political-news-img

ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ ఫోకస్.. నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం సూచించారు. ఎస్ఐఆర్ వల్ల పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, వలస కార్మికుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Publish Date: May 29, 2026 9:27PM

political-news-img

ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు, రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక నేరాలకు అడ్డుకట్ట వేయడంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు వేర్వేరు అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు జరిగాయి. నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించడం మరియు పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి సమీక్షలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బలోపేతంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. సంస్థకు ఉన్న విలువైన ఆస్తులను వాణిజ్యపరంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల (Electric Buses) వినియోగాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పాల్గొన్న ఈ సమావేశంలో బస్సుల క్రమబద్ధమైన నిర్వహణపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశంపై కార్మిక సంఘాల నేతలతో అధికారులు ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజా రవాణా రంగంలో ఆర్టీసీ మునుపటి వైభవాన్ని సంతరించుకునేలా సరికొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల నియంత్రణపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా నిరంతరం ‘సైబర్ పెట్రోలింగ్’ నిర్వహించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సరికొత్తగా ‘ఏపీ సైబర్ గార్డ్’ (AP Cyber Guard) వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిక్స్ పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్ (6 Pillars Response Teams) ద్వారా ఈ తరహా నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎవరైనా బాధితుడు సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్ రూమ్‌లో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు కావాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరానికి పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేమనే భయం నేరగాళ్లలో కలగాలని అధికారులకు ఉద్ఘాటించారు. ఈ సైబర్ భద్రతా వ్యూహంలో బ్యాంకింగ్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్‌లైన్ మోసాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి బాధితుల సొమ్మును హోల్డ్‌లో పెట్టేలా బ్యాంక్ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల అటు ఆర్టీసీ కార్మికుల్లో, ఇటు నిరంతరం సైబర్ బెదిరింపులకు గురవుతున్న ఐటీ నిపుణులు, సాధారణ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Publish Date: May 29, 2026 9:11PM

political-news-img

ట్రబుల్ షూటర్ నుంచి సీఎం కుర్చీ వరకు... డీకే శివకుమార్ ప్రస్థానం

దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్‌గా ఫ్యామస్.. కర్ణాటక సీఎంగా పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అపజయం ఎరుగని వ్యూహకర్తగా, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడైన 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచారు . నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవుల వరకు ఎదిగారు. కనకపుర ప్రాంతంలో ఆయనకున్న తిరుగులేని పట్టు కారణంగా ఆయనను 'కనకపుర బండ' అని కూడా పిలుస్తారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ద్వారా డీకే శివకుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 1989లో తన 27వ ఏట సాథనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో ఎనిమిది సార్లు వరుసగా విజయం సాధించిన నేతగా రికార్డుల కెక్కారు. 1989 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ ఎన్నికల్లో సాథనూర్, కనకపుర నియోజకవర్గాల నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. ఎస్‌.ఎం. కృష్ణ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా, సిద్ధరామయ్య క్యాబినెట్‌లో ఇంధన శాఖ మంత్రిగా, ఆ తర్వాత భారీ నీటిపారుదల, వైద్య విద్యా శాఖల మంత్రిగా విజయవంతంగా పనిచేశారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2023 మే నెలలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి, జలవనరుల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు సంక్షోభంలో పడినా డీకే శివకుమార్ ముందుండి పరిష్కరించేవారు. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు, అక్కడి ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌లో ఉంచి ప్రభుత్వాన్ని కాపాడారు. అహ్మద్ పటేల్ గెలుపు కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2018లో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్నీ తానే అయి నడిపించారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్‌లో ముందుగా కుదిరిన అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగా, 2026 మే 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనితో, సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం శ్రమించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. శివకుమార్ కర్నాటకలోని బెంగుళూరు సమీపంలోని కనకపురలో కెంపేగౌడ మరియు గౌర్ అమ్మ దంపతులకు జన్మించాడు . ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు డీకే సురేష్ అనే తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు మరియు వారికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు మరియు ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది . డీకే భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరవ్వడం విశేషం.

Publish Date: May 29, 2026 8:50PM

political-news-img

జగన్ హయాంలో గనుల అక్రమాలపై ఈడీ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గనులశాఖలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌, రాజస్థాన్‌లోని జయపూర్‌, తమిళనాడు లోని కోయంబత్తూర్ ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత స్థాయి సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈడీ దర్యాప్తు ప్రకారం ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ (GCKC), టర్న్‌కీ సంస్థలకు సంబంధించిన కార్యాల యాలు, నివాస గృహాలు, అనుబంధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో కీలకంగా భావి స్తున్న బోయిన్‌పల్లి శ్రీనివా సరావు, అశోక్‌కుమార్‌, గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరిగినట్లు తెలిపింది. అయితే దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. ముఖ్యంగా ఇసుక టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిం చారని ఆరోపించింది. కొంతమంది ప్రైవేట్ కంపెనీ లకు అనుకూలంగా అప్పటి అధికారులు వ్యవహరించి నట్లు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించాయని ఈడి తెలిపింది.గనులశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకటరెడ్డి కొన్ని సంస్థలకు అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు ఈడీ అనుమానిస్తోంది. టెండర్ విధానంలో పారదర్శకత పాటించలేదని, ప్రభుత్వా నికి భారీగా ఆదాయ నష్టం కలిగేలా చర్యలు జరిగా యని ఆరోపించింది. సోదాల సమయంలో భారీ మొత్తంలో నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకు న్నట్లు ఈడీ వెల్లడించింది. మొత్తం రూ.1.53 కోట్ల నగదు, రూ.1.30 కోట్ల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడి తెలిపింది. అదనంగా స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, విదేశీ కరెన్సీ రూపంలో 1800 అమెరికన్ డాలర్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో భాగంగా రూ.2,407 కోట్ల విలువైన ఒప్పందాలకు సంబంధిం చిన లావాదేవీలపై వివరణ ఇవ్వాలని సంబంధిత సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ భారీ మొత్తాల ఆర్థిక లావాదేవీ లకు సరైన లెక్కలు, పత్రాలు సమర్పించాలని ఆదేశిం చింది.ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం హయాంలో గనులశాఖలో అవినీతి, అక్రమాలపై ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ తాజా ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించు కుంది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Publish Date: May 29, 2026 8:35PM

political-news-img

న్యాయవాది హత్య ఆరోపణలు...కాంగ్రెస్ నుండి ఆలమ్ ఖాన్ సస్పెన్షన్

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో అరెస్టైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలమ్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ముజాహిద్ ఆలమ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలను పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణించిందన్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు, పాత శత్రుత్వాలు, ఆర్థిక వ్యవహారాల కోణంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగినట్లు దర్యాప్తులో తేలుతున్నట్లు సమాచారం. ఖాజా మొయినుద్దీన్ నగరంలో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాస్పద కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించేవారు. ఆయన హత్యతో న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత పేరు ఈ కేసులో రావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీలో స్థానం ఉండదనే సంకేతం ఇవ్వడానికి వెంటనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో అమలు చేసిన కాంట్రాక్ట్ కిల్లింగ్ కుట్ర దాగి ఉందని దర్యాప్తులో తేలింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు, వ్యక్తిగత కక్షలు కలిసి ఈ హత్యకు దారితీశాయని పోలీసులు వెల్లడించారు. 2026 మే 23వ తేదీ ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ తన ప్రతిరోజు అలవాటులో భాగంగా స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న తన వాహనం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, నెంబర్ ప్లేట్లు లేని ఆకుపచ్చ రంగు మహీంద్రా స్కార్పియో వాహనం ఒక్కసారిగా అతివేగంతో దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాజా మొయినుద్దీన్ దాదాపు 10 మీటర్ల దూరం ఎగిరిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స కోసం అబిడ్స్‌లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.

Publish Date: May 29, 2026 7:57PM

political-news-img

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వివిధ రకాల బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఏకంగా 2,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కేవలం 100 రోజుల్లోనే మొత్తం 6,000 కోట్ల రూపాయల ఉద్యోగ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం ఆ రోజు స్పష్టమైన గ్యారెంటీ ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పుడు మొదటి విడత కింద ఈ 2,000 కోట్ల రూపాయలను ఖజానా నుండి విడుదల చేశారు. ఈ భారీ నిధుల విడుదల వెనుక డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ నిధులను తక్షణమే అకౌంట్లలో జమ చేసేలా ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నిధుల ద్వారా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, మెడికల్ బిల్లులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, ప్రొవిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలకు లబ్ధి చేకూరనుంది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, బకాయిల ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రభుత్వ సిబ్బందికి ఈ తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. మొత్తం మూడు విడతల్లో ఈ 6,000 కోట్ల రూపాయల బకాయిలను పూర్తిగా చెల్లించేలా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు విడుదలైన మొదటి విడత 2,000 కోట్ల రూపాయల నిధులు నేరుగా ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల ఖాతాల్లోకి చేరనున్నాయి. మిగిలిన 4,000 కోట్ల రూపాయలను కూడా అనుకున్న కాలపరిమితి లోగా, అంటే వచ్చే కొన్ని వారాల్లోనే రెండు విడతలుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, ఎక్కడా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా సాగేలా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ సర్కార్ మరోసారి నిరూపించుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం సాధారణ విషయం కాదని ఆర్ధిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Publish Date: May 29, 2026 7:40PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img