ఏపీలోనే దిక్కు లేదు.. ఇక్కడేం సీఎం అవుతాను?

Publish Date:Jun 3, 2026

Advertisement

ఈ కామెంట్లను ఎలా అర్ధం చేసుకోవాలి? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావాలంటే చూడండి.. పవన్ ఇందులో చాలా పెద్ద వ్యూహరచన సిద్ధం చేశారనే చెప్పాలంటారు మరి కొందరు. ఈ మాటలోంచి ఆయన ఓ రెండు వర్గాల వారిని గట్టిగానే లాగిపెట్టి కొట్టారు. అందులో మొదటిది తన కులం కాగా, రెండోది అభిమానగణం.  ఆంధ్రప్రదేశ్ లో  అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని  కదా? అని ప్రశ్నిస్తారు పవన్. ఫైనల్ గా 2024 ఎన్నికల్లో గెలిస్తే.. అది కూటమి ఓటు బ్యాంకు వల్ల. ఇక రెండోది ఆయన అభిమానగణం రచ్చ రావిడి చేయడానికి తప్ప అది ఓటు బ్యాంకుగా మారిందే లేదు. ఈ విషయంలోనూ ఆయనకో క్లారిటీ ఉంది. వాళ్లేదో క్రేజ్ కొద్దీ గొడవలకు పాల్పడ్డం తప్ప.. ఆయనకంటూ ఇప్పటి వరకూ ఓటర్లుగా మారి వర్క్ చేసిందే లేదన్న నిశ్చితాభిప్రాయం పవన్  కల్యాణ్ ది.

ఇలా వీరిని టార్గెట్ చేస్తూనే ఇటు తెలంగాణలో తనకు ఏపీలో అంతంత మాత్రం బలం ఉందంటూ.. తనను తానొక లైట్ పవర్డ్ పొలిటీషియన్ గా చెప్పుకోవడం అనేదొక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్‌ పెద్ద పోటీ కాదులే అన్న తలంపు ఇక్కడ రాజకీయనాయకులకు వస్తుందన్నది ఆయన వ్యూహం కావచ్చు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే  అనిరుధ్ రెడ్డి ఒక కొత్త పాయింట్ లేవదీశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్‌,  అమిత్ షాను  కలిసినపుడు.. తెలంగాణ కూటమి వ్యవహారం మాట్లాడి ఉంటారనీ,  దాని ప్రభావమే ఆయన ఇక్కడ నవ నిర్మాణ సభ ఏర్పాటు అన్నారాయన.  

ఇదంతా ఇలా ఉంటే పవన్ హిమ్ సెల్ఫ్.. ఇక్కడ టీడీపీ తమతో కలుస్తుందో లేదో కూడా తమకు తెలీదని అన్నారు. అంతే కాదు..  బీజేపీ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేనట్టే మాట్లాడారు. కానీ అనిరుధ్ మాటలను బట్టీ చూస్తే..  తెలంగాణలో బీఆర్ఎస్- బీజేపీ- జనసేన కూటమి కట్టి.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆపై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోరాడనున్నట్టు తెలుస్తోంది.

అంటే ఏపీలో కూటమిలోని ప్రధాన పార్టీ తెలంగాణలో లేదన్న సంకేతాలను ఇచ్చారు పవన్. ఆపై తమతో ఎవరు కూటమి కట్టినా కట్టకపోయినా జీహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే..   తెలంగాణలో అన్ని ఎన్నికల్లోనూ తాము పాల్గొంటామని గ్లాసు బద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్‌. దానికి తోడు గోదావరి నదితో తనను తాను పోల్చుకున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరి తెలంగాణలోనూ ప్రవహించడం లేదా? తాను కూడా అంతే అన్నారాయన. దానికి తోడు పుష్కర కాలం కిందట ఆంధ్రలో రాజకీయాలు చేయడానికి గానూ తెలంగాణ లో పుట్టిందాయన పార్టీ జనసేన. అచ్చం ఆయనలాగే.

ఎక్కడో ఏపీలోని బాపట్లలో పుట్టి- నెల్లూరులో చదివి- చెన్నైలో ఎదిగి- హైదరాబాద్ కి వచ్చి పలు సినిమాల్లో నటించి.. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఆపై ఎన్నో వైఫల్యాలను ఎదుర్కుని.. అటు పిమ్మట గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ సేన.. దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ఎన్నో యత్నాలు చేస్తూనే ఉంది.. ఇటీవల కేరళలో కూడా తమ పార్టీని ఏర్పాటు చేయాలని చూసింది.  అలాంటి జనసేనాని పవన్ ఏపీలో తనకు సీఎం అయ్యే దిక్కులేదనడమేంటి? ఇక్కడ అంటే తెలంగాణలో సీఎం కావడం కూడానా? అనడంలో తాత్పర్యమేంటి? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.

అయితే పవన్ ఇలా లైటర్ వాన్ డైలాగ్స్ కొడుతూ.. జనాన్ని ఒకానొక గందరగోళంలో పెడుతూనే.. తన ప్రస్ధానం కొనసాగిస్తూ వస్తారనీ.. అదాయన రాజకీయ శైలిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలా అంటూనే ఆయన ఇప్పటి వరకూ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగలిగారనీ.. ఆపై ఆయన టార్గెట్ సీఎం కూడా అయి ఉండొచ్చనీ.. ఏమో కాలం ధర్మ కలిసి వస్తే- వచ్చే రోజుల్లో ఆయన తెలంగాణకు సీఎం అయినా అవుతారనీ అంటారు కొందరు.  ఏమో గుర్రం ఎగురావచ్చనే ఈ కాన్సెప్ట్ లో భాగంగా.. పవన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో చూడాలి మరి.

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.