ఏపీలో పొత్తులపై పునరాలోచన నిజమేనా?

Publish Date:Jul 18, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది తొలి భాగంలోనే ఏపీలో సార్వత్రికలు జరగనున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నా రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ మాటకొస్తే ఇంకా ఇది నాన్పుడు ధోరణిలోనే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులపై ఊహాగానాలు ఊపందుకోవడం.. ఆ తర్వాత మళ్ళీ చల్లబడడం అన్నట్లే ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ మధ్య ప్రతిపక్ష ఓటు చీలడం తనకు సుతరామూ ఇష్టం లేదని.. కావాలంటే మనమే ఒక మెట్టు కిందకి దిగి అధికార వైసీపీపై ప్రతిపక్షాలతో కలిసి పోరాడదామని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా.. ఈ మధ్య మాత్రం పవన్ నోటి నుండి ఆ ప్రస్తావన రావడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో కూడా పొత్తులపై ఊసులు లేవు. మరోవైపు బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయడం లేదు.

ఆ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని పిలుపు నిచ్చింది. మిత్ర పక్షాలతో దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా స్పదించనే లేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది. జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి టీడీపీకి ఆహ్వానం కూడా అందలేదు.  

జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి ఏ జనసేన పార్టీకి మాత్రమే ఆహ్వానం వచ్చింది. జనసేన హాజరైంది. అయినా కూడా ఎటువంటి స్పష్టతా రాలేదు సరికదా..కన్ఫ్యూజన్ మరింత  పెరిగింది.  పరిస్థితి చూస్తుంటే మాత్రం పొత్తులపై పార్టీలు పునరాలోచన చేస్తున్నాయా అనిపిస్తుంది. ముఖ్యంగా అటు బీజేపీ.. ఇటు టీడీపీ పొత్తులపై పునరాలోచన చేస్తున్నాయా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి అమిత్ షా - చంద్రబాబుల భేటీ సమయంలోనే ఈ పొత్తులపై ఏదో ఒక స్టాండ్ కనిపించాల్సింది. కానీ అసలు ఆ భేటీ వివరాలు కూడా బయటకి రాకుండా రెండు పార్టీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

అయితే, పొత్తులపై పునరాలోచన వెనక కారణాలను విశ్లేషించుకుంటే రెండు పార్టీలూ (బీజేపీ, తెలుగుదేశం) ప్రయోజనాలను లెక్కలేసుకొనే వెనక్కు తగ్గినట్లు భావించాల్సి వస్తుంది. ముందుగా టీడీపీ వైపు నుండి చూస్తే బీజేపీతో పొత్తు  వల్ల ఆ పార్టీకి రాష్ట్రంలో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. సరికదా.. ఒకింత చేటు కలిగే అవకాశం కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం  ఏపీ అనడంలో సందేహం లేదు.  కేంద్రంలో ప్రయోజనాల కోసమే ఇన్నాళ్లు టీడీపీ పొత్తు కోసం చూసింది. అయితే పొత్తు పెట్టుకుంటూ రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత  తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.  ప్రత్యేక హోదా  ఇవ్వకపోవడం,  విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోవడం.. కేంద్రం అండతోనే జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుపోయి ఉంది. ఈ వ్యతిరేకత తమపై కూడా చూపించే అవకాశం ఉందని టీడీపీ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీతో పొత్తు లేకపోయినా తమకు అధికారం దక్కుతుందని టీడీపీ ధీమా తో ఉందనీ, బీజేపీని పక్కన పెట్టి జనసేనను మాత్రం కలుపుకొని పోతే చాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దాదాపుగా బీజేపీ కూడా ఇలాంటి ప్రయోజనాల గురించే ఆలోచిస్తోందని అంటున్నారు.   టీడీపీతో కలిసి వెళ్లడంతో త్రుణమో ప్రాణమో దక్కుతుంది తప్ప తమ పార్టీ బలపడే ఛాన్స్ ఉండదు. అదే దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తే పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. వచ్చే ఎన్నికల తర్వాత ఓడిన పార్టీలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓడితే బీజేపీ పురందేశ్వరితో రాజకీయం నడిపించవచ్చు. టీడీపీ గెలిస్తే వరాలు కురిపించి మచ్చిక చేసుకోవచ్చు.  వైసీపీ గెలిస్తే ఇప్పుడు అవలంబిస్తున్న రహస్య చెలిమి సిద్ధాంతాన్నే కొనసాగించవచ్చు. ఈ క్రమంలోనే బీజేపీ నుండి కూడా  పొత్తు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ఏం జరుగుతుందన్నది . కొన్నాళ్ళు వేచి చూస్తేనే తెలుస్తుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.