షర్మిలపై మంత్రి హాట్ కామెంట్స్ 

Publish Date:Feb 28, 2021

Advertisement

వైఎస్ షర్మిల పార్టీ రాకముందే   తెలంగాణలో రాజకీయ కాక పెరుగుతోంది. రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె చేపిన వ్యాఖ్యలు, కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో  షర్మిలను టార్గెట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ మరోసారి షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నగంగుల.. సీఎం కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని.. టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ షర్మిలను కొన్ని రోజులుగా గంగుల కమలాకర్ టార్గెట్ చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. ‘ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ వస్తారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. కేసీఆరే మన రక్షకుడు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు.’ అని గంగుల కమలాకర్ ఇటీవల కామెంట్ చేశారు. 

By
en-us Political News

  
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు. ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.