తెలుగుదేశం,జనసేన ఉమ్మడి కార్యాచరణ.. వంద రోజుల టార్గెట్!

Publish Date:Nov 9, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఎన్నికల వేడి మాత్రం ఎప్పుడో పీక్స్ కు చేరింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో  విపక్ష తెలుగుదేశం గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుండగా.. ఆ పార్టీకి జనసేన కూడా తోడు కావడంతో జోష్ తారస్థాయికి చేరింది. ప్రభుత్వం మరో అవకాశం కావాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నప్పటికీ  ప్రజల నుండి  వ్యతిరేకతే వ్యక్తమౌతోందన్నది ప్రస్ఫుటమైంది.  వైసీపీ బస్సుయాత్రకు సొంత పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో  ప్రతిపక్ష పార్టీలు  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణతో  జనంలో మమేకమయ్యేందుకు రెడీ అయ్యాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదలతో రెండు పార్టీలలో మొదలైన కదలిక  ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ రూపంలో  ముందడుగు వేసింది. దీని కోసం రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీ నేతలు గురువారం (నవంబర్ 11) సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  

తెలుగుదేశం,జనసేన సమన్వయ కమిటీలు ఇప్పటికే అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో ఒకసారి సమావేశమై కార్యాచరణపై చర్చించగా.. తాజాగా రెండో సమావేశం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో గురువారం(నవంబర్9) నిర్వహించారు. ఈ రెండో సమావేశానికి తెలుగుదేశం తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్య నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరవ్వగా.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించిన్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సమన్వయ కమిటీల సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ హాజరు కాలేకపోయారు. తొలి సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించగా.. ఈ సమావేశానికి పవన్ తెలంగాణ ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కోర్టు బెయిల్ షరతుల నేపథ్యంలో చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. కాగా, ఈ సమావేశంలో రెండు పార్టీలు కలిసి చేపట్టనున్న ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 100 రోజుల పగడ్బంధీ ప్రణాళికతో ఈ రెండు పార్టీలు బరిలోకి దిగనున్నాయి. అంటే మూడు నెలలుకు పైగా నేతలు ప్రజలు మధ్యనే ఉండనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై కొంత అవగాహనకు వచ్చిన ఈ రెండు పార్టీలు అదే అంశాలను ప్రజల మధ్య చర్చకు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రజల నుండే ప్రత్యక్షంగా మరికొన్ని అంశాలను ఎంచుకొని మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, ఒక్కసారి టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఇరు పార్టీల జెండాలతో ప్రజల మధ్యకి వెళ్తే అధికార పక్షానికి వ్యతిరేకత మొదలైనట్లే. ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. ఈ తరుణంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తే వైసీపీ ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. గత రెండు నెలల ముందు కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలలో సూటి ప్రశ్నలతో ప్రభుత్వానికి ఎక్కుపెట్టగా సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు మొహం చాటేసిన పరిస్థితి కనిపించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మూడు నెలలకు పైగా ప్రణాళిక అంటే వైసీపీ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే భావించాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ప్రతిపక్షాల టార్గెట్ ఎలా ఉండబోతుంది.. అధికార వైసీపీ దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాంటి ఎత్తులు వేయనున్నారన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు.
ఆందోళ‌న‌లో వైసీపీ శ్రేణులు రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం.. ఇదే కొటేష‌న్ తో సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సీఎం రేవంత్ త‌న‌దైన శైలిలో అద్భుత‌ పాల‌న సాగిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ల‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుంట‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. రేవంత్‌, జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ఎందుకు చ‌ర్చ జ‌రుగుతోంది? రేవంత్ రెడ్డి చేసిన ప‌నేంటి.. జ‌గ‌న్ చేయ‌ని ప‌నేంటి? అంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, సినిమా వాళ్ల‌కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరెడ్డి కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ, కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మొత్తం అంకెలగారడీతో సాగుతోంది. ఎక్కడా చెణుకులు, జోకులూ వినిపించడం లేదు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందించడం వినా నిర్మల బడ్జెట్ ప్రసంగానికి పెద్దగా సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు.
ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది. ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు. 
అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు....
సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి....
Amarnath Yatra, pilgrims killed, Anantnag, Terrorists attack, Terror threat, Pahalgam, Prime Minister Narendra Modi, jammu and kashmir
jammu kashmir pulwama, Stone pelting security forces in jammu kashmir, Pulwama Stone pelting security forces
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.