అన్నీ నీటి మీద రాతలేనా?

Publish Date:Dec 15, 2014

Advertisement

 

తెలంగాణా రాష్ట్రం ఇస్తే తెరాసను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోనియాగాంధీకి హామీ ఇచ్చారు. కానీ హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీకే ఆయన హ్యండిచ్చారు. చివరికి తెలంగాణా ఇచ్చిన ఖ్యాతి కూడా ఆమెకు దక్కకుండా చేసారు. అంతే కాదు తెలంగాణా ఇస్తే బొంత పురుగునయినా ముద్దాడేందుకు సిద్దమని చెప్పిన కేసీఆర్, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మట్టి కరిపించారు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ధాటికి ఎదురు నిలవలేకపోవడం విచిత్రం.

 

తెలంగాణా ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి తన ఉద్యమానికి దళితుల మద్దతు పొందిన కేసీఆర్, కుంటి సాకులతో ఆ హామీని తీసి పక్కన పడేసి తనే స్వయంగా ముఖ్యమంత్రి సింహాసనంలో సెటిల్ అయిపోయారు.

 

తెలంగాణా ఉద్యమంలో దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేసుకొన్నారని, తాము అధికారంలోకి రాగానే వారందరి కుటుంబాలను అదుకొంటామని చెప్పిన ఆయన, అధికారం చేప్పట్టిన తరువాత కేవలం 459మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబాలకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించారు. అంటే అప్పుడు ఆయన చెప్పిన లెక్కలు ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు చెప్పిన తప్పుడు లెక్కలా లేకపోతే మిగిలిన అమరవీరులను గుర్తించడానికి ఆయన ప్రభుత్వం సిద్దపడటం లేదా? అనేది ఆయనే చెప్పాలి.

 

అటువంటప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే ప్రశ్నకు పాపం ఆయనే జవాబు చెప్పుకొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తనను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోదనే విషయం ఉద్యమ సమయంలోనే తనకు తెలుసునని, తన భవిష్యత్ ఏమిటో తనకు అప్పుడే అర్ధమయిందని ఆయన చెప్పడం గమనిస్తే, తెరాస పార్టీ, తెలంగాణా ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఏపాటి విలువిస్తున్నారో అర్ధమవుతుంది.

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడటమే తరువాయి రాష్ట్రం నలుమూలలా నాలుగు స్థంభాలు నాటేసి విద్యుత్ సంక్షోభాన్ని తుడిచి పెట్టేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని తాపీగా చెపుతున్నారు. ఆగినట్లయితే కంటి రెప్ప మూసేంత సేపు కూడా విద్యుత్ పోకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తానని మళ్ళీ మరో కొత్త ప్రామిస్ చేస్తున్నారు. అయితే అందుకు ఆయన గట్టిగా ఏమయినా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అటువంటిదేమీ కనబడటం లేదు. అంటే ఈ ప్రామిస్ కూడా ఆయన మిస్ అయ్యే అవకాశాలే ఉన్నట్లు కనబడుతున్నాయి.

 

ఇక చైనా పాకిస్తాన్ దేశాలతో నదులను పంచుకోగా లేనిదీ ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదీ జలాలను, విద్యుత్ ని పంచుకోలేవా? అని విభజనను వ్యతిరేకించిన సమైక్యవాదులను గట్టిగా నిలదీసిన కేసీఆర్, ఇప్పుడు సుప్రీం కోర్టులకి వెళుతున్నారు.

 

తెలుగు ప్రజలు రాష్ట్రాలవారిగా రెండుగా విడిపోయినా అన్నదమ్ములలాగే కలిసిమెలిసి ఉండగలరు అని చెప్పిన ఆయనే మీ విద్యార్ధులు వేరు మా విద్యార్ధులు వేరు అంటూ ఫాస్ట్ పధకం తీసుకువచ్చి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొంటున్నారు. కనీసం ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇక నీళ్ళు, విద్యుత్ పంచుకోవడం సరేసరి.

 

ఇరుగుపొరుగు రాష్ట్రాలు, పార్టీల సంగతి పక్కన బెట్టవచ్చును. కానీ ఇంతకాలం ఆయనతో కలిసి తెలంగాణా కోసం ఉద్యమాలు చేసిన స్వంత పార్టీ నేతలని, ఉద్యమనేతలని కూడా ఆయన పక్కనబెట్టి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమంటే “ఇప్పుడు మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకొన్నాము కదా అందుకే ఆ పాత రూల్స్ వర్తించవని” తెగేసి చెప్పగలగడం కూడా గొప్పే.

 

ఈవిధంగా చెప్పిన మాటలను, చేసిన బాసలను, అండగా నిలిచినా వారినీ అందరినీ పక్కన పడేస్తూ, మళ్ళీ సరికొత్త హామీలు చేస్తూ, సరికొత్తవారితో జత కడుతూ కేసీఆర్ గాలిమేడలు (ఆకాశ హర్మ్యాలు) కడుతూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రయత్నంలో తెలంగాణా ప్రజలకు రంగురంగుల కలల ప్రపంచం చూపిస్తున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తుంటే తన, తన పార్టీ, ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బ తిట్టుందనే సంగతి మరి ఆయన గ్రహించారో లేదో తెలియదు కానీ విశ్వసనీయతకు మారు పేరని చెప్పుకొనే ఆంధ్రా పార్టీ ఇప్పుడు తెలంగాణాలోకి అడుగుపెడుతుంటే, మౌనం వహించడం గమనిస్తే మున్ముందు ఆ రెండు పార్టీలు జత కడతాయేమోనని అనుమానించవలసి వస్తోంది.

 

కేసీఆర్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళినప్పటికీ, ఎవరిని చంక నెక్కించుకొని, ఎవరిని పక్కనపడేసి నప్పటికీ, మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో కోటి రతనాల వీణ తెలంగాణాని బంగారి తెలంగాణాగా మార్చి చూపగలిగితే పరువలేదు. లేకుంటే ఆయనపై నమ్మకం పెట్టుకొన్నందుకు తెలంగాణా ప్రజలే ఎక్కువ బాధ పడతారు. ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో తెలంగాణా అభివృద్ధి చెందలేదని బాధ పడినవారు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ తమ జీవితాలలో ఎటువంటి మార్పు కనబడకపోతే నిరాశ చెందడం తధ్యం. అప్పుడు కేసీఆర్ ఏ సెంటిమెంటు ప్రయోగించినా ఫలితం ఉండకపోవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.