Publish Date:Apr 30, 2026
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా సాగుతున్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం గురువారం(30-4-26)) కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి ఆదేశించడంతో కాకాణి హాజరుకాక తప్పలేదు.
పోర్జరీ కేసు నుంచి తన పేరును తొలగించాలని, అలాగే కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోర్టును కోరారు. అయితే.. అందుకు తగిన ఆధారాలు లేవని భావించిన న్యాయస్థానం.. ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే కేసులో కీలకమైన ఆధారాలు నెల్లూరు కోర్టు ప్రాంగణం నుంచే చోరీకి గురవ్వడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యాయాధికారిని కోరారు.
ఈ పరిణామంతో కాకాణి శిబిరంలో మళ్లీ జైలు భయం మొదలైంది. ఇప్పటికే కాకాణి వరదాపురు వైట్ క్వార్ట్జ్ కేసు సహా వరుసగా నమోదైన 8 కేసుల్లో 86 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవించి వచ్చారు. ప్రస్తుతం పోర్జరీ కేసులో ఆయనకు మళ్లీ కారాగార వాసం తప్పదన్న ఆందోళన కాకాణి అనుచరుల్లో కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kakanis-discharge-petition-dismissed-in-forgery-case-36-218641.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.