ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా..

Publish Date:Dec 14, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని కోరుతూ ఉద్యమిస్తే, వైకాపా అసలు రాష్ట్రవిభజన జరపడానికే వీలులేదని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసింది. ఆనాడు వైకాపా చేప్పట్టిన ఉద్యమం ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగినట్లు కనిపిస్తే, తెదేపా రాష్ట్ర విభజన కోరుకొంటున్నట్లుగా కనబడేది. కానీ నిజానికి తెదేపాయే రాష్ట్రం కలుసుండాలని మనస్పూర్తిగా కోరుకొంటే, వైకాపా రాష్ట్రం విడిపోవడం వలననే ఆంధ్రాలో తను అధికారం సంపాదించగలనని భావించిన సంగతి పెద్ద రహస్యమేమీ కాదు.

 

రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి గ్రహించినందునే తెదేపా వాస్తవిక దృక్పధంతో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరింది. ఇదంతా వైకాపాకు కూడా తెలుసు. కానీ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను దెబ్బతీయడాని కోసం, తాము రాష్ట్రం విడిపోకుండా ఉద్యమిస్తుంటే, తెదేపా రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటోందని ప్రచారం చేసుకొంది. ఒకవేళ వైకాపా నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొని ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణాను విడిచి పెట్టి బయటకువచ్చేసేదే కాదు. ఎలాగూ రాష్ట్రం విడిపోతోంది కనుక ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకోవాలంటే, రెండు రాష్ట్రాలకు సమ న్యాయం అనడం కంటే ప్రజల అభీష్టానికి అనుగుణంగా నలుగురితో నారాయణ అనడమే మంచిదనే ఉద్దేశ్యంతోనే వైకాపా సమైక్య ఉద్యమాలు చేసినమాట వాస్తవం. ఆ సమయంలో తెదేపా దాని అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమయిన ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చును. కానీ ఆయన తుదివరకు కూడా తన నిర్ణయానికే కట్టుబడి ఉంటూ రెండు రాష్ట్రాలలో తన పార్టీని కాపాడుకోగలిగారు. బహుశః ఆయన కనబరిచిన ఆ స్థిత ప్రజ్ఞతే ప్రజలను ఆకట్టుకోందని చెప్పవచ్చును.

 

నిజానికి రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి ఆంద్ర ప్రజలకు కూడా తెలియదనుకోలేము. కానీ విభజన జరిగితే రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందోననే తీవ్ర ఆందోళన, అంతకాలం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతి విడిపోతోందనే ఆవేదన, ఇంకా అనేక ఇతర కారణాల చేత ప్రజలు ఉద్యమించారు. వారి ఆ ఆవేదనని, ఆవేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు వైకాపా సమైక్యఉద్యమాలు చేసింది. ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల వైఖరిని వాటి వెనుక వారి అంతర్యాన్ని ప్రజలు బాగానే అంచనా వేయగలిగారు. అందుకే చిత్తశుద్ధి లేని ఉద్యమాలు చేసిన వైకాపాను ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. చేదునిజాలు మాట్లాడిన తెదేపాకు పట్టం కట్టారు.

 

ఆ తరువాతయినా వైకాపా తన తీరు మార్చుకోలేదని ఆ పార్టీ తీరు గమనిస్తే అర్ధమవుతుంది. అధికారం చేజిక్కించుకోలేక ఆ దుగ్ధతో ప్రభుత్వం చేప్పట్టే ప్రతీ పనికి అడ్డుతగులుతోంది. రాజధాని లేకపోవడం అవమానకరమనే ఆలోచన కూడా లేకుండా రాజధాని నిర్మాణానికి అడుగడునా అడ్డుతగులుతోంది. తీవ్ర ఆర్ధిక సమస్యలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఇస్తూ, పంట రుణాలను మాఫీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలుచేసేందుకు, పనిలోపనిగా తన పార్టీ ఉనికిని కాపాడుకొంటూ, తన ఉనికిని చాటుకొనేందుకు వైకాపా అధినేత జగన్ ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు.

 

అదేవిధంగా తెలంగాణాను విడిచిపెట్టి వచ్చేయడం చాలా పెద్ద పొరపాటనే విషయం గ్రహించిన తరువాత ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో మళ్ళీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా...అన్నట్లుగా చిత్తశుద్ధిలేని ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండబోదు. పైగా అటువంటి ప్రయత్నాల వలన ఆ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న ‘విశ్వసనీయత’ కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చును.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.