English | Telugu

కరాటే కళ్యాణి చుట్టూ ఏం జరుగుతోంది?

క‌రాటే కళ్యాణి ... 'బాబీ' అంటూ బ్ర‌హ్మీతో కామెడీని పండించిన ఈ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్ లోనూ న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల `మా` ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో హేమ‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వార్త‌ల్లో నిలిచిన క‌రాటే క‌ల్యాణీ గ‌త కొంత కాలంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇరుక్కుంటున్నారు అన‌డం కంటే వివాదాల చుట్టే తిరుగుతున్నారు.

వివాదం ఎక్క‌డుంటే క‌రాటే క‌ల్యాణి అక్క‌డ వుంటోంది అన్న‌ట్టుగా మారింది అమె వ్య‌వ‌హార‌శైలి. తాజాగా ఆమె శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స‌ద‌రు ట్ర‌స్ట్ నిర్వాహ‌కులు కోటి రూపాయ‌ల మేర‌కు నిధులను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని క‌ల్యాణి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. హిందువుల‌ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ స‌భ్యులు నిధులు సేక‌రిస్తున్నార‌ని, అప్ప‌టికే సేక‌రించిన మొత్తంలో కోటి మాయం చేశారని క‌ల్యాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read:సంక్రాంతికి 'హీరో'గా వ‌స్తోన్న అశోక్ గ‌ల్లా

దీంతో స‌ద‌రు ట్రిస్ట్ నుంచి త‌న‌కు బెదిరింపులు మొద‌ల‌య్యాయిని, త‌న‌ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నార‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేస్తోంది. త‌న‌కు శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ స‌భ్యుల నుంచి ప్రాణ హాని వుంద‌ని తాజాగా బంజారాహిల్స్ పోలీసుల‌కు క‌రాటే క‌ల్యాణి ఫిర్యాదు చేశారు. ట్ర‌స్ట్ చేసే త‌ప్పుడు ప‌నులు బ‌య‌ట‌పెడుతున్న త‌న‌ని హ‌త్య చేయాల‌ని చూస్తున్నార‌ని క‌ల్యాణి ఫిర్యాదు చేసింది. గ‌తంలోనూ క‌ల్యాణి ఓ మైన‌ర్ బాలిక హ‌త్య ఉదంతం కేసులోనూ వివాదంలో చిక్కుకుని ఆ త‌రువాత బ‌య‌ట‌ప‌డింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.