పిఠాపురం వర్మపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులు.. ఉన్న కాస్త పరువూ పోతోందంటూ

Publish Date:Mar 31, 2025

Advertisement

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా తన విజయం వెనుక పిఠాపురం వర్మ ఉన్నారంటూ ఎక్ నాలెడ్జ్ చేశారు. అయితే  ఆ తరువాత పరిణామాలు వర్మకు, జనసేనకు మధ్యగ్యాప్ వచ్చేందుకు కారణమయ్యాయి. ఇటీవల జనసేన ఆవిర్భావం సందర్భంగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన నాగబాబు చేసిన ఖర్మ వ్యాఖ్యలు ఈ దూరాన్ని మరింత పెంచాయి. అయితే పిఠాపురం వర్మ మాత్రం తాను చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో, వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పిఠాపురం వర్మ మాత్రం సంయమనాన్నే పాటిస్తున్నారు.  

అయితే వర్మ విషయంలో వైసీపీ మాత్రం నానా హంగామా చేస్తున్నది. వర్మకు తామే శ్రేయోభిలాషులం అన్నట్లుగా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నది. ఆయన నోటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాకపోయినా... వర్మ వైసీపీ గూటికి చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో  అంటే 2029లో పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు గట్టి పట్టు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది.  ఆ తర్వాత తెలుగుదేశంలో  చేరిన వర్మ… పార్టీకి,  పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పినంతనే… వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటుగా జనసేనానికి మద్దతుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయంలో  కీలక పాత్ర పోషించారు. 

అయితే…పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తే,..ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకు ఇచ్చిన హామీని చంద్రబాబు అనివార్య కారణాల వల్ల నిలబెట్టుకోలేదు.  దీంతో  వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనీ, ఆయన త్వరలో వైసీపీ గూటికి చేరతారనీ ఆ పార్టీ  సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది. 2029 ఎన్నికలలో పిఠాపురం వర్మ వైసీపీ అభ్యర్థిగా పవన్ కు ప్రత్యర్థిగా నిలబడతారంటూ ఊదరగొట్టేస్తోంది. అయితే  ఈ ప్రచారంపై వర్మ నుంచి స్పందన లేదు. ఆయన తెలుగుదేశం పట్ల తన విధేయతను పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన అనుచరులను సముదాయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి పని చేసుకుపోతున్నారు. జనసేనతో తనకు విభేదాలు లేవని చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. అనవసర, అసత్య ప్రచారాలతో వైసీపీ ఉన్న కాస్త పరువునూ పోగొట్టుకుంటోందంటూ పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. 

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.