తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న ద్రావిడ పార్టీలను చిత్తు చేసి ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో తమిళ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న రాజకీయ పరిణామం దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తాజాగా అప్పు డే రాబోయే 2031 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ అన్నామలై గా మారతాయంటూ విశ్లేషకులు పెద్ద చర్చకు తెరలేపారు.
అయితే వాదనలు, చర్చ, క్షేత్రస్థాయిలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నూతన సీఎం విజయ్ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందుగానే తన రాజకీయ పార్టీని ప్రకటించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆరెండేళ్లూ.. నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
మరోవైపు బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. ఒకప్పుడు కర్ణాటక క్యాడర్ లో సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై.. తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమలం పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో దూకుడు నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. గతంలో డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీని వీడడంతో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవేళ అన్నామలై సొంతంగా ముందుకు సాగినా విజయ్ స్థాయిలో ప్రజాదరణను, ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీలో పనిచేసి, దానిని వీడి తన రాజకీయ అపరిపక్వతను ఆయనంతట ఆయనే స్వయంగా బయటపెట్టుకున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ వెనుక కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ ఉండి ఓట్లు వేసి గెలిపించారు. కానీ.. అన్నామలైకి ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే ఓటు బ్యాంక్ లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-vs-annamalai-in-tamilnadu-25-221613.html
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.