార్‌సీకి 33-34 శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతార‌ట‌.ఇక జనసేన పార్టీ సంగతి ఏంటంటారా.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది మరి. ఇప్పటి వరకూ 1 లేదా 2 శాతానికే పరిమితమైన ఓట్ల శాతం ఇప్పుడు ఏకంగా అది 12 నుంచి 14 శాతానికి పెరిగింది. దీంతో ఇప్పుడే ఇలా ఉండే.. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి.. ఎన్నికల ప్రచారాల్లో కనుక పాల్గొంటే ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏమో ప్రతిపక్ష నేత కూడా కావొచ్చేమో..మరి వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో... ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో... తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

జడ్జికే కోపం తెప్పించారుగా...విసిగిపోయా..

అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేస్తూ కూడా... ప్రతి శుక్రవారం బ్రేక్ తీసుకొని మరీ కోర్టుకు హాజరవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ నిన్న కోర్టుకు హాజరయ్యాడు. ఈసందర్బంగా జగన్ తరపు లాయర్ పై జడ్జి ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జగన్ తరపు న్యాయవాది నాలుగు ఛార్జ్ షీట్లపై డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటూ జడ్జిని కోరారు. అంతే జడ్డి గారు లాయర్ కు చీవాట్లు పెట్టారు.ఇంతకీ ఏ విషయంలో జడ్డిగారికి అంత కోపం వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   అక్రమాస్తుల కేసులో భాగంగా... సీబీఐ జగన్ పై పలు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే  సీబీఐ దాఖలు చేసిన సీసీ 9 కేసు ఛార్జ్ షీట్ ను పక్కన పెట్టాలంటూ గతంలో  జగన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణకు రాగా నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే అదే సమయంలో  8, 10, 14 ఛార్జ్ షీట్లను కూడా కలిపి విచారించాలని జగన్ తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జడ్జి.... గత రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారని... ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారంటూ మండిపడ్డారు. మీరు వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయానంటూ అసహనం వ్యక్తం చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని... 'ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు... ఇకపై ఇలాంటివి కుదరవు' అంటూ చీవాట్లు పెట్టారు. మొత్తానికి జగన్ కు మాత్రం ఎక్కడికి వెళ్లినా చీవాట్లు మాత్రం తప్పట్లేదుగా..

నందుల రచ్చ.. పవన్ క్లైమాక్స్..!

  నంది అవార్డులపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను ప్రకటించిన అవార్డులు న్యాయబద్దంగా జరగలేదని.. ఏక పక్షంగా వ్యవహరించారని పలువురు తప్పుబట్టారు. పెద్ద నిర్మాతలు నల్లమలపు బజ్జి, బండ్లా గణేష్, డైరెక్టర్ గుణ శేఖర్ లాంటి వాళ్లయితే బహిరంగంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది అయితే ఈ అవార్డులకు కులాల పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇక ఆ రోజు నుండి ఈరోజు వరకు నందుల రగడ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని.. ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదని పలువురు అన్నా.. మెగా కాంపౌండ్ నుండి మాత్రం ఒక్క మాట కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ వార్త బయటకు వినిపిస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ నంది అవార్డుల గొడవపై ఎలా స్పందిస్తాడు అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే.. ఈ అవార్డుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా పవన్ క్లైమాక్స్ పంచ్ వేస్తాడని అంటున్నారు. దీంతో అవార్డులపై పవన్ ఎలా స్పందిస్తాడా..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న మెగా కాంపౌండ్ నుండి పవన్ గొంతైనా వినిపిస్తుందా..? లేక ఎప్పటిలాగానే నాకెందుకులే అని లైట్ తీసుకుంటాడా అని చూద్దాం.. ఏది ఏమైనా.. ఈ రచ్చతో.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో లోపల ఉన్న కుల కుమ్ములాటలు ఒక్కసారిగా బయట పడ్డాయని చెప్పొచ్చు.

దేవుడా.. ఓట్లు ఇలా కూడా అడుగుతారా..!

  సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్లు కావాలంటే ఎలా అడుగుతారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. అమ్మా.. అయ్యా అని దండాలు పెడతారు. ఒక్క సారి అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుంటారు. అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడతారు. అలాంటిది.. ఇక్కడ ఓ రాజకీయ నేత మాత్రం... బెదిరిస్తూ ఓట్లు అడుగుతున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బరబంకి స్థానం నుంచి బీజేపీ కౌన్సిలర్‌ రంజిత్‌కుమార్‌ శ్రీవాస్తవ భార్య శశి శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా తన భార్య తరపున ప్రచారంలో పాల్గొన్న రంజిత్ కుమార్ శ్రీవాత్సవ 'ఇదేమీ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీకు ఎవరూ సహాయం చేయలేరు. నా భార్యకు ఓట్లు వేసి గెలిపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే మాకు ఓట్లు వేయండి. మీరు మాకు ఓట్లేస్తే.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే కష్టాలు తప్పవు.' అని హెచ్చరించారు. అంతే ఇప్పుడు రంజిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రంజిత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.   మరోవైపు సొంత పార్టీ నేతలే రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు దారాసింగ్‌ చౌహాన్‌, రమాపతి శాస్త్రి వేదికపైనే ఉన్నారు. దీంతో రంజిత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చౌహాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మొత్తానికి ఆఖరికి రాజకీయ నాయకులు బెదిరించి మరీ ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది. ఇలానే ఉంటే పరిస్థితి ఇంకెంత దూరం వెళుతుందో చూద్దాం...

లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు...

  ఆలూ లేదూ.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత తెలిసే ఉంటుంది కదా. అలా ఉంది ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే...ఇంకా సినిమా షూటింగ్ లు పూర్తవ్వలేదు కానీ... అప్పుడే ఒకళ్ల మీద ఒకళ్లు మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా "లక్ష్మీస్ వీరగ్రంధం" సినిమాపై జరుగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఈ బయోపిక్ విషయంలో... లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..లక్ష్మీపార్వతి మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. అంతేకాదు.. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి... సినిమా షూటింగ్ ను కూడా ఆపేశారు.   ఇక దీనిపై స్పందించిన జగదీశ్వర్ రెడ్డి... ఈ చిత్రాన్ని అడ్డుకోవలని లక్ష్మీపార్వతి ప్రయత్నం చేస్తున్నారని.. ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెలో మార్పు కోరుతూ ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర చేపట్టారు. తమను ప్లాట్ ఫాంగాళ్లు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చారో ప్రజలకు చెప్పాలని కేతిరెడ్డి నిలదీశారు. మీ ఊళ్లో చర్చకు సిద్ధమా, అంత శక్తి ఉందా లక్ష్మీపార్వతి పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా, షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థించాడని చెబుతున్నావని, షూటింగ్‌ను ఆపే శక్తి నీకు ఉంటే, మీరే వచ్చి ఆపవచ్చు కదా అని నిలదీశారు. కష్టాల కడలిని అనుభవిస్తున్నానని, మూడు ముళ్ల పెళ్లికి ముప్పై ఏళ్ల వైదవ్యం అనుభవిస్తున్నానని మీరు మా నిర్మాతతో చెప్పలేదా అని నిలదీశారు. లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు.. తమతో ఓ రకంగా, మీడియా ముందు మరో రకంగా మాట్లాడుతున్నారని కేతిరెడ్డి ఆమెపై నిప్పులు చెరిగారు. అన్నగారి ధర్మపత్నిని అని చెప్పుకునే మీ భాష దారుణంగా, దిగజారుడుగా ఉందన్నారు. మొత్తానికి సినిమా ఎప్పుడూ పూర్తవుతుందో తెలియదు కానీ.. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అప్పుడే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక ఒక బయోపిక్ విషయంలోనే ఇలా ఉంటే ఇంకా వర్మ తీయబోయే సినిమా.. తేజ తీయబోయే సినిమాకు ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో.. ఎన్ని బయోపిక్ లు బయటకు వస్తాయో చూద్దాం...

శశికళ.. ఏమన్నా మైండ్ గేమా...

  అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఆమె ఆస్తులపై వరుసగా ఐడీ దాడులు నిర్వహించగా.. కొన్నికోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. శశికళ ఆమె బంధువులు... ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల ఆమె పెరోల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శశికళ భర్త నటరాజన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక్క విషయం... బయటపడింది. పెరోల్ మీద బయటకు వచ్చిన ఆమె తన భర్తను కలిసింది కేవలం ఒక్క రోజేనట. అయితే మిగిలిన రోజులు... ఆమె ఎక్కడికి వెళ్లింది.. ఏం చేసింది.. అనుకుంటున్నారా..? బయటకు వెళ్లిన ఆమె ఆ తర్వాత వ్యక్తిగత పనులు చూసుకున్నారట. అందులో భాగంగా 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చారట. ఇక ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించి... ఆమె నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం. మొత్తానికి శశికళ మాస్టర్ మైండ్ ని బాగానే వినియోగించారు. కానీ ఆమెపై నిఘా ఉంచిన అధికారులు ఆమె ఇంటిపై దాడులు నిర్వహించారు.

బయటపడిన బోటు బాగోతం...

  అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో.. విజయవాడ బోటు ప్రమాదం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విజయవాడ బోటు ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు బలైన సంగతి తెలిసిందే కదా. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత కానీ.. అసలు విషయాలు బయటపడుతున్నాయి ఇప్పుడు. ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదవశాత్తు మునిగిన ఫెర్రీ బోటును బయటకు తీశారు. దీన్ని పరిశీలించిన అధికారులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవం ఒకటి అర్థమైంది. బయటకు తీసిన తరువాత తెలిసింది ఆ బోటు బాగోతం ఏంటో. అసలు అది బోటు కానే కాదట. సముద్రంలో చేపలు పట్టేందుకు వాడే పడవట. ఆ పడవకే కొన్ని హంగులు అద్ది.. పర్యాటక పడవగా మార్చేశారు. ఇక ఈ బోటును పరిశీలించి.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కూడా.. చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో ఇంత ప్రమాదం జరిగింది.   వాస్తవానికి ఈ పడవ కేవలం పది మందిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పది మంది కంటే ఎక్కువ మంది ఎక్కితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తనిఖీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోటుపై లాంచీల్లో పెట్టినట్లుగా గొడుగు పెట్టారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని.. ప్రమాదం కానీ మరింత లోతుగా ఉన్న ప్రాంతంలో జరిగి ఉంటే.. ఒక్కరు కూడా బతికి ఉండేవారు కాదన్న విషయాన్ని వారు చెబుతున్నారు. మొత్తానికి అటు వ్యాపారస్థుల వల్ల కానీ... అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితేనేం కానీ.. అమాయకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోకపోతే.. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో..

జగన్ కు రకుల్ కు మధ్య తేడా చెప్పిన జేసీ....

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా సరే ముక్కసూటిగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ప్రతిపక్షపార్టీ పైనే కాదు.. సొంత పార్టీపైనా ఎలాంటి మొహమాటం లేకుండా... కామెంట్లు విసురుతాడు. ఇక జగన్ పై విమర్శలు చేయమంటే ఇంకా ఎనర్జీ వస్తుంది జేసీ దివాకర్ రెడ్డికి. అందుకే ఆయన కనబడితే చాలు మీడియాకు పండగే. ఇప్పటికే ఎన్నోసార్లు జగన్ పై కామెంట్లు విసిరిన జగన్.. ఈసారి ఏకంగా జగన్ ను ఓ స్టార్ హీరోయిన్ తో పోల్చి కామెంట్లు విసిరారు. దీంతో ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ జగన్ కు... రకుల్ కు లింక్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఏంటంటారా..  జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా... ఇక దీనిపై స్పందించిన జేసీ ఒకప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తున్నారు. రోజా పెట్టినా వస్తారని.. ఆఖరికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన జనాలు ఎగబడతారని అన్నారు. రాజకీయాలు ఇకపై తనకు అనవసరమని, 2019లో రిటైర్ అవుతానని చెప్పారు. జగన్ కూడా రాజకీయాలు వదిలేసి, మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు. ప్రజా సమస్యలను మీడియా ఇప్పటికే ఎత్తిచూపుతోందని, జగన్ కొత్తగా చేసేదేముందని అన్నారు.   అంతేకాదు.. జగన్ కారణంగా రెడ్లకు విలువే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. రెడ్డి కులస్తులంతా జగన్ వెంటే వెళ్తుండటంతో... ఇతర కులాలకు చెందినవారు రెడ్లను గౌరవించడం మానేశారని వ్యాఖ్యానించారు. రెడ్ల తోకలను కరణం బలరాం లాంటి వాళ్లు కోసేశారని ఎద్దేవా చేశారు. వైయస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయని జేసీ స్పష్టం చేశారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యల్లోని అర్ధం ఏంటో జగన్ కు అర్ధమైందో లేదో...

మాట మీద నిలబడ్డ కేసీఆర్.. కొన్ని ఏళ్ల సమస్యకు పరిష్కారం...

  ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగను.. ఇంత ధైర్యంగా ఈ శపధం చేసింది ఎవరబ్బా అనుకుంటున్నారా...?ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నల్గొంగ జిల్లా విషయంలో కేసీఆర్ ఇంత పెద్ద శపధం చేశారు. అసలు కేసీఆర్ శపధం చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.  నల్గొండ జిల్లా  ప్లోరిసిస్ ప్రాంతానికి మారు పేరు. దరిద్రం ఏంటంటే.. నాగార్జునసాగర్ పక్కనే ఉన్నాకాని త్రాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా లేని ప్రాంతం. దీనికి కారణం ఆ నీళ్లలో ప్లోరిసిస్ ఉండటమే. ఇది ఇప్పటి సమస్య కాదు. కొన్ని సంవత్సరాల నుండి నల్గొండ వాసులను ఇబ్బంది పెడుతున్న సమస్య.  జిల్లాలో మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నలబై శాతం గ్రామంలో 1పీపీఎం ను మించి ప్లోరిసిస్ మోతాదు ఎక్కువగా ఉంది .ముఖ్యంగా మునుగోడు నియోజక వర్గంలో మర్రిగూడెం ,నాంపల్లి మండలాల్లో అత్యధికంగా ఇరవై శాతం వరకు ఉండటం గమనార్హం. దీంతో కేసీఆర్.. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశారు. దీనిలోభాగంగానే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఇప్పటికే జిల్లాలో బట్లపల్లి గ్రామంలో మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను ఇప్పటికే తొంబై శాతం పూర్తిచేశారు. ఆరు మండలాల్లో వచ్చే డిసెంబర్ లోపు పనులు పూర్తీ కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా పీడత ప్రాంతంగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో అధిక నిధులను కేటాయించి పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు .అంతే కాకుండా మరో 113.67 కోట్ల రూపాయలతో అంతర్గత పనులను పూర్తిచేస్తున్నారు .మరో కొద్ది నెలలో మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి నల్గొండ జిల్లాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న ప్లోరిసిస్ సమస్యను పరిష్కరించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. మొత్తానికి కేసీఆర్ మాట మీద నిలబడి నల్గొండ జిల్లాకు ఓ పరిష్కారం చూపిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యంగా ఓట్లు అడగొచ్చన్నమాట.

ఏపీ అసెంబ్లీ... ప్రతిపక్షం కూడా అధికార పార్టీ నేతలే...

  ఒకపక్క ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుపుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. తాజాగా కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదన్నా లోటును అధికార పార్టీ నేతలే తీర్చేస్తున్నారు. ప్రతిపక్షం పార్టీ పాత్రను అధికార పక్షమే పోషిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా మంత్రులను నిలదీయడం, దానికి మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం విస్తు గొలుపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి అచ్చెన్నాయుడును నిలదీశారు... తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, అలా అయితే ఇక జీరో అవర్ ఎందుకని, దానిని తీసేయాలని సభలో గోరంట్ల ఊగిపోయారు.ఆయన వాదనకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. దూళిపాళ్ల నరేంద్ర కూడా పర్యాటక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బోటు ప్రమాదంపై మాట్లాడుతూ.. ఇందులో అధికారుల తప్పిదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేలు నిలదీస్తున్నా చంద్రబాబు ఏం అనట్లేదా అని డౌట్ రావచ్చు. దీనంతటికీ కారణం చంద్రబాబేనట. సభలో ప్రతిపక్షం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వ్యవహరించాలని సమస్యలపై మంత్రులను నిలదీయాలని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యేలో ప్రతిపక్షపార్టీ పాత్ర పోషిస్తూ.. మంత్రులను నిలదీస్తున్నారు.   మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఒకపక్క పాదయాత్ర అంటూ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు డుమ్మా కొడితే... చంద్రబాబు మాత్రం వారు లేకపోయినా అసెంబ్లీ జరిపించగలం అని నిరూపించారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షం కూడా అవసరం లేదు అన్నట్టు... ప్రతిపక్షం పార్టీ పాత్రను కూడా తమ నేతలే పోషించేలా చేశారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదేమో అనిపిస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు అంటూ బయటకు వెళ్లిపోయినా.. అధికార పార్టీలు మాత్రం ఎంచక్కా అసెంబ్లీలు నడిపేయోచ్చేమో. మొత్తానికి చంద్రాబాబుకు రాజకీయం చాణక్యుడు అన్న పేరు ఎందుకొచ్చిందో మరోసారి నిరూపించుకున్నారు.

ఆఘటనపై జగన్ అసెంబ్లీలో ఉంటే..!

  పాదయాత్ర పేరుతో ఏదో పొడిచేద్దామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బయలుదేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలుకు డుమ్మా కొట్టిమరీ పాదయాత్ర ప్లాన్ చేశారు. ఏం చేస్తారు మరి.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి మరి. ఆ రోజులు కవర్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టాల్సిందే మరీ. కానీ దీనికి వారు పెట్టుకున్న పేరేమో.. పార్టీ ఫిరాయింపు నేతలపై నిరసన అని. అయితే వాళ్లు చెప్పినంత మాత్రాన నమ్మడానికి అంత అమాయకంగా అయితే ఎవరూ లేరు కదా. ఇక ఏపీ అధికార పక్షం కూడా ప్రతిపక్షం వున్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.. అన్నట్టు ప్రశాంతంగా సమావేశాలు జరుపుకుంటూ పోతున్నారు.   ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అండ్ కో బ్యాచ్ ఇప్పుడు ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. అదేంటంటే.. కృష్ణానది వద్ద పడవ మునిగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఈ టైంలో ప్రతిపక్షం కనుక అసెంబ్లీలో ఉంటే.. అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించి ఇరుకున పెట్టే ఛాన్స్ కోల్పోయింది అంటున్నాయి. గతంలో పుష్కరాలు జరిగినప్పుడు జరిగిన తోపులాట గురించి జగన్ అసెంబ్లీలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కూడా తాజా ఘటనపై స్పందించి అసెంబ్లీలో రచ్చ చేసే ఛాన్స్ ఉండేది..కానీ జగన్ మిస్ అయ్యాడు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం.. ఆ జగన్ అసెంబ్లీలో ఉన్నా... ఏదో ఓ నాలుగైదు సినిమా డైలాగ్ లు కొట్టేసి, వైసీపీ నేతలు స్పీకర్ ను చుట్టుముట్టేసి, కాగితాలు చించి హడావుడి చేయడం తప్పా మరేమి ఉండేది కాదు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ వల్ల బాధితులకు ఏమైనా ప్రయోజనం చేకూరేదా..? అంటే అదీ లేదు.. అంటున్నారు. ఎందుకంటే గత మూడున్నర్రేళ్ళల్లో జగన్ ఏనాడూ ఆ కార్యాన్ని విజయవంతంగా నిర్వహించలేదు. ఈ మూడేళ్ళల్లో జగన్ కున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి. అందుకే ఈ ఛాన్స్ పోయింది అని ఫీలవడానికి కూడా ఏం లేదు.. వాళ్లు ఉన్నా ఒకటే.. లేక పోయినా ఒకటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇంతకీ వైసీపీ నేతల మనసులో ఏముందో మరీ..

అవినీతి పరులను జైల్లో పెడతావా... ఏం మాట్లాడున్నావ్ జగన్...?

  పాపం పాదయాత్ర చేస్తూ.. అలసిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్టున్నాడు జగన్.. అందుకే ఎం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. జగన్ మాట్లాడటం ఏమో కానీ.. జగన్ మాటలు వింటున్న వాళ్లకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినంత పనవుతుంది. ఇటీవల ఓ అవ్వ నాకు ఉండటానికి ఇల్లు లేదు... తినడానికి తిండి లేదు అని చెబితే.. దానికి జగన్ బాబు నన్ను సీఎం చేయండి.. అధికారంలోకి వస్తే అన్ని చేస్తా అని అవ్వతో పాటు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా.. అవినీతి పరులను జైల్లో పెడతా అని మాట్లాడుతున్నాడు. దీంతో జగన్ వ్యాఖ్యలకు జనానికి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియని స్థితిలో పడ్డారు. తనదగ్గర డబ్బులు లేవని.. చంద్రబాబులాగ కేసులు లేవని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్న జగన్ ను ఊరికే టైం పాస్ కోసం అక్కడికి పంపలేదు కదా.. సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఏకంగా జగన్ పై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయి. ఇతని 11 కేసుల్లో నిందితుల నుండి వందల కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేశాయి. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందే. పాదయాత్ర చేసుకుంటాను.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వమని కోరినా.. కోర్టు కుదరదు పొమ్మని చెప్పింది. ఏలాగో అలా కేంద్రాన్ని మేనెజే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అందుకే రాష్ట్రం విడిపోయినా.. ప్రత్యేక హోదాపైనా.. జగన్ చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తాడు తప్పా...కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడు. అంటే జగన్ కు చుక్కలే కదా. అలాంటి జగన్.. అవినీతి పరుల గురించి మాట్లాడుంటే మంచి కామెడీగా అనిపిస్తుంది. వాళ్లను జైల్లో పెడతా అని చెప్పడం ఇంకా కామెడీగా అనిపిస్తుంది. మరి జగన్ మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బెటర్.

ఓటమి భయంలో రేవంత్ రెడ్డి... ఎవర్ని కాకా పడుతున్నాడో తెలుసా..?

  రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కొడంగల్ ఉపఎన్నికపైనే. ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నారు. అయితే అసలు ఉపఎన్నిక జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం.. రేవంత్ రెడ్డి రాజీనామాను చంద్రబాబుకు ఇవ్వడమే.. మరి చంద్రబాబు ఈ రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తారా..? లేదా..? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే...ఈ మధ్య రేవంత్ రెడ్డి ఓ కుటుంబం చుట్టూ తెగ చక్కర్లు కొడుతున్నాడట. ఎప్పుడూ చూడూ వారితోనే ఉంటున్నాడట..? వాళ్లు నందారం అనురాధ, నందారం ప్రశాంత్.. ఇంతకీ ఎవరిది ఆ కుటుంబం.. రేవంత్ రెడ్డి అంతలా వాళ్ల చుట్టు ఎందుకు తిరుగుతున్నాడో తెలుసుకోవాలంటే కాస్త ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.   కొడంగల్ నియోజక వర్గంలో నందారం ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లుండరు. అక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంకు ఉంది. అలాంటి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినదే ఈ నందారం ఫ్యామిలీ. ఈ సామాజిక వర్గానికి చెందిన కీల‌క‌మైన నాయ‌కుడు నందారం వెంకటయ్య. ఆయ‌న‌కు గతంలో తెదేపా టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది. నందారం వెంకటయ్య మరణాంతరం ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణకు సైతం తెదేపా ఎమ్మెల్యేగా గెలిపించింది. ఈయన భార్యనే నందారం అనురాధ.. నందారం కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారి మంచితనం.. అవినీతి రహిత పాలన అక్కడి ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ప్రజల్లో వారికి చక్కటి సానుభూతి వచ్చింది. ప్రమాదంలో నందారం సూర్యనారాయణ ఎమ్మెల్యే హోదాలో మరణించారు. దీంతో కొడంగల్‌లో ఈ కుటుంబానికి ప్రజలు మరింత దగ్గరయ్యారు. ఆతరువాత తెదేపా కోడంగల్‌ సీటును రేవంత్‌రెడ్డి చేతిలో పెట్టింది. సూర్యనారాయణ సోదరుడు నందారం శ్రీనివాస్‌ కుమారుడు నందారం ప్రశాంత్‌ కోడంగల్‌ రాజకీయాలలో మరింత కీలకంగా మారిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి వీరి కుటుంబం చుట్టూ తిరుగుతున్నాడట. మరోవైపు ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వారిని కాకా పట్టేందుకు ఇలా చేస్తున్నాడని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు... మొత్తానికి నాకు తిరుగులేదు అనుకున్న రేవంత్ రెడ్డికి కూడా ఓడిపోతానేమో అన్న భయం పట్టుకుందన్నమాట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

టీడీపీ ఆవిర్భావానికి అసలు రీజన్ ఇదేనా..?

దేశానికి కాంగ్రెస్ తప్ప మరో దిక్కులేదనుకునే రోజులు.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుగొడిని చిన్న చూపు చూస్తోన్న రోజులవి.. హస్తిన నుంచి ఆదేశాలు అందితే తప్ప పాలన కూడా నడవని పరిస్థితి. తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్నాళ్లు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టాలి.. హస్తానికి ప్రత్యామ్నాయం లేదా.. అని ప్రజలు ఎదురుచూస్తోన్న సమయంలో తెలుగువారి అభ్యున్నతి కోసం.. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలించే లక్ష్యంతో.. అప్పటి వరకు సూపర్‌స్టార్‌గా నీరాజనాలందుకున్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్యరథం ఎక్కి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు.. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ అన్నగారు చేసిన ప్రసంగాలకు ఆకర్షితులైన ప్రజానీకం.. టీడీపీకి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు.   అలా ఢిల్లీ పెద్దలకు తెలుగువారి వాడిని వేడిని రుచి చూపించారు ఎన్టీఆర్. అసలు టీడీపీ స్థాపన వెనుకున్న ముఖ్యోద్ధేశం తెలుగువాడి ఆత్మగౌరవం, కాంగ్రెస్ విముక్త భారతదేశం. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్. అప్పట్లో నెల్లూరుకు చెందిన కొందరు అభిమానులు ఎన్టీఆర్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మద్రాస్ నుంచి కారులో వచ్చారు రామారావు గారు.. దానికి చీఫ్ గెస్ట్ నేదురుమల్లి జనార్థన్ రెడ్డి. ప్రయాణ బడలికతో అలసిపోయి ఉన్న ఎన్టీఆర్ ముఖం కడుక్కుందామని బాత్‌రూమ్‌కి వెళ్లారు. అది చూసిన నేదురుమల్లికి కోపం వచ్చింది. నాకు ఇచ్చిన గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లడానికి ఈ సినిమావాడికి ఎంత ధైర్యం అంటూ ఆవేశంతో తన అనుచరులతో అన్నారట.   ఆ మాటలు అన్నగారు వినడంతో ఆయన ముభావంగా సన్మానం చేయించుకొని.. ఏమీ తినకుండానే మద్రాస్ వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్ కాంగ్రెస్ అనే కంచుకోటను బద్దలుకొట్టారు. అయితే ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా.. పార్టీ పెట్టడానికి ముందు జరిగిన మంతనాల్లోనూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారాయన. మరి శివప్రసాద్ గారి వ్యాసంలో వాస్తవమెంత అన్నది అన్నగారి అంతరంగికులకే తెలియాలి. ఎందుకోసం పెట్టినా.. ఏ ఉద్దేశ్యంతో పెట్టినా.. తెలుగువారికి రాజకీయ చైతన్యాన్ని, ఎందరికో రాజకీయ బిక్షను పెట్టి, ప్రజారంజక పాలనను అందించిన అన్నగారు నిజంగా అభినందనీయులు. 

రోజక్కా.. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా..?

  ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఉంది ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి మాటలు వింటుంటే. సాధారణంగా మీడియా ముందుకు వచ్చిందంటే రోజాకి అస్సలు నోరు కుదురుగా ఉండదని తెలుసు. ఇప్పుడు అలాగే శాసనసభ సమావేశాలపై మాట్లాడిన రోజా ఎప్పటిలాగానే అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో స్పెషాలిటీ ఏంటంటే.. సభలో ప్రతిపక్షం లేకపోవడమే. దీనికి కారణం వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడమే. జగన్ పాదయాత్రలో భాగంగా... వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే దానికి ఫిరాయింపుల పై నిరసన అంటూ పేరు పెట్టారు. ఇక ఎలాగూ ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పార్టీ ఎంచక్కా సమావేశాలు ప్రారంభించి.. ప్రశాంతంగా చర్చలు జరిపింది. ఇక దీనిపై స్పందించిన రోజా..  ప్రతిపక్షం లేకుండా సభను నడపడం పై ఆమె విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో శిక్షణ శిబిరాల కార్యక్రమాలు జరిగేలా అసెంబ్లీ మారిందని ఆరోపించారు. ఇదేదో ప్రభుత్వం వైకాపాను సభకు రావద్దు అన్నట్టు రోజా గారు అంటున్నారు. వైకాపా సభ్యులు సభకు రావాలి అనుకుంటే వారిని ఆపేది ఎవరు? వారికి వారే రావొద్దు అని నిర్ణయం తీసేసుకుని మళ్ళి ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని అనడం వారికే రోజా గారికే చెల్లింది. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. అసలు వాళ్లు సభకు వచ్చినా.. రాకపోయినా పెద్దగా ఒరిగేది ఏం లేదు. వాళ్లు సమావేశాలకు హాజరు అవ్వకపోతే చంద్రబాబుకి ఏం నష్టం? ఏదో చంద్రబాబు అసెంబ్లీకి రావొద్దు అంటే..వైసీపీ మానుకున్నట్టు మాట్లాడుతుంది రోజా..

సుప్రీమ్ కోర్ట్ లో న్యాయవ్యవస్థకే తలవంపు..

  మునుపెన్నడు లేని విధంగా సుప్రీం కోర్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటిసారి  ‘అధికార పరిధి వివాదం’ రాజుకుంది. దీనికి కారణం మెడికల్ సీట్ల కుంభకోణమే. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవుకు చెందిన ప్రసాద్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెందిన మెడికల్‌ కాలేజీతో పాటు 46 వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. కళాశాలల్లో తగిన వసతులు లేవంటూ భారతీయ వైద్య సంస్థ (ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే ఈ కుంభకోణంలో కొందరు న్యాయమూర్తుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఒడిషా హైకోర్టులో జడ్జిగా పనిచేసిన ఇష్రత్‌ మస్రూర్‌ ఖడూసీ ని , మరో ఐదుగురిని సెప్టెంబర్‌ 20 న అరెస్ట్‌ చేయడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగు చూసింది. అయితే ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ విచారణలో భాగంగా...జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ తరువాత న్యాయవాదులు దుశ్యంత్‌ దవే, ప్రశాంత్‌ భూషణ్‌లు జస్టిస్‌ చలమేశ్వర్‌ ముందు మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో... ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ, దీనిని సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్‌ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే వారిలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పేరును తీసేశారు. ఇక దీనిపై స్పందించిన మిశ్రా ఈ కేసును తేల్చే పనిని మరో ధర్మాసనానికి అప్పగించాలని చలమేశ్వర్ కు ఆదేశాలు ముసాయిదా పంపారు. అయితే... జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాత్రం తాను అనుకున్నట్లుగానే ఆదేశాలు జారీ చేశారు.   దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, ఆయన తర్వాత అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మధ్య వివాదం రాజుకుంది.  చీఫ్‌ జస్టిస్‌ అయిన తనను పక్కనపెడుతూ ఐదుగురు అత్యంత సీనియర్లతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆదేశాలను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కొట్టివేశారు. ఇప్పుడు దీనికి తోడు...‘‘ఈ కేసులో మీ పేరూ ఉంది...దీనిపై మీరు ఎలా విచారణ జరుపుతారు’’ అంటూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బహిరంగ కోర్టులోనే జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను నిలదీయడంతో మరో సంచలనం చోటుచేసుకుంది.   ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఒక దశలో ప్రశాంత్‌ భూషణ్‌ తన స్వరం పెంచారు. ‘‘సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మీ పేరు కూడా ఉంది. ఈ కేసు విచారణ నుంచి మీరు తప్పుకోవాల్సిందే’’ అని వాదించారు. దీనిపై జస్టిస్‌ మిశ్రా మండిపడ్డారు. ‘ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో చెప్పండి. అంతా నాన్సెన్స్‌. అందులో నా పేరు సూచిస్తూ ఒక్కపదం కూడా లేదు. ముందు మా ఆదేశాలు చదవండి. మీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవచ్చు. మీరు నాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. ఆ విషయం మీకూ తెలుసు...మీరు సహనం కోల్పోయినా... మేం కోల్పోం’’ అంటూ తీవ్రంగా స్పందించారు. అయినా... ప్రశాంత్‌ భూషణ్‌ వెనక్కి తగ్గలేదు. ‘‘సరే! నాకు కోర్టు ధిక్కార నోటీసు ఇవ్వండి. విచారణ జరపాల్సిన పద్ధతి ఇది కాదు. కోర్టులో అందరూ మాట్లాడుతున్నారు. అందరినీ మాట్లాడనిస్తున్నారు. నన్ను మాత్రం మాట్లాడనివ్వడంలేదు’’ అంటూ విచారణ మధ్యలోనే కోర్టు హాలు నుంచి విసురుగా వెళ్లిపోయారు. మొత్తానికి సుప్రీంకోర్టులో మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూద్దాం..

చంద్రబాబు ముందా నీ కుప్పిగంతులు జగన్..?

  రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి రాజకీయ చాణుక్యుడు అని ఊరకనే పేరు రాలేదు కదా. ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు చూసి చాలా పెద్ద పెద్ద రాజకీయ నేతలే ముక్కున వేలు వేసుకుంటారు. అలాంటిది వైసీపీ అధినేత జగన్ ఎంత. హనుమంతడి ముందు కోతి కుప్పి గంతులు వేసినట్టు... చంద్రబాబు ముందు జగన్ కూడా అలానే కుప్పి గంతులు వేస్తుంటాడు.. బొక్క బోర్లా పడుతుంటాడు. అలా అని సైలెంట్ గా ఉంటాడా అంటే.. అదీ లేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబును కెలుకుతాడు. ఏదో ఒకటి అనిపించుకుంటాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలానే ఇరుకున పడ్డాడు జగన్. పనామా పేపర్స్ మాదిరి.. ఇటీవల ప్యారడైజ్ పేపర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లో జగన్ పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. దీంతో టీడీపీకి జగన్ జుట్టు అందినట్టైంది. అందుకే.. చంద్రబాబు తన నాయకులకు చెప్పి ప్రెస్ మీట్ పెట్టించి మరీ జ‌గ‌న్‌ను క‌డిగించారు. ఇక చంద్రబాబు ఆదేశాలతో య‌న‌మ‌ల‌, కేఈ, సోమిరెడ్డి, వ‌ర్ల రామ‌య్య జగన్ పై విరుచుకుపడ్డారు.   మరి దీనికి జగన్ ఊరుకుంటాడా... తనకు విదేశాల్లో ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, న‌గ‌దు కానీ ఉంద‌ని బాబు నిరూపించాల‌ని అన్నాడు. అంతేకాదు 15 రోజులు టైం కూడా ఇచ్చాడు. అలా నిరూపిస్తే.. త‌క్ష‌ణం తాను త‌న పార్టీ జెండీ పీకేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అన్నారు. ఒక‌వేళ నిరూపించ‌క‌పోతే.. బాబు త‌న సీఎం సీటుకు రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఇంకేముంది జగన్ ఇచ్చిన సవాల్ కు చంద్రబాబు షాక్ అవుతారు... 15 రోజుల్లో నిరూపిస్తారా..? సవాల్ ను ఎదుర్కొంటారా..? అని అనుకున్నారు. మరి అక్కడ ఉంది చంద్రబాబు.. ఇలాంటి చిన్న విషయాలను కూడా చంద్రబాబు సీరియస్ తీసుకుంటే.. ఆయనకు జగన్ కు తేడా ఏముంటది. మరోసారి తన మార్క్ తెలివితేటలను నిరూపించుకున్నారు. జ‌గ‌న్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుకాద‌ని తానే నిరూపించుకోవాల‌ని సింపుల్ గా జగన్ కే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, జ‌గ‌న్ ఊరావాడా త‌ప్పుల మీద త‌ప్పులు చేసి, జ‌నాల్ని దోచుకుని వాటిని న‌న్ను నిరూపించ‌మంటే ఎలా అని కామెంట్ చేశారు. అంతేకాదు, జ‌గ‌న్ ఈ దేశంలో దోచుకున్న సంప‌ద‌ను క‌క్కిస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు పంచుతామ‌ని అన్నారు. మొత్తానికి జగన్ చంద్రబాబు ఇలా కౌంటర్ ఇస్తాడని అనుకొని ఉండడేమో. ఇక చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ కు జగన్ నుండి ఇంతవరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొత్తానికి జగన్.. చంద్రబాబు ముందు తన ఆటలు సాగవని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది..