కేసీఆర్ చేసిందే జగన్ చేస్తే... వర్కవుట్ అవుతుందా?

Publish Date:Sep 26, 2016

Advertisement

చలికాలంలో రోగమొస్తే వేసుకున్న మందే ఎండాకాలంలో వచ్చిన మరో రకం రోగానికీ ఎవరైనా వేసుకుంటలారా?వైఎస్ జగన్ అలాంటి ఘనకార్యమే చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది!అసలు విషయం అర్థం కావాలంటే మనం ఒకసారి రాష్ట్ర విభజన ముందు నెలకొన్న పరిస్థితుల్లోకి వెళ్లాలి...
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే ఒక అస్త్రం ప్రయోగించే వారు.అదే రాజీనామా అస్త్రం.ఓ సారి తాను ఒక్కడే చేస్తే మరోసారి పార్టీ ఎమ్మేల్యేలు,ఎంపీలు అందర్నీ రాజీనామా చేయించేవాడు.ఇలా ఆయన ఎప్పటికప్పుడు తన రెసిగ్నేషన్ స్ట్రాటజీతో జనంలో వుండే వారు. ఉద్యమం సెగ తగ్గకుండా చూసుకునే వారు!
వైఎస్ జగన్ కేసీఆర్ అప్పట్లో వాడిన అస్త్రం ఇప్పుడు ప్రయోగిద్దామనుకుంటున్నాడు!ఇదే అసలు సమస్య.అప్పుడు రాజీనామాల ప్లాన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అనుకోవటం అవివేకం.అందుకు కారణం మారిపోయిన పరిస్థితులు,మారిపోయిన డిమాండ్లే!
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఎమోషనల్ అంశం ఆసరా చేసుకుని ఓట్ల కోసం వెళ్లారు.అయినా కూడా కొన్ని సార్లు బొక్కబోర్లా పడ్డాల్సి వచ్చింది.కాని,ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంత ఎమోషనల్ టాపిక్ ప్రత్యేక హోదా కాదు.జనానికి హోదా రావాలని వున్నా ప్రత్యేక ప్యాకేజీతో ఆల్రెడీ కేంద్రం కొంత సాటిస్ ఫై చేసేసింది.మరో వైపు ప్రత్యేక హోదా ఇక మీదట సాధ్యం కాదని క్లియర్ గా చెప్పేసింది.కేవలం ఆంధ్రాకే కాదు దేశంలో ఎవ్వరికీ ఇవ్వబోమని ఢిల్లీ పాలకులు చెప్పేశారు.మరి ఇటువంటి సమయంలో వైఎస్ జగన్ రాజీనామా అస్త్రం ఎంత వరకూ పని చేస్తుంది? కేసీఆర్ ఆంధ్రా వాళ్లని టార్గెట్ చేసినట్టు జగన్ ఎవ్వర్ని టార్గెట్ చేసి ఓటర్లని ఆకర్షిస్తాడు? కేంద్రాన్ని బలంగా విమర్శించే ఛాన్స్ లేదు.అంత దైర్యం అనేక కేసుల్లో ఇరుక్కున్న జగన్ కు వుంటే ఈపాటికే ఎన్నో సార్లు విమర్శలు చేసి వుండేవాడు!కాని, ఇంతవరకూ మోదీని,కేంద్రాన్ని పల్లెత్తు మాట ఆయన అనట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక మిగిలింది చంద్రబాబుని, టీడీపిని తిట్టిపోయటం! దీని వల్ల ప్రత్యేక హోదా రాదని తెలుసుకోలేనంత పిచ్చి వాళ్లా జనం? టీడీపి ఒత్తిడి వల్ల రావాల్సిన ప్యాకేజ్ వచ్చింది. ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసమని మెజార్జీ జనం భావిస్తున్నారు. మరి ఇటువంటప్పుడు జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఏం సాధిస్తాడు? ఎవరి మీద పోరాడతాడు?
జగన్ తన ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ దశలో ఎంపీల చేత రాజీనామా అంటూ ప్రకటించాడు.నిజంగా ఎంపీల చేత ఆయన రీసైన్ చేయిస్తారో లేదో మనకు తెలియదుగాని దాని వల్ల ప్రజలకు మాత్రం తీరని నష్టమే.త్వరలో మున్సిపల్ ఎన్నికలు వున్నాయి. అవ్వి అయ్యే వరకూ ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ఆగిపోతాయి. ఇలా లబ్ది పొందకుండా వున్న జనం జగన్ రాజీడ్రామాలతో మరికొంత కాలం సంక్షేమ పథకాలకి ముఖం వాచిపోవాల్సి వస్తుంది. పైగా జగన్ ఎంపీల రాజీనామా స్టేట్మెంట్లో హోదాపై ప్రేమ కన్నా పొలిటికల్ కాలిక్యులేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆయనకు వున్న ఎంపీలంతా రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాషం, నెల్లూరు జిల్లాల్లోనూ వున్నారు. వాళ్ల చేత రాజీనామా చేయించినా తిరిగి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ. అక్కడ చంద్రబాబు ప్రభావంగాని, టీడీపీ బలంగాని పెద్దగా టెన్షన్ పెట్టే సూచనలు కనిపించటం లేదు. ఈ భరోసాతోనే జగన్ రాజీనామా అస్త్రం అంటున్నాడని మనం అంచనాకి రావొచ్చు.పైగా ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా ప్రజలు టీడీపీ పాలనని వ్యతిరేకిస్తున్నారని ఋజువు చేయవచ్చు.ఇదీ జగన్ వ్యూహం... 
ఇక ఫైనల్ గా జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తే ఆయనకున్న మరో లాభం ఓదార్ప యాత్ర న్యూ సీజన్! అవును... తండ్రి పోయాడన్న కారణంతో జగన్ నెలల తరబడి రోడ్లపై వున్నాడు. ఓదార్చి ఓదార్చి జనం తనని మరవకుండా జాగ్రత్తపడ్డాడు. కాని, ఇప్పుడు మరోసారి వీదుల్లోకి వెళ్లాలంటే అలాంటి కారణం ఏం దొరకటం లేదు. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం రాజీనామానే! ఎంపీల రాజీనామా అంటే బోలెడన్ని ఊళ్లూ, పట్టణాలు చాలా రోజుల వరకూ చుట్టి రావచ్చు. మీడియాలోనూ తప్పనిసరి పబ్లిసిటీ. ఇంతకంటే ప్రతిపక్ష నేతకి కావాల్సింది ఏముంటుంది? 
ఇప్పటికైతే జగన్ కన్ ఫర్మ్ గా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పలేదుగాని అదే జరిగితే జగన్ కు వచ్చే లాభం ఎక్కువ. జనానికి వచ్చే లాభం శూన్యం. ఎందుకంటే, హోదా ఇవ్వటం అనేది వైసీపీ ఎంపీలు కాదు మొత్తం ఆంద్రా ఎంపీలు అంతా రాజీనామా చేసినా ... 14వ ఆర్దిక సంఘం చెప్పేసింది కాబట్టి... కుదరని పని! అంతకు మించి ఉప ఎన్నికలు జరిగే దాకా నెలల తరబడి ఎలక్షన్ కోడ్ అమలు కావటంతో సామాన్య జనం సంక్షేమ పథకాలకి దూరం అవుతారు. ఇదీ జగన్ రాజడ్రామాతో కలిగే ప్రయోజనం! 

By
en-us Political News

  
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.