English | Telugu

Jayam serial: నల్లపూసల కోసం గంగ వాళ్ళింటికి వెళ్ళిన రుద్ర.. పారు ఏం చేస్తుందంటే!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -138 లో......రుద్ర దగ్గర ఉండి మరి గంగని బాగా చూసుకుంటాడు అది చూసి ఇషిక వీరు, పారు చూసి ఓర్వలేకపోతారు. గంగని దగ్గర ఉండి చూసుకొండి అని పెద్దసారు ఇంట్లో వాళ్లతో చెప్తాడు. అసలు అన్నయ్య మనకి ఛాన్స్ ఇవ్వడం లేదు.. తనే చూసుకుంటున్నాడని స్నేహ అంటుంది. గంగను వాళ్ళ పుట్టింటికి పంపింద్దామనుకుంటున్నాను.. తనతో పాటు రుద్రను కూడా అనగానే అందరు షాక్ అవుతారు.

అంటే నల్లపూసల తంతు పుట్టింట్లో చేస్తారు కదా అని పెద్దసారు అనగానే శకుంతల షాక్ అవుతుంది. స్నేహ వెళ్లి గంగకి చెప్పమని పెద్దసారు అంటాడు. అదంతా విని ఇషిక వీరు, పారు మాట్లాడుకుంటారు. వీళ్ళని ఇలా వదిలేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. పుట్టింటికి వెళ్లిన గంగ తిరిగి రాకుండా ప్లాన్ చేస్తానని పారు అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి.. ఏదో ప్లాన్ అంటున్నావేంటి అని అడుగుతాడు. మైండ్ డిస్టబ్ గా ఉంది.. ఏదైనా టూర్ ప్లాన్ చెయ్యాలి అంటున్నానని పారు కవర్ చేస్తుంది. ఇంటికి గెస్ట్ గా వచ్చి ఇంతసేపు ఉండడం పద్ధతి కాదని తెలియదా.. నీ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్ వస్తే ఊరుకోనని రుద్ర వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు గంగ, రుద్ర రెడీ అవుతారు. మా ఇంట్లో రుద్ర సర్ కి ఏం లోటు లేకుండా చూసుకుంటాం.. మా పక్కింట్లో ప్రిడ్జ్ ఉంది.. గల్లీలో కూలర్ ఉంది అని గంగ చెప్తుంటే.. వాళ్ళని వీళ్ళని అడుక్కొచ్చి అల్లుడికి మర్యాద చేస్తారా అని శకుంతల వెటకారంగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత గంగ,రుద్ర బయల్దేరతారు. గంగ, రుద్ర కలిసి గంగ వాళ్ళింటికి వెళ్ళగానే అందరు వచ్చి వాళ్ళిద్దరిని పలకరిస్తారు. ఎంతో రుద్ర ఇబ్బంది పడతాడు. ఇద్దరు గుమ్మం దగ్గరికి వస్తారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. గంగ ఫ్రెండ్స్ రుద్రని ఆటపట్టిస్తారు. పేరు చెప్పి లోపలికి రమ్మని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.