చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకీ హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండడం వల్ల.. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చని భావించారు. జూలై 6,7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జింగ్ పింగ్ హాజరు కావడం లేదని చెప్పడంతో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నారు. తొలిసారిగా ఆయనీ బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరువుతున్నారు.
జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కి జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గానూ వ్యవహారిస్తున్నారు. చైనా లో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? అన్నదొక చర్చ. ప్రస్తుతం చైనాలో జనరల్ ఝాంగ్ యుజియానే అధికారం చెలయిస్తున్నట్టు తెలుస్తోంది. జనరల్ ఝాంగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నారు. జనరల్ ఝాంగ్ 24 మంది సభ్యులు గల.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు. సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ ఝాంగ్ యుజీయ కి బలంగానే ఉంది. సెంట్రల్ కమిటీ లో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో అనుచరులున్నారు.
సెంట్రల్ కమిటీ లో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియా కి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు హు జింటావో మద్దతుదారులు కావడం వల్ల జింగ్ పింగ్ కి వీరంతా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చైనా లోని పాఠశాల విద్యార్థులకు జింగ్ పింగ్ పాఠాలు చెబుతున్నారు. చైనా పాఠశాల పుస్తకాల్లో జింగ్ పింగ్- ఆలోచనలు అనే పేరు మీద విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులకి నచ్చడం లేదట. ఇప్పటికే మావో- ఆలోచనల పేరిట పాఠాలు చెబుతుండగా కొత్తగా ఈ జిన్ పింగ్ ఆలోచనలేంటన్నదొక ప్రశ్న.
అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవం, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని తన అనుచరులకే ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తుదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు.. గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదని అంటారు. వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదన్నది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/china-president-39-201120.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.