సంక్రాంతికి `పొన్నియన్ సెల్వన్`
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. `పొన్నియన్ సెల్వన్`. విక్రమ్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా భారీ తారాగణమే నటిస్తున్న ఈ చారిత్రక చిత్రానికి సంబంధించి.. ఇప్పటివరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మధ్యప్రదేశ్ లో జరగాల్సిన షూటింగ్ కి కరోనా కారణంగా అనుమతులు రాకపోవడంతో.. చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మిగిలిన భాగాన్ని పూర్తిచేయనున్నారు. కాగా, అన్నీ కుదిరితే 2022 సంక్రాంతికి `పొన్నియన్ సెల్వన్`ని థియేటర్స్ లోకి తీసుకురావడానికి మణిరత్నం అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.