English | Telugu

అందరూ కలిసి నాకు వెన్నుపోటు పొడిచారు... తెర వెనుక నాగబాబు కష్టం!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ మొదలై పుష్కరం పూర్తైన సందర్భంగా 12 ఏళ్ళ సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి కొత్త పాత కమెడియన్స్ అంతా కూడా మళ్ళీ ఒక చోట చేరారు. అలాగే జడ్జ్ నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే స్కిట్స్ కి పడీపడీ నవ్వుతూ ఉన్నారు. ఐతే ఇందులో ఆది ఒక స్కిట్ వేసాడు. అందులో ఎవరు ఎవరిని పొడిచి పైకొచ్చారో చెప్పాడు. జబర్దస్త్ లో అందరూ కట్టప్పలే బాహుబలులు ఎవరూ లేరు. ఒకరు పైకి రావడానికి ఇంకొకరు టీం లీడర్స్ ని పొడిచి పైకి వచ్చినవాళ్లే అంటూ చెప్పాడు. దాంతో నాగబాబు ఈ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యారు. చలాకి చంటిని అందరూ పొడిచారు అని చెప్పాడు ఆది.

ఆది నీకు అసలు విషయం తెలియడం లేదు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను పొడిచారు..ఆ విషయం నీకు ఇంకా తెలియడం లేదు. ఈ స్టేజి మీద నన్ను ప్రతీవాళ్ళూ పొడిచారు. చంటి వీపు జల్లెడ ఐతే నాకు అసలు వెనక ఏమీ లేదు. వేరే స్కిన్ కప్పుకుని తిరుగుతున్నా అంటూ చాలా ఫీలయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, గెటప్ శీను, ధనరాజ్, షకలక శంకర్ ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఎవరి గురువులకు వాళ్లకు కాళ్ళు కడిగి వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకున్నారు. ఇక చాన్నాళ్ల తర్వాత నాగబాబు నవ్వును మళ్ళీ జబర్దస్త్ స్టేజి మీద వింటున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.