English | Telugu

Guppedantha Manasu : రిషి అతనే అని వసుధార నిరూపించగలదా.. బోర్డు మీటింగ్ లో ఏమైందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1111 లో....నా బావని పట్టుకొని రిషి సర్ అంటున్నావేంటి? ఇక్కడ నుండి వెళ్ళిపోమని వసుధారతో సరోజ అనగానే.. వెళ్లిపోతాను పదిహేను రోజుల్లో నువ్వు బావ అంటున్న రంగానే నా రిషి సర్ అని నిరూపించి తన నోటితోనే రిషి సర్ అని చెప్పించి, తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తానని వసుధార ఛాలెంజ్ చేస్తుంది. ఆమ్మో ఇదేంటి ఇలా అంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సరోజ అనుకుంటుంది. ఆ తర్వాత ఏంజిల్ అన్న మాటలు గుర్తుకి చేసుకుని శైలేంద్ర తనని తాను బెల్ట్ తో కొట్టుకుంటాడు. అపుడే ధరణి వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నారని ధరణి అడుగుతుంది. ఎప్పుడు ఎండీ చైర్ కి ఎవరో ఒకరు అడ్డువస్తున్నారు.. వసుధార ఇప్పుడు లేదు అయినా ఎవరో ఒకరు వస్తున్నారని శైలేంద్ర అంటాడు. మీకెప్పటికి అది దక్కదు అని ధరణి అంటుంది.

మరొకవైపు ఏంజిల్, మను ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటారు. ఏంటి నీకెప్పుడు ఇదే లోకమా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావ్.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజిల్ అడుగుతుంది. ప్రేమించాను.. మా అమ్మని ప్రేమించానని మను అంటాడు. ముందు మీ నాన్నని ప్రేమించు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధార, రంగా భోజనం చేస్తుంటారు. అప్పుడే సరోజ క్యారేజ్ తీసుకొని వస్తుంది. చేపల పులుసు తెచ్చానని సరోజ అంటుంది. లేదు సర్ చారుతో తింటారని రంగాకి చారు పోస్తుంది వసుధార. అది తిని నానమ్మ ఈ చారు నువ్వు చెయ్యలేదు కదా అని రంగా అడుగుతాడు. లేదు ఆ అమ్మాయి వద్దంటే వంట చేసిందని పెద్దావిడ చెప్తుంది. ఏం బాలేదని రంగా అనగానే వసుధార బాధపడుతుంది. అప్పుడు సరోజ చేపల పులుసు వడ్డీస్తుంది. ఆ తర్వాత సారీ సర్ అని వసుధార అంటుంది. ఎందుకు మేడమ్ అని రంగా అంటాడు. మీకు నచ్చని విధంగా వంట చేసాను కదా.. అందుకే అని వసుధార అంటుంది. మీరు వంట చేశారని కోపం అంతే అని రంగా అంటాడు.

ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలేజీ కి ఎవరు ఎండీగా ఉండాలో చెప్పండి అని మినిస్టర్ అడుగుతాడు. ఒకరు మను అంటారు.. మరొకరు శైలేంద్ర అంటారు. దాంతో మీరు ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోండి.. లేదంటే ఈ కాలేజీని మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని మినిస్టర్ అనగానే.. ఇది మా కాలేజీ అలా అంటారు ఏంటని శైలేంద్ర అంటాడు. మా కుటుంబం వాళ్లే ఉండాలి కాబట్టి నేనుంటానని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.