జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!
Publish Date:Jun 12, 2026
Advertisement
నలుగురికి నచ్చినది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ పై ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాత పల్లవినే వినిపించారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తై.. అభ్యర్థులు విధుల్లో చేరినప్పటికీ.. పాతచింతకాయ పచ్చడి లాంటి ధోరణిలోనే జగన్ ఆరోపణలు గుప్పించడంపై సొంత పార్టీ నేతలలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎందుకంటే డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో జగన్, వైసీపీ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో సాక్ష్యాధారాలతో సహా స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పాత ధోరణిలోనే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేయడం గమనార్హం. ఇక జగన్ యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజకీయవర్గాలలోనే విస్మయం వ్యక్తం అవుతున్నది. నిరుద్యోగ యువత తిరగబడుతుందంటూ.. ఆయన "ఇది జెన్-జీ , జెన్-ఆల్ఫా, రాష్ట్రంలో కాక్రోచ్లు లేస్తాయి.. తాను కూడా కాక్రోచ్ నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను నవ్వుల పాటు చేశాయి. నెటిజనులైతే జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు అంటూ బొద్దింకలను హిట్ నిర్మూలించినట్లే.. జనం జగన్ ను ఛీ కొడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నిటికీ మించి రాజకీయవర్గాలలో జగన్ పరిపక్వతపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఆయన కాక్రోచ్ వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా.. కేవలం ప్రభుత్వాన్ని దూషించడమే పరమావధిగా పెట్టుకుంటే.. జగన్ ను జనం మరింత దూరం పెట్టడం ఖాయమని పరిశీలుకులు అంటున్నారు. తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలురపాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధినేత విధానాలను గుడ్డిగా సమర్థించిన కీలక నేతలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వరుసగా వలసలు పోతుంటే, ఉన్నవారైనా వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే నైజం ఆ పార్టీ లీడర్షిప్లో లోపించిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రెస్మీట్తో వైసీపీ శ్రేణులకు మరియు మిగిలిన నాయకులకు తమ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇదే పంథాను నమ్ముకుని వెళ్తే రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమవుతున్న వైఖరిని గమనించిన తర్వాత, సొంత పార్టీ నేతల్లోనే అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికైనా ఒక నిశ్చయానికి రావడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా, కేవలం ఊహాజనిత ఆరోపణలతో కాలం గడిపితే ప్రజల్లో ఉన్న కనీస ఆదరణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలోనైనా వైసీపీ అధినాయకత్వం ప్రజా క్షేత్రంలోని వాస్తవాలను గ్రహించి ప్రవర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశీలకులు.
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ రూట్లో నే నడిచెదరో
ఇది ఒక సినిమాలో పాట.. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మెగా డీఎస్సీని తన హయాంలో ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో తానే కాక్రోచ్ ని అవుతానన్న మాటలూ చూస్తుంటే... ఆయన రూటే సెపరేటు అని నెటిజనులు ఎద్దెవా చేస్తున్నారు. నలుగురికి అవసరమైనది కాకుండా, ఆయనకు ఏది తోస్తే అది చేస్తారనీ, ఎది అనిపిస్తే అది మాట్లాడతారని అంటున్నారు. 2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన మీడియా సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పట్టించుకోకుండా.. ఆవు కథలాంటి ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/netizens-troll-jagan-cacroach-comments-45-222777.html




