బాబు పకడ్బందీ వ్యూహం.. గన్నవరం వంశీకి దూరం!

రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ ఆస్థాన విద్వాంసుల్లో  వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ..  ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తున్నారు. గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం క్యాడ‌ర్ మ‌ద్ద‌తుతో గెలిచిన ఆయ‌న‌కు ఈసారి ఘోర ఓట‌మి ఎదురు కాబోతున్న ద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.   ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి త‌ర‌పున‌ తెలుగుదేశం అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ వైసీపీ అభ్యర్థిగా వంశీ చేతిలో స్వ‌ల్ప ఓట్లతో ఓడిపోయారు. వంశీ జ‌గ‌న్ శిబిరంలో చేర‌డంతో..  యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన‌ నాటినుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు యార్ల‌గ‌డ్డ అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. మొద‌టి నుంచి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి  కంచుకోట. దీనికితోడు వంశీని ఓడించేందుకు చంద్ర‌బాబు ప‌క‌డ్బందీ వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని,  దీంతో యార్ల‌గ‌డ్డ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌కేన‌నిపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో మ‌రోసారి ఇక్కడ తెలుగుదేశం విజయం ఖాయమని పేర్కొన్నాయి.     గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌.  1983 త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతూ వ‌స్తుంది..మ‌ధ్య‌లో రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలిచిన‌ప్ప‌టికీ వారుకూడా టీడీపీ సానుభూతి ప‌రులే కావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రంలో వంశీని భారీ మెజార్టీతో ఓడించాల‌ని తెలుగుదేశం శ్రేణులు, చంద్ర‌బాబు అభిమానులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీలో చేరిన త‌రువాత తెలుగుదేశం నేత‌ల‌పై నోరుపారేసుకోవ‌టం అల‌వాటుగా మారింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, నారా, నంద‌మూరి కుటుంబాల అభిమానులు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోవంశీకి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లుసైతం వెనుక‌డుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వంశీ క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తిఅని, రాజ‌కీయ భిక్షపెట్టిన చంద్ర‌బాబు నాయుడు కుటుంబంపైనే అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపితే ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్నికూడా క్ష‌మించ‌ర‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే పేర్కొటున్నారు.  గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించి వైసీపీలోకి వెళ్లిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. వైసీపీలో చేరిన త‌రువాత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని ప‌లువురు వైసీపీ నేత‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన వంశీని ప‌లువురు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.   ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ, కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. ఎవ‌రు విజ‌యం సాధించాల‌న్నా ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు కీల‌కం. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తుండ‌టంతో  మెజారిటీ కాపుసామాజిక వర్గ ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి  యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తు నిలుస్తున్నారు. ఎస్సీలు అధిక‌శాతం తెలుగుదేశంకు మద్దతుగా ఉన్నారు. అలాగే బీసీలు సైతం కూటమికే జై కొడుతున్నారు.   క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వంశీకి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు వారంతా ఏక‌తాటిపైకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.    సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు కొంత‌కాలంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజ‌కీయాల్లో యాక్టివ్ గా లేరు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడ‌త‌ల వారిగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. చివ‌రి వ‌ర‌కు వ‌ల్ల‌భ‌నేని వంశీకి అవ‌కాశం ద‌క్క‌లేదు. వైసీపీ నుంచి పోటీచేస్తే ఓడిపోతాన‌ని భావించిన వంశీ.. తాను ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటాన‌ని జ‌గ‌న్ కు చెప్పిన‌ట్లు అప్పట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే  జ‌గ‌న్ ప్రోద్బ‌లంతో పోటీకి ఒప్పుకోవ‌టంతో చివ‌రి విడ‌త‌లో గ‌న్న‌వ‌రం అభ్య‌ర్థిగా వంశీ పేరును వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది.  వారంరోజుల క్రితం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర  గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సాగింది. అయితే , బ‌స్సు యాత్ర‌లో ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌లు పాల్గొన‌లేద‌ని నియోజ‌క‌వ‌ర్గం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతున్నది.   రాజ‌కీయ బిక్ష‌పెట్టిన  చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు ప్ర‌జ‌లంతా సిద్ధ‌మైన‌ట్లు ఉమ్మ‌డి కృష్ణా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి ఎటుచూసినా ఈద‌ఫా ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప్ర‌ముఖ‌ స‌ర్వే సంస్థ‌లు సైతం తేల్చాయి.
Publish Date: Apr 20, 2024 9:52AM

హ్యాపీ బర్త్ డే చంద్రబాబూ.. ఏపీ నీడ్స్ యూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.  వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇది జరిగి ఐదేళ్లయ్యింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి పదేళ్లు పూర్తయ్యాయి.  కానీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  ఇప్పటికీ రాజధానే లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజదాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి  ప్రభుత్వం అటకెక్కించింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచన పేరుతో  అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా  రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో ఐదేళ్లు గడిచిపోయాయి.   అసలు రాజధానే లేని రాష్ట్రంగా   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది.   ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం   ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతానికిపైగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  పరిస్థితి అభివృద్ధి అన్న మాటకే తావులేని విధంగా మారిపోయింది. అన్ని విషయాల్లోనూ వెనుక బడి అక్షరక్రమంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో అధమ స్థానంలో అన్నట్లుగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఏపీ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి, సంక్షేమాలలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఆశలు ఉండేవి. ఐటీ రంగంలో హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుందన్న భావన అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారి పోయింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత  ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి?  సేమ్ ఓల్డ్ స్టోరీ రాజధాని అమరావతి ఏమైందో, 75శాతం పూర్తయిన పోలవరం ఎలా పడకేసిందో.. రాష్ట్రంలో ఐటీ రంగానిది కూడా అదే కథ. అదే వ్యథ.  ఐటీ శాఖ మంత్రికి గుడ్డు కథ చెప్పడంలో ఉన్న నైపుణ్యం.. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలను ఆకర్షించడంలో లేదు.   నిజమే రాష్ట్ర విభజన సమయంలోనే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం  అదే అన్యాయాన్ని కొనసాగించింది.  మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్  అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అంతకు ముందు   ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానానికి స్పీడ్ బ్రేకులు వేసి నిలిపివేశారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారంతో   అభివృద్ధిని అటకెక్కించారు.   ఈ రోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు  అనుకునే  పరిస్థితికి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చేశారు. అందుకే  రాజకీయ విశ్లేషకులు, మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుదు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన రావడమొక్కటే మార్గం అంటున్నారు. చంద్రబాబునాయుడు అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభు త్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. రాజకీయ వైరుధ్యాలు, విభేదాలతో ఆయన ఘనతను మరుగుపరుద్దామన్న ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపుదామనుకోవడమే అవుతుంది. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి  జైల్లో పెట్టినప్పుడు… ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణలతో ఉద్యోగాలు సాధించుకున్న లక్షలాది మంది ఇవేం కుట్రలని బాధపడ్డారు. ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని.. ఆయన పడిన కష్టాన్ని అందరితో పంచుకుంది.  అదీ చంద్రబాబు నాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే నాయకుడు. ఏదో గాలిలో అభివృద్ధి జరిగిపోయిందని వాదించే వారు.. ఓ అహ్మదాబాద్ ఎందుకు ఐటీ హబ్ కాలేదు.. ఓ లక్నో ఎందుకు కాలేదు.. ఓ కోల్ కతా ఎందుకు కాలేదు..  ఓ జైపూర్ ఎందుకు కాలేదు? అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరా? కానీ అశేష ఆంధ్రులు మరో ఆలోచన లేకుండా ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరు?    అక్కడ చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి లేరు అన్నదే.వారి జవాబు వచ్చిన అవకాశాల్ని అంది పుచ్చుకుని ప్రజల జీవితాల్ని బాగు చేయాలన్న సంకల్పం ఉన్న నేత అక్కడ లేరు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి చంద్రబాబు ఉపయోగించారు. చంద్రబాబు కృషికి, ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి  ప్రజల హృదయాలలో  ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా దేశ విదేశాల్లో తెలుగువారున్న ప్రతి చోటా ప్రతీ చోటా  వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలు.  రాష్ట్ర విభజనతో ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ను   అభివృద్ధి చేయాలని ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. ఏం కోల్పోయారో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు చూడని పదవి లేదు.. అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు  కాదు.. ఏపీకి ముఖ్యం. ఏపీ భవిష్యత్ కు ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ అంతా బైబై జగన్ అంటోంది. హ్యాపీ బర్త్ డే.. ఏపీ నీడ్స్ చంద్రబాబు !  (చంద్రబాబు జన్మదినం సందర్భంగా..)
Publish Date: Apr 20, 2024 9:23AM

తెలుగుదేశం ప్రచార గీతాల వీడియో విడుదల

ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌,  గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం  (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి  టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా  పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీలోని జగన్  ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం,  ప్రజలను వేధించిన విధానాలతో , భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది. ఈ పాటలను రూపొందించడంలో  ముఖ్యపాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాన్నారు.  పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ...  ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజం ప్రభావం ఉంటుందనీ,  జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను  స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా పాటలు రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.  కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.   అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నదన్నారు.  రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తన  వంతు బాధ్యతగా  కంకణబద్దులై పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాటలలో ప్రతి వర్గం పడుతున్న బాధలను కళ్లకు కట్టడమే కాకుండా, ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరన్నది కూడా   మనసుకు హత్తుకునే లా తెలియజేశాయని ప్రశంసించారు.  పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల  అరాచక పాలనకు చరమగీతం పాడాలనీ,  అటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న సత్సంకల్పంతో  ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రముఖ నిర్మాత, కె.ఎస్‌. రామారావు  ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్‌తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు  ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమేనన్నారు. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు. ఆ మండుటెండలు ఎలా ఉంటాయో ఏపీలోకి వెళ్లి చూస్తే   తెలుస్తుంది అన్నారు. ఏడు పదుల వయస్సులో  మండుటెండలో చంద్రబాబు  తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు. దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు  తనను తాను తగ్గించుకుని  రాష్ట్రం కోసం పని చేస్తున్నారు, అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్‌ చేసుకుంటుంటే బాధ కలుగుతోందంటూ కేఎస్ రామారావు భావోద్వేగానికి గురయ్యారు.   ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే   ద్దేశంతో, టి.డి. జనార్థన్‌ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తు న్నామన్నారు.  వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుకి మీ అందరి సహకారం కావాలి, ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కేఎస్ రామారావు అన్నారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్‌ రావు ఈ పాటలను   టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి. ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్‌. రామారావు   చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్‌, శ్రీనివాస్‌ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్‌ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్‌ చేసి సాంగ్స్‌ ను చేశాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్‌ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌  ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌ తదితరులు పాల్గొన్నారు.
Publish Date: Apr 19, 2024 4:59PM

చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి.. బలంగా పుంజుకున్న కళా వెంకటరావు!

మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Apr 19, 2024 4:33PM

ఆశల పల్లకిలో కేసీఆర్!

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.   లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు.  ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
Publish Date: Apr 19, 2024 3:43PM

రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
Publish Date: Apr 19, 2024 2:59PM