English | Telugu

Brahmamudi : అతడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు.. ఇంటిగుట్టు బయటపడేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -399 లో....ఎలాగైనా ఆ సేట్ ని ఇప్పుడు రప్పించి స్వప్న అప్పు తీసుకుందని చెప్పించమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. అప్పుడే రుద్రాణి దగ్గరికి అనామిక వచ్చి.. చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? మీరు చెప్పినట్టు చేస్తే అటు భర్తకి ఇటు అత్తకి దూరం అయ్యానని అనామిక అంటుంది. ఆ తర్వాత అలా ఎందుకు చేస్తానని రుద్రాణి అనగానే.. కళ్యాణ్ ఎండీ కాకుండా ఆపి రాహుల్ ని చెయ్యాలని నీ ప్లాన్ అని అనామిక అనగానే.. అలా చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసేదాన్ని అని రుద్రాణి అంటుంది.

ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడానికి అర్హత ఒక కళ్యాణ్ కి మాత్రమే ఉంది. ఇలా నువ్వు పోలీస్ కేసు పెడితే ఇప్పుడు.. అప్పు, కళ్యాణ్ లు ఇక మీదట దూరంగా ఉంటారు. ఇక కళ్యాణ్ ని నువ్వు ప్రేమతో దగ్గర చేసుకోవచ్చు.. నీ మాట వినేలా చెయ్యొచ్చు.. అప్పుడు ఆఫీస్ లో అధికారం కళ్యాణ్ ది.. ఇంట్లో నీది అని రుద్రాణి అనగానే.. సారీ అంటీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అనామిక అంటుంది. మరొకవైపు సుభాష్ దగ్గర రాజ్ పది లక్షలు తీసుకుంటాడు. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిన కొద్దీ డబ్బులు ఇస్తూనే ఉంటావని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్తుంటే.. కావ్య అదంతా చూసి తను కూడా బయల్దేరి వెళ్తుంది. రాజ్ ఒక ప్లేస్ కి వెళ్లి ఒకతనికి డబ్బులు ఇస్తాడు. ఇంకొకసారి బ్లాక్ మెయిల్ చేస్తే చంపేస్తానంటు అతనికి రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రాజ్ వెళ్ళాక అతని ద్వారా కావ్య నిజం తెలుసుకోవాలని వస్తుంది కానీ ఆ లోపే అతను వెళ్ళిపోతాడు. అతన్ని పట్టుకుంటే నిజం బయటపడుతుందని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత సేట్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. స్వప్న తన దగ్గర ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుందని చెప్తాడు.

ఆ తర్వాత అప్పు తీసుకున్నట్ల పేపర్స్ పై స్వప్న సంతకం చూపిస్తాడు. నిజానిజాలు తెలేవరకు మీరు వెళ్ళండి అని ఆ సేట్ ని పంపిస్తారు.. ఇలా చేస్తావా? ఇలాంటిదానివి ఈ ఇంట్లో నుండి గెంటెయ్యాలని రాహుల్ అనగానే.. ఇందిరాదేవి వద్దంటుంది. నీకు అంత డబ్బు అవసరం లేదని తెలుసు గానీ మంచిగా ఆలోచించు.. అసలు ఏం జరిగిందని స్వప్నని అపర్ణ అడుగుతుంది. రెండు రోజుల్లో అంత తెలుస్తానని స్వప్న అంటుంది.. ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. కాసేపటికి కావ్య కూడా వస్తుంది.. తరువాయి భాగంలో రాజ్ ఫోన్ ని కావ్య తీసుకొని అందులో నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత అప్పుకి చెప్పి అసలు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమని చెప్పగా.. దానికి అప్పు సరే అంటుంది. కావ్య ఫోన్ మాట్లాడి వెనక్కి చూసేసరికి రాజ్ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.