వాట్ ఏ కామెడీ బొత్సా...నువ్వు కూడా ఇలా..!
నంది అవార్డులపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ అవార్డులపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించి... ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినందుకు గాను మంత్రి లోకేశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఇక లోకేశ్ వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని అయితే.. సంచలన వ్యాఖ్యలే చేశాడు. ఇప్పుడు అందరూ అయిపోయారు నా వంతు అన్నట్టు... బొత్స కూడా ఇప్పుడు రెడీ అయ్యాడు. తానేదో ఉత్తముడిని అన్నట్టు లెక్చర్లు ఇస్తున్నాడు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. లోకేశ్ మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని.. అన్నాడు. అంతేకాదు.. అక్కడితో ఆగకుండా.. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఏపీలో ఆధార్ కార్డు అడుగుతారా..? ఏపీలో కార్డులు ఉన్నవారే జ్యూరీలోకి తీసుకున్నారా..? అంటూ ప్రశ్నించాడు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..పంచభూతాలను ప్రభుత్వ నేతలు దోచుకు తింటున్నారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాక మంత్రి అశోక్ గజపతి రాజులు దోచుకుతింటున్నారని మైక్ ముందు ఓ రెచ్చిపోయాడు.
అంతే లోకేశ్ వ్యాఖ్యలేమో కానీ.. లోకేశ్ పై బొత్స చేసిన వ్యాఖ్యలు మాత్రం మాంచి కామెడిగా ఉన్నాయి అనుకుంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. దోచుకోవడం గురించి బొత్స నే మాట్లాడాలి మరి అంటున్నారు. అసలు బొత్సా బ్యాక్ గ్రౌండ్ కి, బొత్సా చేసిన నిర్వాకాలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా? అని అంటున్నారు పలువురు. వైఎస్ హయాంలో అందినకాడికి దోచుకొన్నారు..మీకు ఎన్ని బినామీలు ఉన్నాయో తెలుసు, సినిమాలు, ఛానెళ్లు, ఇసుక దందాలు, మద్యం సిండికేట్లు అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే అన్నా బొత్సన్నా.. లోకేశ్ గురించి మాట్లాడేముందు.. నీ గురించి ఒక్కసారి ఆలోచించుకో అన్నా అని పులువురు కౌంటర్లు వేస్తున్నారు. ఏంటో మరి మైక్ చూస్తే సత్తిబాబు నోరు పాపం కంట్రోల్ లో ఉండదేమో..