English | Telugu

Jayam serial : పొంగలి రుచిచూపించిన కొత్తపనిమనిషి.. శంకుతలని గంగ మార్చేస్తోందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో.....పెద్దసారు, గంగ మాట్లాడుకుంటారు. కొడుకు చనిపోయాడు అందుకే నా భార్య బాధతో గదిలో నుండి బయటకు రావడం లేదు.. అసలు ఏం తింటుందో.. ఏ టైమ్ కి పడుకుంటుందో తెలియదు.. నువ్వు తనలో మార్పు తీసుకొని వస్తావని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానని గంగతో పెద్దసారు అంటాడు.

కిచెన్ లోకి గంగ వెళ్లి నేను వంట చేస్తాను.. మీరు పక్కకి తప్పుకోండి అని గంగ అంటుంది. ఇంతకీ ఏం వంట చెస్తున్నావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. పొంగలి చేస్తున్నా అని గంగ అనగానే అది శకుంతలకి బాగా ఇష్టమని పెద్దసారు అంటాడు. గంగ పొంగలి చేసి శకుంతల దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఎవరు అని కోపంగా శకుంతల ఆడుగగా నేను భానుని అని అనగానే శకుంతల డోర్ తీస్తుంది. మీకు ఇష్టమైన వంట చేసుకొని వచ్చానని గలగల మాట్లాడుతుంటే శకుంతల కొడుకు భాను మాట్లాడినట్లుగా శకుంతల ఉహించుకుంటుంది. తనకి ఇష్టమైన పొంగలి చేసానని తినిపిస్తుంది. అందరు గంగని తిడుతుందనుకుంటారు కానీ శకుంతల పొంగలి తింటు మాట్లాడుతుంటే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు శకుంతల గది దగ్గర ఉండడంతో ఏమైంది పెద్దమ్మకి అని రుద్ర కంగారుపడతాడు. ఏం లేదు కొత్తగా పనిమనిషి జాయిన్ అయింది. తనతో శకుంతల బాగుంటుందని అనగానే నేను ఒకసారి చూస్తానని రుద్ర అంటాడు. వద్దు మళ్ళీ నిన్ను చూస్తే ఏమన్నా అంటుందని పెద్దసారు అనగానే సరే నేను వెళ్తున్నానని రుద్ర వెళ్తాడు.


ఆ తర్వాత రుద్ర వెళ్తుంటే కార్ వెనకాల గంగ కూర్చొని ఉంటుంది. ఆ విషయం రుద్రకి తెలియదు. రుద్ర సూపర్ మార్కెట్ దగ్గర కార్ ఆగగానే తన కంటే ముందు వెళ్లి పూజ చేస్తుంది గంగ. అప్పుడే గంగని చూస్తుంటాడు రుద్ర. తరువాయి భాగంలో శకుంతల వచ్చి వంట చేస్తుంది. అందరు తినేసి కాసేపటికి పడుకుంటారు. రుద్ర ఒక్కసారిగా లేచి పెద్దమ్మ చేతిగోరు ముద్దలు తినలేను.. తను వండింది అయిన తింటానని రుద్ర భోజనం చేస్తుంటే గంగ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.