English | Telugu

Brahmamudi : ఇంటికి వారసుడిని ఇవ్వడం నా భాద్యత.. శుభవార్త చెప్పిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -793 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. రాజ్ వెళ్తుంటే ఇందిరాదేవి, అపర్ణ ఆపి మేం కావ్యకి నచ్చజెప్పుతాం.. నువ్వు టెన్షన్ పడకని అంటారు. వద్దు తనకి ఇష్టం లేదు.. ఇన్ని రోజులు నా హెల్ప్ తీసుకుంటే అది ప్రేమ అనుకుని భ్రమ పడ్డాను అంతే అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్య దగ్గరకు వచ్చి.. నువ్వు ఏం చేస్తున్నావ్.. అర్ధం అవుతుందా.. ఇన్ని రోజులు ఈ సమయం కోసం వెయిట్ చేసావ్.. తీరా ఇలా చేసావ్ ఎందుకు ఇలా చేసావ్ కారణం ఏంటని కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి. ఏం లేదు నా కారణాలు నాకుంటాయని కావ్య అనగానే నువ్వు చెప్పవు ఇప్పుడే రాజ్ దగ్గరికి వెళ్లి గతం గురించి చెప్తానని అపర్ణ వెళ్లిపోతుంటే.. నేను తల్లిని కాబోతున్నానని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో ఎలా చెప్పాలి.. నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని ఎలా చెప్పాలని కావ్య బాధపడుతుంది. నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత.. అందుకే నేను ఆయనకు ఎదురు పడనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి ఏదో వచ్చి డాష్ ఇస్తుంది. మరొకవైపు రాజ్ కోసం యామిని చూస్తుంటుంది.

ఆ తర్వాత కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. రాజ్ ని కావ్య రిజెక్ట్ చేసిందని కోపంతో ప్రకాష్, సుభాష్, ధాన్యలక్ష్మి కాఫీ తీసుకోకుండా తనతో కోపంగా మాట్లాడుతారు. పాపం దాని పరిస్థితి చుస్తే బాధగా ఉంది అత్తయ్య.. నిజం చెప్పలేక ఎవరు ఎమన్నా పడుతుందని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి.. నీకు రాజ్ అంటే ఇష్టం కదా ఎందుకు వద్దన్నావని అడుగుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. తరువాయి భాగంలో మా బావ ఎక్కడ నిన్నటి నుండి ఇంటికి రాలేదని కావ్య దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ ఎక్కడికి వెళ్ళాడని ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.