ఘనంగా నందు-గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక
టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు సింగర్ గీతామాధురి - యాక్టర్, హోస్ట్ నందు. వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వీళ్ళు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో ఒక పాప పుట్టింది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. 2024 ఫిబ్రవరి 10న గీతామాధురికి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బాబుకి ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బాబుకు ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. అటు నందు, ఇటు గీతామాధురి కుటుంబ సభ్యుల మధ్యలో ఘనంగా శాస్త్రబద్ధంగా ఈ అన్న ప్రాసన నిర్వహించారు. ఇక ఆ పిల్లాడి ఎదురుగా డబ్బులు, పుస్తకాలు, పూలు, ఆహరం పెట్టారు. ముందుగా డబ్బును ముట్టుకున్నాడు తారక్. తర్వాత పుస్తకాన్ని, తర్వాత బంగారాన్ని తాకాడు. ఈ తంతు తర్వాత పెద్దవాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి చిటికెడు చిటికెడు ఆహారాన్ని తినిపించి ఆశీర్వాదాలు అందించారు.