"అయ్యో అయ్యో అయ్యయ్యో".. అప్పుడే 33 ఏళ్ళయిందా!?
విక్టరీ వెంకటేశ్ నటజీవితంలో పలు ఘనవిజయాలు ఉన్నాయి. వాటిలో 'బొబ్బిలి రాజా'ది ప్రత్యేక స్థానం. వెంకీ కెరీర్ లో ఇదే తొలి సిల్వర్ జూబ్లీ హిట్ కావడమే అందుకు ఓ కారణం. ఇక.. "అయ్యో అయ్యో అయ్యయ్యో" అంటూ ఇందులో వెంకటేశ్ చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే అందాల తార దివ్యభారతి తెలుగువారికి పరిచయమైంది. దివ్యభారతికి తల్లిగా కళాభినేత్రి వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, సత్యనారాయణ, బ్రహ్మానందం, సుమిత్ర, శివాజీ రాజా, బాబూ మోహన్, ప్రదీప్ శక్తి, జయప్రకాశ్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.