తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?

Publish Date:Jul 15, 2014

Advertisement

 

 స్వర్గీయ యన్టీఆర్ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకి రప్పించడం కోసం సినీ ప్రముఖుకు కొందరికి ప్రభుత్వం ఉదారంగా భూములు ఇచ్చి ప్రోత్సహించింది. వారందరూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరంగా నిలద్రోక్కుకొనేందుకు చాలా కృషిచేసిన మాట ఎవరూ కాదనలేరు. వాటిలో చాలా మంది సినీ ప్రముఖులు స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు వంటివి నెలకొల్పినప్పటికీ, కొందరు వాటిలో మల్టీ ప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్సులు వంటివి నెలకొల్పడం, మరి కొందరు ప్రముఖులు తమ స్టూడియోలకు కేటాయించిన భూములలో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వడం, తమ భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంవంటి పనుల వలన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటిని నడిపే రాజకీయ నాయకులతో సత్సంబంధాల వల్ల వారు ఆడించే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్ళు నడిచింది. అయితే కాలం ఎల్లపుడు ఒక్కలాగే సాగదని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.

 

సినీ పరిశ్రమలో చాలా మంది ఆంద్ర ప్రాంతానికి చెందినవారే అయి ఉండటంతో సహజంగానే వారు తెలంగాణకు వ్యతిరేకులనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నటులు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీని తీవ్రంగా విమర్శించడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అదిగాక చిత్ర పరిశ్రమ చాలా కాలంగా కొందరు ఆంద్ర నిర్మాతల చేతిలో ఉండిపోవడంతో, పరిశ్రమలో తెలంగాణాకు చెందినవారు తమకు చాలా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నారు.

 

కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు, దానివల్ల ఏర్పడిన వ్యతిరేఖత కారణంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగి ఉండటంతో అక్రమాలకు పాల్పడిన సినీ ప్రముఖులకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేగాక ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని నిశ్చయించుకొంది. ఆ లిస్టులో చాలా మంది సినీ ప్రముఖులే ఉన్నారు. గనుక వారందరూ ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంతో ఉండటం సహజమే.

 

అయితే ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను ఏ వైజాగుకో తరలించడం సాధ్యమయ్యే పనికాదు గనుక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సినీ ప్రముఖులు వీలయినంత త్వరగానే పరిశ్రమను ఆంధ్రాకు తరలించే అవకాశం ఉంది. వారు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినప్పటికీ, కొన్ని స్వయంకృతాపరాధాల వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. వాటికి తోడూ రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడటం, ప్రభుత్వం కూడా తెలంగాణా సినీ పరిశ్రమను, కళాకారులను ప్రోత్సహించాలని భావించడం వంటి అనేక కారణాలు తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రాకు తరలిపోయేందుకు అవకాశం కల్పిస్తోంది.

 

బహుశః రానున్న ఒకటి రెండేళ్ళలోనే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పూర్తిగా తరలివచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వారు దురాశకు పోయి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా ఇప్పుడయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి కలగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే, ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా కటినంగా వ్యవహరించడం చాలా అవసరం.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.