స్పీడ్ న్యూస్ 3

Publish Date:Jul 18, 2023

Advertisement

31. తమ సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ  కార్మికులు ఈ రోజు మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.  తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

..........................................................................................................................................................

32. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.  

.........................................................................................................................................................

33. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ తో  టీఆర్టీ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆఫీసును  ముట్టడించారు. టెట్‌ డీఎస్సీ   ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

........................................................................................................................................................

34. వాలంటీర్లతో ఓటర్‌ వెరిఫికేషన్‌ చేయించాలని  సీఎం  జగన్  కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం  సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి  చిన రాజప్ప అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన ఎల్‌ఏలు చేయాల్సిన పని వాలంటీర్లకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  

.....................................................................................................................................................

35.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  రామచంద్రాపురంలో  అధికార వైసీపీ  నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో మంత్రి వేణుపై సుభాస్‌ చంద్రబోస్‌   సజ్జలకు ఫిర్యాదు చేశారు.

............................................................................................................................................

36.  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే  కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  భావసారూప్యత కలిగిన 26 పార్టీలకు చెందిన నాయకులం భేటీ అందుకేనన్నారు.   ప్రజల శ్రేయస్సు కోసం విభేదాలను విస్మరించి పని చేస్తామన్నారు. 

...............................................................................................................................................

37.  కోకాపేటలో బీఆర్ఎస్ కు  11 ఎకరాల భూ కేటాయింపుపై  ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను  ఆగస్టు 16కి వాయిదా వేసింది.

...............................................................................................................................................

39. రానున్న నాలుగు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నగర మేయర్  విజయలక్ష్మి  జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు.

......................................................................................................................................

40. ములుగు జిల్లా లోని బొగత జలపాతం జలకళను సంతరించుకుంది.   ఇటీవల కురిసిన వర్షాలకు జలపాతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు పోటెత్తుతున్నారు. 

..........................................................................................................................................................

41. మద్దిరాలలో ఓ రైతు విద్యుత్ షాక్ తో మరణించారు.  నెల్లుట్ల సోమయ్య అనే రైతు రోజూలాగే  వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద ఆన్ చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి మరణించాడు.   

....................................................................................................................................................

42.  ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం  కొద్ది సేపటికే ఎక్కడ టేకాఫ్ అయ్యిందో అక్కడే ల్యాండ్ అయ్యింది. దీనికి కారణం విమానంలో చార్జింగ్ పెట్టిన ఓ సెల్ ఫోన్ హీటెక్కి  పొగలు కక్కడమే. దీంతో  పైలట్‌ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

...........................................................................................................................................

43. బెంగళూరు వేదికగా జరుగుతున్న బీజేపీయేతర పార్టీల భేటీని  బీజేపీ సీనియర్ నాయకుడు బసనగౌడ పాటిల్   యత్నాళ్‌  దోపిడీ దొంగల భేటీగా అభివర్ణించారు. ఆ భేటీలో పాల్గొంటున్న వారొలో అత్యధికులు అవినీతి ఆరోపణలపై   బెయిలు మీద ఉన్నవారేనని పేర్కొన్నారు.  

...........................................................................................................................................

44. తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే రవిశంకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్ రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ వద్దంటూ కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని విమర్శించారు.

................................................................................................................................................

45. రాహుల్‌ గాంధీకి ఎడ్లు, ఎవుసం తెలియదన్న కే టీఆర్‌ వాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మండి పడ్డారు.  విద్యుత్ పై బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్రంలో ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని   డిమాండ్‌ చేశారు. 

............................................................................................................................................

46. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న నెల్లూరు జిల్లా వెంకటగిరి పర్యటనకు రానున్న నేపథ్యంలో    త్రిభువని సెంటర్లో రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను  అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.   తమ దుకాణాలును తొలగించడం పట్ల   దుకాణా దారులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

47.  ఏపీలో జగన్ సర్కార్ ను గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.  ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన తాజా రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పొత్తు, సీఎం అభ్యర్థి.. వంటి అంశాలపై  కీలక వ్యాఖ్యలు చేశారు.

.................................................................................................................................................

48. తెలంగాణలో  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  ఆయన దీనిపై చర్చకు చింతమడక, సిద్ధిపేట, సిరిసిల్ల ఎక్కడకు రమ్మన్నా వస్తానన్నారు. 

...............................................................................................................................................................

49. తెలంగాణ హైకోర్టులో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన  ఎస్ఆర్ గార్డెన్  భూముల్లో  ప్రభుత్వం సర్వే చేయించడంపై  పొంగులేటి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు  స్టేటస్ కో ఆర్డర్ జారీచేసింది.  విచారణను అగస్ట్ 1కి వాయిదా వేసింది. 

...............................................................................................................................................

50. కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆరే అంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో  వెలిసిన ఫ్లెక్సీల వెనుక ఉన్నది వైసీపీ నేతలేనని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగడాన్ని ఓర్చుకోలేకే ఈ ఫ్లెక్సీలు  పెట్టారన్నారు. 

By
en-us Political News

  
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.