English | Telugu

Brahmamudi : నిన్ను పెళ్ళి చేసుకొని నేను మోసపోయాను.. ఇంటిప్రతాల గుట్టు తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -398 లో....అనామికని స్వప్న పిలుస్తుంది. నన్ను చెంపదెబ్బ కొట్టినందుకే ఎలా చేసానో చూసావ్ కదా అని అనామిక అనగానే.. అయ్యో ఒక చెంపపై కొట్టాడని ఫీల్ అవుతున్నారా అంటు అనామిక మరొక చెంప చెల్లుమనిపిస్తుంది స్వప్న. నన్నే కొడతావా అని అనామిక అనగానే.. మరి నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడి కేసు పెట్టినందుకు.. నేను ఇలా కొట్టాను కానీ అప్పు ఇలా కాదంటూ అనామికకి స్వప్న వార్నింగ్ ఇస్తుంది..

ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఎందుకు చేసావ్ ? ఇంత జరుగుతున్నా మళ్ళీ చేసావని అప్పు అనగానే.. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం మానేస్తే నిజంగానే వాళ్ళన్నదే నిజం అనుకుంటారు. వాళ్లకి బయపడినట్టు ఉంటుందని కళ్యాణ్ మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. అదంతా అనామిక వింటుంది. ఇంత జరిగినా కొంచెం కూడా సిగ్గు లేదా? ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది.. మాట్లాడతాను అప్పు విషయంలో ఎవరేం చెప్పినా వినను ముఖ్యంగా నువ్వు చెప్తే అసలే విననని కళ్యాణ్ అంటాడు. నిన్ను పెళ్లి చేసుకుని మోసపోయానంటూ కళ్యాణ్ అనగానే... అనామికకి కోపం వస్తుంది. మరోవైపు కావ్య దగ్గరికి రుద్రాణి వస్తుంది.. నీ బాధ్యత మర్చిపోయావని అడగడానికి వచ్చాను.. రాజ్ ఇంకా రెండు రోజుల్లో నిజం చెప్పకుంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి కదా అందుకే ముందే బయట ఒక ఇల్లు చూసుకుంటే మంచిది కదా అని రుద్రాణి అంటుంది. దానికి సమాధానంగా కావ్య తనకి గట్టి కౌంటర్ ఇస్తుంది.

కాసేపటికి డ్రైవర్ కార్ క్లీన్ చేసుకుంటూ.. కార్ లో బొకే కిందపడేస్తాడు. అది చూసిన కావ్య.. నా భర్త నా కోసం కొన్నాడు కానీ ఇవ్వకుండా బాబుని తీసుకొని వచ్చాడు. అంటే ఆ లోపే ఏదో జరిగింది తెలుసుకోవాలని కావ్య అనుకుంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరకి అనామిక వెళ్తుంది కానీ ధాన్యలక్ష్మి తన కొడుకు పరువు తీసావంటు తనతో మాట్లాడడానికి ఇష్టపడదు. ఆ తర్వాత స్వప్నకి ఇచ్చిన ఇంటి పత్రాలు కనబడకపోయేసరికి.. ఏం చేసావంటూ స్వప్నని రుద్రాణి, రాహుల్ ఇద్దరు అడుగుతారు. నేను అక్కడే పెట్టాను కానీ కన్పించడం లేదని స్వప్న ఇంట్లో వాళ్లకు చెప్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలాగైనా ఆ సేట్ ని పిలిచి స్వప్న పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందని చెప్పమనని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. తరువాయి భాగంలో సుభాష్ తో రాజ్ మాట్లాడి.. డబ్బులు తీసుకొని ఎక్కడికో వెళ్తుంటే కావ్య కూడా రాజ్ కి తెలియకుండా తన వెనకాలే ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.