English | Telugu

నాకు రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి


శ్రావణ మాసం సందర్భంగా ఇప్పుడు షోస్ అన్నిట్లో ఆ శ్రావణ మాసం ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ఫామిలీ స్టార్స్ కూడా అదే థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో రోహిణి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక కమెడియన్ జ్ఞానేశ్వర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "జ్ఞాని ఏంట్రా" అని సుధీర్ అడిగేసరికి "అన్న నేను కూడా పూజ చేయడానికి వచ్చాను. పూజ చేస్తే నాకు కూడా రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి" అన్నాడు. "రేయ్ ఆవిడ యానిమల్ ని థియేటర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. పర్సనల్ గా నేను ట్రై చేశా యాక్సెప్ట్ చేయరు." అన్నాడు సుధీర్ . ఇంతలో శ్రీకర్ కృష్ణ ముందుకు వచ్చి "ఈ పూజ సంగతి పక్కన పెట్టు రీసెంట్ గా ఎవరో పూజ పరిచయం అయ్యారటగా" అన్నాడు కామెడీగా. "ఏంటయ్యా బాబు నువ్వు" అన్నాడు సుధీర్.

తర్వాత సుధీర్ అమ్మాయిల ముందు తెగ సిగ్గుపడ్డాడు. "అందంగా లేను అని అందరూ నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు" అన్నాడు కావ్య ముందుకు వెళ్లి. "దేవుడు ఎవరినీ అందం లేకుండా స్రుష్టించడు అండి. కానీ మిమ్మల్ని ఎవరు సృష్టించారో తెలీట్లేదు" అంది. అంతే సుధీర్ షాకయ్యాడు ఆ కామెంట్ కి. ఇక రోహిణి ఐతే వైరల్ వయ్యారి పాటలో ఆ వయ్యారిని నేనే అంటూ నా వెనకాల పడుతున్నారు అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంకా ఆ పాటకు రోహిణి డాన్స్ చేసి సుధీర్ ని ఒక ఆట ఆడేసుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.