English | Telugu

Bigg Boss 9 Telugu Tanuja: ఓటు అప్పీల్  చేసిన తనూజ.... మేడమ్ సర్ మేడమ్ అంతే!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక పద్నాలుగో వారం హౌస్ లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే టాస్క్ లో పోటీపడుతూ స్కోర్ బోర్డు పై పాయింట్స్ ఎక్కువ కలిగి ఉండాలి. అలా టాస్క్ అనంతరం పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ ఓటు అప్పీల్ ఛాన్స్ కలిపించాడు. కాసేపటికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. అందులో తనూజ, భరణి, సంజన, సుమన్ నలుగురు పోటీ చేశారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ సంఛాలక్ గా ఉన్నారు.

ఈ టాస్క్ త్వరగా పూర్తి చేసిన వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా సంజన టాస్క్ పూర్తి చేసినా కొన్ని మిస్టేక్స్ చేసింది.. అలాగే తనూజ కూడా మిస్టేక్ చేసింది. ఆ తర్వాత ప్రాపర్ గా భరణి చేస్తాడు. ఈ గేమ్ ముగిసే సమయానికి భరణికి 100 పాయింట్లు, తనూజకి 80 పాయింట్లు, సంజనకి 60 పాయింట్లు, సుమన్ కి 40 పాయింట్లు వస్తాయి. ఇక లీడర్ బోర్డు లో భరణి, తనూజ టాప్ లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. వాళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ బయట నుండి వచ్చిన ఆడియన్స్ ఉంటారు. భరణి గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు. మీరు ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు.

దాంతో భరణి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత తనూజ ఓటు అప్పీల్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ తనూజని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకతను మీకు ఫ్యాన్ బాయ్ వస్తాడు. మేడం సర్ మేడం అంతే అని చెప్పగానే తనూజ మురిసిపోతుంది. ఈ సారి లేడీ విన్నర్ గా చూడాలి అనుకుంటున్నామని మరొకరు చెప్పగానే.. తప్పకుండా అని తనూజ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.