political-news-img

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌ రాజీనామా ఎందుకు చేశారంటే?

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అస‌లు రాజీనామా ఎందుకు చేసిన‌ట్టు? ఆయ‌న విష‌యంలో అస‌లేం జ‌రిగింది? ఆయ‌న చుట్టూ అల్లుకున్న నోట్ల వివాద‌మేంటి? అని చూస్తే.. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ప్రస్తుతం భారత న్యాయ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామా వెనుక ఉన్న ప్రధాన కారణం.. కాలిన నోట్ల కట్టల వివాదం. పర్యవసానంగా జరుగుతున్న అభిశంసన ప్రక్రియ. అందుకే ఇప్పుడు ఆయన రాజీనామా హాట్ టాపిగ్గా మారింది. 2025, మార్చి 14న.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన తన నివాసంలో లేరు. మంటలను ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి స్టోర్ రూమ్‌లో భారీ ఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ మొత్తం కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఎవరో అక్కడ పెట్టారని జస్టిస్ వర్మ మొదటి నుంచీ ఖండిస్తూ వచ్చారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గితే, ఆయన అవమానకర రీతిలో పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అంతే కాకుండా, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. విచారణ కమిటీ తన వాదనలను వినిపించడానికి ఏప్రిల్ 10 నుండి సమయం ఇచ్చింది. కానీ దానికి ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 9, 2026న ఆయన రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన తన లేఖలో తీవ్రమైన మనస్తాపం వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరించి రాష్ట్రపతి కార్యాలయానికి భారం కలిగించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అయితే, తనపై జరిగిన విచారణ అంతా అన్యాయంగా సాగిందని, భవిష్యత్తులో చరిత్రే దీనికి సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. సాధారణంగా న్యాయమూర్తులు రాజీనామా చేయడం అరుదు. గతంలో జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ సౌమిత్ర సేన్ వంటి వారు కూడా ఇలాగే అభిశంసనను ఎదుర్కొంటున్న తరుణంలో రాజీనామా చేశారు. జస్టిస్ వర్మ కూడా అదే బాటలో నడిచారు. వ‌ర్మ‌ రాజీనామాతో పార్లమెంటులో జరుగుతున్న అభిశంసన ప్రక్రియ ఇప్పుడు నిలిచిపోతుంది. ఆయన సాధారణ పదవీ విరమణ పొందినట్లుగానే పరిగణించబడతారు, తద్వారా ఆయనకు పెన్షన్ సౌకర్యం లభించే అవకాశం ఉంది. అందుకే ఆయ‌నిలా చేసిన‌ట్టుగా భావిస్తున్నారు.

Publish Date: Apr 11, 2026 11:59PM

political-news-img

హైదరాబాదులో ఈ సిగరెట్ రాకెట్ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ బృందం, నాంపల్లి పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి భారీగా ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బజార్‌ఘాట్ ‘ఏ’ బ్యాటరీ లైన్ సమీపంలో పోలీసులు నిఘా ఉంచారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై నిషేధిత ఈ-సిగరెట్లు సరఫరా చేస్తున్న మొహమ్మద్ అహ్మద్‌)ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సరుకును స్వీకరించేందుకు వచ్చిన మొహమ్మద్ అస్జాద్ రజాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్‌లోని వినీత్ మంత్రి నివాసంపై దాడి జరిపి అతడిని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు సోషల్ మీడియాను వినియోగిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి నుంచి పార్సిల్ సర్వీస్ ద్వారా ఈ సరుకును పెద్ద మొత్తంలో తెప్పించేవారని కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు మొత్తం 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఒక బర్గ్‌మాన్ ద్విచక్ర వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.34.03 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Publish Date: Apr 11, 2026 11:47PM

political-news-img

220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ కింగ్స్

క్రికెట్ మజా ఏంటన్నది ఐపీఎల్ 2016 కళ్లకు కడుతోంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్చూ కన్నుల పండువగా సాగుతోంది. పరుగుల పండుగ కొనసాగుతోంది. . న్యూ చండీగఢ్ వేదికగా శనివారం (ఏప్రిల్ 11) జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఇంకా 1.1 ఓబర్లు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛఏదించింది. టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అయితే, భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అయితే సన్‌రైజర్స్ బౌలర్ శివాంగ్ కుమార్ ఒకే ఓవర్‌లో వీరిద్దరినీ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై పట్టు బిగించిందని అనిపించింది. అయితే పంజాబ్ కింగ్స్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు జల్లాడు. శ్రేయస్ అయ్యర్ కేవలం 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డే/నైట్ మ్యాచ్‌లలో 215 పైచిలుకు భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది.

Publish Date: Apr 11, 2026 11:25PM

political-news-img

ఆలస్యం అమృతం విషం.. యూపీఏ ఆలస్యమే భారత్ కు శాపమా?

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాకి ఇంధన భద్రత అన్నతి ఒక అతి పెద్ద అవరోధంగా మారింది. గత రెండు దశాబ్దాల్లో భారత్ వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. అంతర్జాతీయ రాజకీయాలు, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాల కారణంగా ఈ రంగానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను భారత్ చేజార్చుకుంది. వీటిలో ముఖ్యమైనది ఇరాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా సహజవాయువు అందించేందుకు ఉద్దేశించిన పీస్ పైప్ లైన్ ప్రాజెక్టు అంటే ఇరాన్ పాకిస్థాన్ ఇండియా (ఐపీఐ) ప్రాజెక్ట్. ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు. అయితే.. అమెరికా ఒత్తిడి, అలాగే పాకిస్థాన్ ద్వారా గ్యాస్ తరలింపు విషయంలో తలెత్తిన భద్రతా పరమైన సందేహాలు, అనుమానాలు ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు కూడా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం. ఇక మయన్మార్ గ్యాస్ ప్రాజెక్టు. మయన్మార్‌లో గెయిల్ సంస్థ గ్యాస్ నిల్వలను కనుగొన్నప్పటికీ, దానిని భారత్‌కు తెచ్చుకోవడంలో ఇండియా విఫలమైంది. మయన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ బంగ్లాదేశ్ తో ఒప్పందం విషయంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. ఈ జాప్యాన్ని చైనా తనకు అనుకూలంగా మలచుకుని మయన్మార్‌తో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఇండియాకు రావాల్సిన గ్యాస్ పైప్‌లైన్ ద్వారా చైనాకు చేరుతోంది. ప్రస్తుతం ఇండియా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇది డిపెండెన్సీ ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. 2005లో ఇండియా ఇంధన దిగుమతులు 70 శాతం ఉండగా, 2025 నాటికి అవి 88 శాతానికి చేరాయి. యూపీఏ హయాంలో నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన తాత్సారం కారణంగానే ఇంధన భ్రదత విషయంలో భారత్ వెనుకబడిందన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. ఇక గతంలోని లోపాలను విమర్శించుకుంటూ కూర్చోవడం కంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. గతం గత: అన్నట్లుగా యూపీఏలో జరిగిన తప్పిదాలపై విమర్శలతో కాలం గడపడం మాని ఆ తప్పిదాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని ఇంధన విషయంలో స్వావలంబనవైపు అడుగులు వేయడం ఇప్పుడు భారత్ ముందున్న తక్షణ కర్తవ్యం.

Publish Date: Apr 11, 2026 6:13PM

political-news-img

పులివెందుల పేరు అవిగొడ్డలి.. షర్మిల ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

వైసీపీ అధినేత జగన్ ను ఆయన సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. జగన్ పై తెలుగుదేశం, జనసేనల పార్టీలను మించి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ఇటీవల పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించడంతో ఎన్డీయే ప్రభుత్వం మైలేజ్ సాధించగా, దానిని అడ్డుకునేందుకు వైసీపీ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి సాధ్యం కాదని, అది కేవలం భ్రమ అని ప్రచారం చేస్తున్న వైసీపీ తీరును షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే పేరును షర్మిల జగన్ దిమ్మదిరిగేలా ఎద్దేవా చేశారు. మావిగన్ అమరావతికి ప్రత్యామ్నాయం అయితే.. పులివెందులకు అవి గొడ్డలి అని పేరుపెట్టడం సబబుగా ఉంటుందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చి గొడ్డలిని ముడపెడుతూ పులివెందులకు అవిగొడ్డలి అని పేరుపెట్టాలని జగన్ కు సూచించారు. అవినాష్ రెడ్డి పేరులోని అవి అక్షరాలను వివేకా హత్యకేసులో గొడ్డలికి ముడిపెడుతూ ఆమె జగన్ లక్ష్యంగా సంధించిన విమర్శనాస్త్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అయ్యింది. జగన్ రాజధానికి ప్రతిపాదించిన మావిగన్ పేరు కంటే.. తాను పులివెందులకు సూచించిన అవిగొడ్డలి పేరు జనానికి తేలిగ్గా అర్ధమౌతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనను తిప్పికొడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు.. అమరావతి స్వయం సమృద్ధి నగరం అంటూ వివరణలు ఇచ్చుకుంటుంటే.. షర్మిల మాత్రం దూకుడుగా వైసీపీ అధినాయకత్వాన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించా, కూటమి పార్టీల కంటే ముందున్నారు. ఇప్పుడు షర్మిల చేసిన అవి గొడ్డలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Publish Date: Apr 11, 2026 5:20PM

political-news-img

విజయసాయి సెకండ్ ఇన్నింగ్స్!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు అది నిజమే. అలాగే రాజకీయ సన్యాసం అన్నది కూడా అంత తేలిక కాదు అని విజయసాయి చెప్పకనే చెబుతున్నారు. తాన రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా శేష జీవితం గడుపుతానని ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ సారి ఆయన పోలిటికల్ అవతారం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ తో మొదలు కానుంది. ఔను ఆయన తాను దేశ వ్యాప్తంగా తన గళాన్ని వినిపించడం కోసం, తన అభిప్రాయాల ప్రచారం కోసం ఒక డిజిటల్ మీడియాను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి. వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. ఇప్పుడు తన రాజకీయపంధాను ఒకింత మార్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భాషా సంస్కారంతో సంబంధం లేకుండా గతంలో ప్రత్యర్థులపై ఇష్టారీతిగా విమర్శలు చేసిన విజయసాయి.. ఇప్పుడు తాను ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా తటన్థంగా ఉంటానంటుండటమే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మద్దతుగా ఉన్న తరుణంలో తటస్థం అంటూ మీడియా రంగంలోకి అడుగుపెడతానంటున్నారు విజయసాయిరెడ్డి. ఈ కొత్త నిర్ణయంపై పరిశీలకులు భిన్నరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చినప్పటికీ విజయసాయిని తెలుగుదేశం కానీ, జనసేన కానీ దగ్గరకు రానీయడం లేదు. వైసీపీపైన ఆ పార్టీలకు ఎంత వ్యతిరేకత ఉందో, అంతకు ఏ మాత్రం తగ్గకుండా విజయసాయి మీద కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ద్వారా బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో విషయమేంటంటే.. తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ మధ్య కొత్తగా విజయసాయి తన మీడియా సంస్థ ద్వారా ఏ మేరకు నిలదొక్కుకుంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయన వివాదాస్పద రాజకీయ ప్రస్థానం, నేపథ్యమే కారణమంటున్నారు. ఆయన మీడియా సంస్థను ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం కూటమి పార్టీలూ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయి సెకండ్ ఇన్నింగ్స్‌ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరమేనంటున్నారు.

Publish Date: Apr 11, 2026 4:41PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img