హైపర్ ఆదిని వణికించిన రష్మి.. పిల్లాడికి మ్యాజిక్ రాదు!
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది, ఇంద్రజ, రష్మీ ముగ్గురూ స్టేజి మీద ఉండగా ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు. "ఏమయిందిరా..అమ్మ తప్పిపోయిందా..వారిలో ఎవరు " అంటూ రష్మీ, ఇంద్రజ వైపు చూపించేసరికి ఇద్దరూ షాకయ్యారు. తర్వాత ఆ పిల్లాడు ఇంద్రజ, రష్మీ దగ్గరకు వెళ్ళాడు.. ఆ పిల్లాడి చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చూసేసరికి అందులో ఆది బొమ్మ కనిపించింది. "ఎం కావాలి ఆది నుంచి" అని ఇంద్రజ ఆ పిలాడిని అడిగేసరికి వాడు కాస్తా " నాన్న" అన్నాడు. దానికి ఆది షాక్ అయ్యి కౌంటర్ కామెంట్ చేసాడు "ఏరా నీకు మ్యాజిక్ వచ్చా" అని ఆ పిల్లాడిని అడిగాడు. రాదు అని బాబు చెప్పేసరికి ఐతే కాదులే అంటూ రష్మీ వైపుకు చూసాడు ఆది.. అంటే సుధీర్ రష్మీ పిల్లాడు అన్నట్టుగా ఇన్డైరెక్ట్ గా కౌంటర్ వేసాడు..