Publish Date:Mar 10, 2026
తెలంగాణలో సైబర్ మోసాలపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ను బట్టబయలు చేశారు. మొత్తం 1,888 అనుమానాస్పద ఖాతాలను గుర్తించగా, వాటి ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు మోసాలు జరిగినట్లు అంచనా వేశారు.
ఈ ఆపరేషన్లో 549 కేసులు నమోదు చేసి 626 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్టు చేశారు. కొందరు తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో బయటపడింది. అరెస్టైన వారి నుంచి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం తీవ్రమైన నేరమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shikha-goel-36-215314.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.