English | Telugu

రష్మీ,అనసూయ మధ్య విభేదాలు..జబర్దస్త్ సెలెబ్రేషన్స్ లో రష్మీ కన్నీళ్లు


జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి అలనాటి జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒక చోట చేరారు. అలాగే వెళ్లిపోయిన జడ్జెస్ కూడా తిరిగి వచ్చారు. కానీ రోజా, సుధీర్ మాత్రం ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించలేదు. ఇక ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనసూయ - రష్మీ ప్యాచప్. గతంలో అనసూయ, రష్మీ ఈ షోకి యాంకర్స్ గా చేసిన విషయం తెలిసిందే. ఐతే అనసూయ కొన్ని కారణాల వలన అలాగే మూవీ ఆఫర్స్ కారణంగా జబర్దస్త్ హోస్ట్ గా బై చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. అప్పటి నుంచి రష్మీ కంటిన్యూ అవుతూనే ఉంది.

ఇక ఇప్పుడు ప్రోగ్రాంలో రష్మీ, అనసూయ ఎమోషనల్ అయ్యారు. "జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండ ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి" అంటూ లేచి వెళ్లి రష్మీని హగ్ చేసుకుంది. దాంతో ఆమె ఏడ్చేసింది. "నిజానికి ఎవరికీ తెలియనివి కొన్ని అందరికీ తెలిసిపోయేలా ఉన్నాయి మన ప్యాచప్ వలన..ఓ అదే మీ ఇద్దరూ మాట్లాడుకోరా" అంటారు. దాంతో రష్మీ వెంటనే "అదేదో వాట్సప్ లో కానీ ఫోన్ చేసి ఉంటే ఐపోయేది కదా" అని చెప్పింది. వెంటనే అనసూయ "అలా ఫోన్ లో మాట్లాడితే చాలా ఈగోలు అడ్డొస్తాయి.. ఇలా ఐతే" అంటూ నవ్వేసింది. ఐతే వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు చూడలేదు. వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం లేదు అనే విషయం తెలుస్తోంది. ఐతే ఎందుకు వీళ్ళు మాట్లాడుకోవడం లేదు అనే విషయం రాబోయే ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.