వెంకయ్య చెప్పిన వేదం!

Publish Date:Jan 30, 2014

Advertisement

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతాపార్టీ మనసు మారుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పిన మాటలు మొన్నటి వరకూ నమ్ముతూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈ విషయంలో అసలు వాస్తవాలను తెలుసుకుంది. అందుకే బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గానీ, కిషన్ రెడ్డి నుంచి గానీ తెలంగాణ విషయంలో ఏకపక్ష ప్రకటనలు రావడం లేదు. తెలంగాణ రావాల్సిందే.. కానీ సీమాంధ్రుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఇప్పుడు బీజేపీ కొత్త పల్లవి పాడుతోంది.

 

తెలంగాణ విషయంలో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు కిషన్‌రెడ్డికే మొత్తం అధికారం ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బోడిగుండులా అయిపోయింది. దాంతో ఇంతకాలం మౌనం వహించిన బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. తెలంగాణ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లను సరిదిద్దే పనిలో ఆయన ప్రస్తుతం వున్నారు. కేంద్రం పంపిన తెలంగాణ బిల్లు తప్పుల తడకలా వుందని, ఈ బిల్లు ఇటు తెలంగాణ వారికి గానీ, అటు సీమాంధ్ర ప్రజలకు గానీ ఆమోదయోగ్యంగా లేదని వెంకయ్య నాయుడు చెబుతూనే వున్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందేమోనన్న భయం మొన్నటి వరకూ సీమాంధ్ర ప్రజల్లో వుండేది. అయితే వెంకయ్య నాయుడు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ భయం తగ్గింది.



బుధవారం నాడు విజయవాడలో వెంకయ్య ఏర్పాటు చేసిన బహిరంగసభ సీమాంధ్రులలో ధైర్యాన్ని కలిగించింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత సులభం కాదన్న విషయం కూడా స్పష్టమైంది. వెంకయ్య నాయుడు వేదం లాంటి ఒక మాట అన్నారు. ‘‘ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ భారతదేశాన్ని ఏలుతోంది. విజయవాడలో పుట్టినవాడు హైదరాబాద్‌లో వుండకూడదా?’’ అని వెంకయ్య అన్న మాట సీమాంధ్రులలో ధైర్యాన్ని ఎంతగానో పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేయాలని తలపెట్టిన అడ్డగోలు విభజనకు భారతీయ జనతాపార్టీ ఒప్పకోదన్న నమ్మకం ఇప్పుడు సీమాంధ్రులలో మరింత బలపడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని, తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడగలిగే కీలక వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు కూడా ఒకరు.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.