English | Telugu

Divya Support to Demon Pavan: దివ్వ ఓటు డీమాన్ పవన్‌కి .. అన్నయ్య భరణి పోటు


బిగ్ బాస్ ఇప్పటికే పదమూడు వారాలు పూర్తయింది. దివ్య నిఖిత మూడో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి లాజిక్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అది గేమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భరణితో అన్నయ్య అనే బాండింగ్ తోనే గడిచిపోయింది. ఇక భరణి గారి కుటుంబం గురించి తెలిసిందే కదా.. ఒకవైపు చెల్లి.. ఒకవైపు కూతురు. కూతురు అయిన తనూజతో భరణి క్లోజ్ గా ఉంటే దివ్య అసలు ఒప్పుకోదు.

భరణిని కమాండ్ చేసేది.. ఆ విషయం భరణి తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళతో వీళ్లతో చెప్తుండేవాడు. భరణికి బాలేకపోతే దగ్గరుండి మరి బాగోగులు చూసుకునేది. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు వచ్చి.. మీరు డాడీపై కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది. తనూజతో భరణి కూతురు క్లోజ్ గా పాజిటివ్ గా మాట్లాడతుంది కానీ దివ్యతో అంతగా మాట్లాడదు. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు భరణి చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు ఈ హౌస్ ద్వారా మంచి అన్నయ్య దొరికాడు అని దివ్య స్టేజ్ పైన చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా భరణి గారి కూతురు నాతో మాట్లాడలేదు.. నేను హర్ట్ అయ్యానని దివ్య చెప్పింది.

అయితే దివ్య బయటకు వచ్చి రెండు వారాలు పూర్తయింది. అయితే హౌస్ లో భరణితో పాటు హౌస్ మేట్స్ ఆట చూసినట్లుంది. తన గురించి ఎవరు ఏం మాట్లాడారో అన్నీ మనసులో పెట్టుకుంది. అందుకే హౌస్ నుండి బయటకు వచ్చాక భరణికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ తాజాగా డీమాన్ కి ఓటు వేసినట్లు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉన్నప్పుడు భరణిని అన్నయ్య లాగా ఫీల్ అయినా చెప్పిన దివ్య తనకి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యకి కాకుండా ఫ్రెండ్ కి సపోర్ట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నవారిలో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమాన్ పవన్ అనేది అందరికి తెలిసిందే. హౌస్ లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.