చంద్రబాబు, కేసీఆర్ దారులు వేరు గానీ లక్ష్యం ఒక్కటే

Publish Date:Dec 12, 2014

Advertisement

 

ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకు చూస్తుండగానే అప్పుడే ఆరు నెలలు నిండాయి. రెండు రాష్ట్రాలకు వేటికవే ప్రత్యేకమయిన సమస్యలు. ఇరువురు ముఖ్యమంత్రులకు విభిన్నమయిన ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు, ప్రణాళికలు. కానీ ఇద్దరు పటించే మంత్రం మాత్రం ఒక్కటే. అభివృద్ధి. ఈ ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి ఏమి సాధించారు? ఏ రాష్ట్రం ఏ దిశలో అడుగులు వేసింది. వేస్తోంది...అని చూస్తే చాలా ఆసక్తికరమయిన విషయాలు కనబడతాయి.

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రం దొరకగా, చంద్రబాబుకి కనీసం విస్తరి కూడా లేని పరిస్థితి. కేసీఆర్ అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం దక్కితే, చంద్రబాబుకి కనీసం కార్యాలయం కూడా లేని వింత పరిస్థితి. కేసీఆర్ కి మిగులు బడ్జెట్ తో రాష్ట్రం చేతికి అందివస్తే, చంద్రబాబుకి లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పగ్గాలు అందుకొన్నారు. అయితే వారు పగ్గాలు చెప్పట్టేనాటికి రెండు రాష్ట్రాలలో కూడా విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. దాని నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడగలిగింది కానీ ఇంతవరకు కూడా తెలంగాణా మాత్రం బయటపడలేకపోయింది.

 

గత రెండు మూడు దశాబ్దాలుగా అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది కనుక అక్కడ పరిశ్రమలు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. కానీ విభజన తరువాత చూసుకొంటే ఒక్క విశాఖలో తప్ప ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదనే చేదు నిజం బయటపడింది. కానీ తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రాలో వ్యవసాయరంగం చాలా బలంగా ఉంది. కారణం నీటి సౌకర్యం, విస్తారంగా సారవంతమయిన భూములు ఉండటమే.

 

అందువలన తెలంగాణాకు ఇప్పుడు వ్యవసాయం ప్రాధాన్యమయితే, ఆంధ్రాకు పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యంగా మారింది. అందుకే ముఖ్యమంత్రుల ప్రాధాన్యతలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కుదుటపరిచేందుకు గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ, వాటర్ గ్రిడ్ ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకు తెలంగాణాలో వ్యవసాయం బోరు బావుల మీదే ప్రధానంగా ఆధారపడి సాగేది. అందువలన విద్యుత్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ పూర్తి శ్రద్ద కనబరచినట్లు లేదు. బహుశః ఈ చెరువుల పునరుద్దరణ జరిగితే, వ్యవసాయం కోసం విద్యుత్ పై ఇంతగా ఆధారపడే పరిస్థితి ఉండబోదు కనుక అప్పుడు విద్యుత్ పరిస్థితి కూడా దానంతట అదే మెరుగు పడుతుందనే నమ్మకం కావచ్చును.

 

కేసీఆర్ ప్రధానంగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు, బాషల పునరుద్దరణపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. తద్వారా ప్రజలలో మరింత బలంగా తెలంగాణా భావన కలిగించి తన పార్టీని ప్రజలకు మరింత దగ్గిరకి చేర్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక తెలంగాణాలో అత్యధికం శాతం బీసీ, యస్సీ, యస్టీ జనాభే ఉన్నారు గనుక వారికి దగ్గరయ్యేందుకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన అంతర్యం ఏమయినప్పటికీ ఆయన ప్రకటించిన సంక్షేమ పధకాల ఫలాలు వారికి దక్కినట్లయితే తప్పకుండా తెలంగాణాలో సామాజిక విప్లవం వస్తుంది.

 

ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చాలా మంచి ఆలోచనే కానీ దాని చుట్టూ వంద అంతస్తుల భవనాలు ఇంత అర్జెంటుగా ఎందుకు నిర్మించాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, తను స్వయంగా ప్రకటించిన రుణాల మాఫీ, పెన్షన్లు, పలు సంక్షేమ కార్యక్రమాలు, మొదలుపెడుతున్న వివిధ ప్రాజెక్టులు వంటివాటిని పరిష్కరించకుండా హైదరాబాద్ నగరానికి మరింత గొప్ప పేరు రావాలనే కారణంతో ఇటువంటి అనవసర పనులను తలకెత్తుకోవడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధీటుగా తను కూడా నగరాన్ని అభివృద్ధి చేసానని చెప్పుకోవాలనే కాంక్షతోనే బహుశః కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారేమో?

 

ఇక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా తన లక్ష్యాన్ని మరువకుండా చకచకా ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు విద్యుత్ స్వయం సంవృద్ది, పరిశ్రమల స్థాపన, తద్వారా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడం, రాజధాని నిర్మాణం. వీటన్నిటిపై ఆయన ఏవిధంగా అడుగులు వేస్తున్నారో స్వయంగా ప్రజలే చూస్తున్నారు.

 

రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తన హామీని నిలబెట్టుకొంటూ పంట రుణాల మాఫీ చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు కూడా అందజేస్తున్నారు. వ్యవసాయం, సంక్షేమ పధకాల అమలు, ఐటీ మరియు మౌలిక వసతుల రంగాల అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. బహుశః త్వరలోనే ఆ రంగాలలో కూడా త్వరలోనే అభివృద్ధి కనబడవచ్చును. ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ ఆరోగ్యకరమయిన పోటీని ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ ఐదేళ్ళలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈవిధంగా పోటీపడుతూ తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపించగలిగితే, ప్రజలు కూడా మళ్ళీ వారికే పట్టం కడతారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.