రీజెన్సీ సెరామిక్స్ వ్యవస్థాపకుడు కన్నుమూత

Publish Date:Apr 30, 2026

Advertisement

ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్  వ్యవస్థాపకుడు  జీఎన్ నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 29) తుదిశ్వాస విడిచారు. 1983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మరణవార్త తెలిసి పరిశ్రమ వర్గాలు, సన్నిహి తులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జి.ఎన్. నాయుడు మరణంతో పరిశ్రమలో ఒక శూన్యం ఏర్పడిందని అంటున్నారు.. అతనికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు జీఎన్ నాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  జీఎన్ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. యానాంలో సిరామిక్స్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.  జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులకు  చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

By
en-us Political News

  
కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఇటీవల ఒక ప్రత్యేక సందర్భంలో వీరిద్దరూ కలిసినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా హుందాగా, ఆత్మీయంగా సాగింది. సచిన్ టెండూల్కర్ క్రీడా రంగానికి చేసిన సేవలను కొనియాడుతూనే.. వ్యక్తిగతంగా ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో షూట్‌కో లేదా మర్యాదపూర్వక భేటీకో పరిమితం అవుతుంది. కానీ లోకేష్, సచిన్ విషయంలో మాత్రం వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఉమ్మడి అభిరుచులు వారి సంభాషణలో ప్రతిబింబించాయి.
భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
ట్రాఫిక్ బూత్ లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ చోరవతో చల్లటి నీటి తుంపరలను చల్లే ఫ్యాన్ లు ఏర్పాటు చేశారు.
గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తరువాత లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు.
న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో.. పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను అభినందించారు.
అతివేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది.
ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది.  కీలకమైన ఈ పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.