RELATED EVENTS
EVENTS
Rasamayi Dubai Diwali Celebrations

దుబాయ్ లోని తెలుగువారి కోసం గత 25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగు సంస్థ 'రసమయి ' ఈ దీపావళి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. టాలివుడ్ ప్లే బాక్ సింగర్లు శ్రీ కృష్ణ,గీతా మాధురి,దీపు(అలా మొదలైంది),పర్ణిక,ధీరజ్(మా టీవీ) ల సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది, చక్కటి మెలొడీ గీతాలతో పాటు ఫాస్ట్ బీట్ పాటలతో దుబాయ్ లోని తెలుగువారిని అలరించారు. ఆట, మగధీర వంటి డాన్స్ షోల ద్వారా పేరుపొంది, డాన్స్ ఇండియా డాన్స్ లాంటి నేషనల్ లెవల్ కాంపిటీషన్ లో ఫైనల్స్ కు చేరిన మన తెలుగు నృత్య కళాకారులు సురేష్ వర్మ,స్నేహలు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రేక్షకులని ఉర్ర్రతలూగించింది. అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన విద్యా రావ్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఫణి మాధవ్ లు కార్యక్రమ వ్యాఖ్యాతలుగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఫణి మాధవ్ ప్రదర్శించిన మిమిక్రీ,విద్యారావ్ ప్రత్యేక నృత్యప్రదర్శన ఆకట్టుకున్నాయి.

రసమయి రజతోత్సవ వేడుకల లోగోని రసమయి సభ్యులందరి సమక్షంలో తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయస్ఫూర్తితో అనేక అద్భుత కార్యక్రమాలు నిర్వహించిన సిలికానాంధ్ర అద్యక్ష్యులు కూచిభొట్ల ఆనంద్ ఆవిష్కరించి...రజతోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రసమయి పూర్వాద్యక్ష్యులని సన్మానించారు. రస్సమయి రజతోత్సవ కమిటీ చైర్ మెన్ శ్రీ రాజు గారు, కార్యదర్శి మనోహర్,పప్పు వెంకట శాస్త్రి,కేసరి త్రిమూర్తులు,అమృత్,ఉమా పాడి తదితరులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;