RELATED EVENTS
EVENTS
Nashville Shiridi saibaba Punyathithi celebrations

అమెరికాలోని Tennesseరాష్ట్రంలోని Nashville నగరం లో మొట్టమొదటి సారిగా జరిగిన షిరిడి సాయిబాబా పుణ్యతిధి వేడుకలు దసరా రోజున ఇక్కడి స్థానిక శ్రీ గణేశ టెంపుల్ లో shirdisai nashville group ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

విజయదశమి రోజున బాబా సమాధిచెంది భక్త మానవకోటి సేవకు అంకితమైన రోజుగా చెప్పుకునే ఈ పున్యతితిని ఆబాలగోపాలం భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. భజనలు, ఆరతులు, బాబా అభిషేకాలు, పల్లకి సేవలతో తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినా భక్తులు కూడా బాబా సేవలో పాలు పంచుకున్నారు.చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి . ఇరవై ఒక్క రకాలతో బాబాకు "బ్రంహబోజనం(నైవేద్యం) " సమర్పించారు . మూడు నెలల క్రితంగురుపౌర్ణమి రోజున 30 మంది తో ప్రారంభమైన బాబా పూజలు కేవలం 3 నెలల్లో 300 భక్తులకి చేరిందన్నారు. భక్తులనుండి వస్తున్నా ప్రోత్సాహం తో త్వరలోనే వచ్చే సంవత్సరం కాళ్ళ బాబా గుడి ప్రారంభించే అవకాశం ఉంది అని నిర్వాహకులు తెలిపారు.

 

పూజ కార్యక్రమాలను జ్యోత్స్న పరచూరి, శివ పెద్ది, రాజ్ కన్నన్ సాంస్కృతిక కార్యక్రమాలను సాయి సూర్య, భజనలు రమాదేవి మరియు ప్రసాదం పంపిణి ఏర్పాట్లను ప్రసాద్ నల్లక పర్యవేక్షించారు.ఈ సందర్భంగా భక్తులకు మరియు volunteer లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;