రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం!

Publish Date:Feb 5, 2024

Advertisement

రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం.. ఇదే కొటేష‌న్ తో సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సీఎం రేవంత్ త‌న‌దైన శైలిలో అద్భుత‌ పాల‌న సాగిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ల‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుంట‌డం గ‌మ‌నార్హం.  ఇంత‌కీ.. రేవంత్‌, జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ఎందుకు చ‌ర్చ జ‌రుగుతోంది?  రేవంత్ రెడ్డి చేసిన ప‌నేంటి.. జ‌గ‌న్ చేయ‌ని ప‌నేంటి?  అంటే.. 

ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, సినిమా వాళ్ల‌కు  అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హీరోలంటే ప్ర‌జ‌లు ఎంతో గౌర‌విస్తారు. హీరోల‌కు అభిమాన సంఘాల‌తోపాటు.. వారి పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు సైతం చేస్తుంటారు.   రాజ‌కీయ పార్టీల గెలుపోట‌ముల్లో సినీ హీరోల ప్ర‌భావం కూడా ఉంటుంది. ఇలాంటి ఘట‌న‌లు అనేకం ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు నుంచి వైఎస్ఆర్‌, కేసీఆర్‌, ప్ర‌స్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు సినిమా వాళ్ల‌ను ఎంతో గౌర‌వంగా చూసుకుంటూ వ‌చ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. చిరుతో పాటు మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు కూడా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వ‌రించింది. మ‌రి కొంద‌రు తెలుగు వారికి ప‌ద్మ శ్రీ అవార్డులు ద‌క్కాయి. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కిన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. తాజాగా చిరు, వెంక‌య్య నాయుడుతో పాటు ప‌ద్మ శ్రీ అవార్డుల గ్ర‌హీత‌ల‌ను రేవంత్ స‌ర్కార్ స‌న్మానించింది. అంతేకాక‌, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌కు రూ. 25ల‌క్షలు, నెల‌నెలా రూ. 25వేల పెన్ష‌న్ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల నుంచి రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 

స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి, వెంక‌య్య నాయుడు సైతం రేవంత్ స‌ర్కార్ స్పందించిన తీరుప‌ట్ల ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రేవంత్ పాల‌న తీరును పొగిడారు. మ‌రో వైపు రాజ‌కీయాల‌కు అతీతంగా అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌న్మాన  కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ‌ ప‌రంగా నిర్వ‌హించ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో రేవంత్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. రేవంత్   సంస్కారానికి ఇది నిద‌ర్శ‌నం అంటూ సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే స‌మ‌యంలో ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ పై సోష‌ల్ మీడియాలో  రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ కామెంట్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. సోషల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులుకూడా మ‌ద్ద‌తు తెలుపుతుంన్నారు. ఇంత‌కీ.. జ‌గ‌న్ స‌ర్కార్ పై ఎందుకు అంత వ్య‌రేఖ‌త వ్య‌క్త‌మ‌వుతుందంటే.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌న సాగించిన అన్ని ప్ర‌భుత్వాలు సినిమా వాళ్ల‌పైన‌, వెంక‌య్య నాయుడు లాంటి పెద్ద‌వారిపై ఎంతో మ‌ర్యాద‌గా న‌డుచుకుంటూ వ‌చ్చాయి. కానీ, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సినిమా వాళ్ల‌పై చిన్న‌చూపుతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న ఉంది. మ‌రోవైపు వెంక‌య్య నాయుడు లాంటి వారిపై వైసీపీ నేత‌లు బాహాటంగానే విమ‌ర్శ‌లుచేసి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు. 

ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సినిమా వాళ్లంటే చాలా చిన్న‌చూపు అనే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో, సినీ వ‌ర్గాల్లో ఉంది. గ‌తంలో టికెట్ల రేట్ల నుంచి మొద‌లు పెడితే ప్ర‌తి విష‌యంలో సినిమా వాళ్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఎంత‌టి పేరున్న సినిమా హీరోలైనా ప్ర‌భుత్వానికి ఏమైనా సూచ‌న చేద్దామ‌ని చూసినా సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేయించి బెంబేలెత్తించేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. సినీ పెద్ద‌ల‌ని కాళ్ల బేరానికి ర‌ప్పించుకున్నారు జ‌గ‌న్‌. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారుసైతం జ‌గ‌న్ ముందు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేసుకోవాల్సి వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకొని వీడియో రిలీజ్ చేసి ఆనందం పొందారు. ఈ ఘ‌ట‌నతో జ‌గ‌న్ తీరుపై అప్పట్లో వైసీపీ శ్రేణుల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. కానీ, ఎవ‌రూ బ‌హిరంగంగా ఇది త‌ప్పు అని చెప్పే సాహ‌సం చేయ‌లేదు. చిరంజీవిలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లో విఫ‌లం అయి ఉండొచ్చు. కానీ, ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా.. ఆయ‌న‌కున్న అభిమానం   చెక్కుచెద‌ర్లేదు.

 జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూసే సినిమా రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌న్  పురస్కారంతో గౌర‌వించింది. అవార్డులు ప్ర‌క‌టించింది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వారికి ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ అవార్డుల రావ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాక శిల్ప‌క‌ళా వేదిక‌గా చిరు, వెంక‌య్య‌నాయుడు, ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. మ‌రోవైపు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మాత్రం  అవార్డు గ్ర‌హీత‌ల‌కు క‌నీసం క‌లిసి అభినంద‌న‌లు కూడా తెలపలేదు.  దీనిని ఎత్తి చూపుతూనే సినీ, రాజకీయవర్గాల్లో జగన్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ విస్తృతంగా ట్రోల్ అవుతోంది.  

By
en-us Political News

  
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయం పట్ల తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోని జనగామ చిల్లా కొన్నె గ్రామంలో ట్రంప్ విజయాన్ని అంబరాన్నంటే సంబరాలతో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ గ్రామస్తులు.
కల్వకుర్తికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఎన్నికల వేడి మాత్రం ఎప్పుడో పీక్స్ కు చేరింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో విపక్ష తెలుగుదేశం గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుండగా.. ఆ పార్టీకి జనసేన కూడా తోడు కావడంతో జోష్ తారస్థాయికి చేరింది.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరెడ్డి కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ, కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మొత్తం అంకెలగారడీతో సాగుతోంది. ఎక్కడా చెణుకులు, జోకులూ వినిపించడం లేదు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందించడం వినా నిర్మల బడ్జెట్ ప్రసంగానికి పెద్దగా సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు.
ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది. ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు. 
అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు....
సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.