ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థిగా బీసీకి చాన్స్

Publish Date:Jan 18, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు  కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది.

అయితే ఈ సారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా  ఉదయగిరి  అసెంబ్లీ నియోజకవర్గ   అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌   నాయకత్వంలోని వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి   పోటీ   దాదాపుగా ఖరారైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో భాగంగా బీసీ అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి బహిష్కృతుడై తెలుగుదేశం గూటికి చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి పోటీకి దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన బీద రవీంద్ర పేరు ప్రస్తావించినప్పటికీ, ఆయన కూడా పోటీలో నిలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో తెలుగుదేశం నుంచి ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఇద్దరు బీసీ నేతలు రేసులో నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఒకరైన చంచల్ బాబు యాదవ్ అయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవగలుగుతారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో ఈ సీటులో పోటీ కోసం రేసులో నిలిచిన రెండో వ్యక్తి డాక్టర్ మల్లికార్జున రావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైర్ అయిన డాక్టర్ మల్లికార్జున రావు రిటైర్మెంట్ తరువాత నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అన్నిటికీ మించి యాదవ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది.  ఒక్క ఉదయగిరి అనే కాకుండా మరో రెండు నియోజకవర్గాలలో కూడా బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న యోచనతో తెలుగుదేశం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లలో బీసీ కార్డ్ ద్వారా సత్ఫలితాలు పొందాలని తెలుగుదేశం యోచిస్తుంటే.. జగన్ పార్టీ కూడా జిల్లాలో బీసీలకు పెద్ద పీట వేసే యోచనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటున్నారు.  

By
en-us Political News

  
దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లో విఫలమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అంతే కా కుండా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్ గాఅక్షర్ పటేల్ ను నియమించారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు.
వచ్చే ఏడాది భారత్‌, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక గున్న ఏనుగు సురక్షితంగా తప్పించుకుంది. ఆ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అదలా ఉంటే ఈ ప్రమాదం గువాహ‌టికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
విద్యార్థులను కాలుష్యం బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్తం స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
మృతులను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. ఇటీవలే వీరికి వివాహమైంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.
ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోడ్లు చెరువులను తలపించాయి. విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీచ్‌లు, పార్కులు మూసివేశారు.
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్ 22 బంతుల్లో 37 పరుగులు, . అభిషేక్ శర్మ 21 బంతుల్లో34 పరుగులు చేశాడు. ఆ తరువాత తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు పరుగుల సునామీ సృష్టించారు.
ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.