దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది. కఠిన భద్రత మధ్య, ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కారుతో వి.వి.ఐ.పీ గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించడం భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన తెల్లటి టాటా సియెర్రా ఎస్యూవీ అసెంబ్లీ గేటు నెంబర్–2 వద్దకు అత్యంత వేగంగా చేరుకుంది. సాధారణంగా కఠిన అనుమతులు ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే ఈ గేటును, ముసుగు ధరించిన వ్యక్తి ఇనుప గేటు, బూమ్ బారియర్లను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు.
లోపలికి వెళ్లిన అనంతరం, ఆ వ్యక్తి కారు దిగి అసెంబ్లీ పోర్చ్ ప్రాంతానికి చేరుకుని, స్పీకర్ విజేందర్ గుప్తకు చెందినదిగా భావిస్తున్న వాహనం వద్ద ఒక పూల బొకే ఉంచాడు. వెంటనే తిరిగి కారులోకి చేరి, వచ్చిన వేగంతోనే భద్రతా ఏర్పాట్లను దాటుకుంటూ బయటకు పారిపోయాడు.ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వెంటనే హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు, ఫోరెన్సిక్ బృందాలు అసెంబ్లీ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు సర్బ్జిత్ సింగ్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం యజమానే నడిపాడా? లేక మరెవరైనా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.సెంట్రల్ రేంజ్ స్పెషల్ కమిషనర్ అనిల్ శుక్లా, లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన కారు, సుమారు 2:15 గంటల సమయంలో ఓ రిక్షా కార్మికుడిని ఢీకొట్టినట్లు సమాచారం. బాధితుడి స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. నిందితుడి ప్రయాణ మార్గాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పగటిపూట, సాయుధ భద్రత మధ్య ఉన్న అసెంబ్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్లోకి ఒక వ్యక్తి కారుతో ప్రవేశించి, తిరిగి సులభంగా బయటపడటం భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. నిందితుడు అక్కడ బొకే ఎందుకు ఉంచాడు? ఇది నిరసనా? వ్యక్తిగత సందేశమా? లేక భద్రతా వ్యవస్థను పరీక్షించడానికేనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/car-crashes-into-gate-of-delhi-assembly-36-216787.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.