English | Telugu

Eto Vellipoyindhi Manasu : అభి గురించి మొత్తం తెలుసుకున్న సీతాకాంత్.. వాళ్ళని చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -86 లో.. అభి గురించి రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే అభి కాల్ చేసి తన గురించి పాజిటివ్ గా చెప్పుకుంటాడు. అలా అభి,  రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం విని.. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా అభి గురించి చెప్తే.. నేను కావాలనే అలా చెప్తున్నాననే ఛాన్స్ ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. అభితో ఫోన్ మాట్లాడిన తర్వాత.. ఏదో చెప్తానన్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఏం లేదంటూ సీతాకాంత్ కవర్ చేస్తాడు.

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో ఊహించని మలుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1064 లో..‌ మను తప్పు చేసే మనిషి కాదు అతన్ని నా కొడుకుగా చేసుకుందాం అనుకున్నాను కానీ చివరి నిమిషంలో ఇలా జరిగింది. నాకు అదృష్టం లేదమోనని మహేంద్ర అంటాడు. కానీ మనుని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది.. మీరేం కంగారు పడకండి అంటూ అనుపమ వాళ్ళకి మహేంద్ర ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత వసుధార.. రిషి ఫోటో పట్టుకొని మను కూడా మీ నాన్న కొడుకంట. ఈ విషయం మను, మావయ్యకి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వసుధార ఆలోచిస్తు పడుకుంటుంది. అప్పుడే రాజీవ్ నీడ తనపై పడుతుంది. ఒక్కసారిగా లేచి ఎవరంటు బయటకు వస్తుంది. కానీ ఎవరు ఉండరు.

Brahmamudi : అతడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు.. ఇంటిగుట్టు బయటపడేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -399 లో....ఎలాగైనా ఆ సేట్ ని ఇప్పుడు రప్పించి స్వప్న అప్పు తీసుకుందని చెప్పించమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. అప్పుడే రుద్రాణి దగ్గరికి అనామిక వచ్చి.. చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? మీరు చెప్పినట్టు చేస్తే అటు భర్తకి ఇటు అత్తకి దూరం అయ్యానని అనామిక అంటుంది. ఆ తర్వాత అలా ఎందుకు చేస్తానని రుద్రాణి అనగానే.. కళ్యాణ్ ఎండీ కాకుండా ఆపి రాహుల్ ని చెయ్యాలని నీ ప్లాన్ అని అనామిక అనగానే.. అలా చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసేదాన్ని అని రుద్రాణి అంటుంది.

Karthika Deepam2 : ఆమెకు డబ్బు ఆఫర్ చేసిన పారిజాతం.. తను‌ ఒప్పుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.. జ్యోత్స్న చేసిన పనికి బాధపడుతుంటే.. శౌర్య వచ్చి ఎందుకు బాధపడుతున్నావని ఆడుగుతుంది.. ఆ తర్వాత న్యూస్ లో జ్యోత్స్న గురించి చెప్తుంటారు.. మిస్ హైదరాబాద్ కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు న్యూస్ లో చెప్పడం విన్న జ్యోత్స్న ఆవేశంగా లోపలకి వెళ్తుంది. తన వెంటే సుమిత్ర , పారిజాతం వెళ్తారు. అంత ఆ దీప.. నేను తప్పు చేసానని చెప్పడం వల్లేనని జ్యోత్స్న అంటుంటే.. ఇందులో దీప తప్పేంటని సుమిత్ర అంటుంది.  నువ్వు ఆ దీపకే సపోర్ట్ అని తెలుసంటు జ్యోత్స్న కోప్పడుతుంది..